logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అపశృతులకు తావులేకుండా నిమజ్జనం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్‌ గద్వాల: వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అపశృతులకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఎర్రవల్లి మండలం బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ల వద్ద నిమజ్జన ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్ద విగ్రహాలు, వాహనాలు సులభంగా చేరుకునేలా రహదారులను చదును చేసి అవసరమైన చోట మట్టి, మొరం, రాళ్లతో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. రహదారిపై వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, రాత్రివేళల్లో తగినంత లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాల వాహనాలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసి బారికేడింగ్‌ చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతంలోకి అనవసర వాహనాలు రాకుండా చర్యలు చేపట్టాలని, జేసీబీలు, క్రేన్లు, రోలర్లు, ఇతర అత్యవసర వాహనాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచడంతో పాటు మత్స్యకారులు, గజ ఈతగాళ్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్‌, ఎస్పీ పేర్కొన్నారు. పర్యటనలో ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

15 hrs ago
user_Ram  Ram
Ram Ram
Journalist Gadwal, Jogulamba Gadwal•
15 hrs ago
e1643106-e39c-417e-ac69-d23c28379065

అపశృతులకు తావులేకుండా నిమజ్జనం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్‌ గద్వాల: వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అపశృతులకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఎర్రవల్లి మండలం బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ల వద్ద నిమజ్జన ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్ద విగ్రహాలు, వాహనాలు సులభంగా చేరుకునేలా రహదారులను చదును చేసి అవసరమైన చోట మట్టి, మొరం, రాళ్లతో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. రహదారిపై వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, రాత్రివేళల్లో తగినంత లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాల వాహనాలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసి బారికేడింగ్‌ చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతంలోకి అనవసర వాహనాలు రాకుండా చర్యలు చేపట్టాలని, జేసీబీలు, క్రేన్లు, రోలర్లు, ఇతర అత్యవసర వాహనాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచడంతో పాటు మత్స్యకారులు, గజ ఈతగాళ్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్‌, ఎస్పీ పేర్కొన్నారు. పర్యటనలో ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం (పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు. జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు. ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
    2
    అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు 

శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం 
(పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు.
జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని 
శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు 
పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు.  ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    13 hrs ago
  • రైతులకు శుభవార్త తెలంగాణలో సెప్టెంబర్ 19న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది
    1
    రైతులకు శుభవార్త తెలంగాణలో సెప్టెంబర్ 19న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    14 hrs ago
  • సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో ఎంత ఉందొ మొత్తం లెక్కలు వొస్తాయి.. ఎలా సంపాదించావు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.
    1
    సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ  మాజీ మంత్రి హరీష్ రావు
మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు  అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో  ఎంత  ఉందొ మొత్తం  లెక్కలు  వొస్తాయి.. ఎలా  సంపాదించావు అంటూ  మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    13 hrs ago
  • ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం 🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙
    1
    ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం
🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Social Media Manager కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • జీఎన్ఆర్ హాస్పిటల్‌లో ఘనంగా అన్నదాన వితరణ వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్‌ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
    4
    జీఎన్ఆర్ హాస్పిటల్‌లో ఘనంగా అన్నదాన వితరణ
వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు
రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన
హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం
కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్‌ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_P.Nagendrudu
    P.Nagendrudu
    Media company కల్లూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రూ.35 లక్షల జంబో షెడ్‌కు శంకుస్థాపన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.35 లక్షలతో జంబో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన
    1
    ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రూ.35 లక్షల జంబో షెడ్‌కు శంకుస్థాపన
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.35 లక్షలతో జంబో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఆదోని తిరుమల నగర్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....! ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    ఆదోని తిరుమల నగర్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....!
ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Mandula Venkatesh
    Mandula Venkatesh
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు
    4
    సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం 
విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.