Shuru
Apke Nagar Ki App…
ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం 🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙
REPOTER KUMAR
ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం 🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం 🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙1
- జీఎన్ఆర్ హాస్పిటల్లో ఘనంగా అన్నదాన వితరణ వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.4
- రైతులకు శుభవార్త తెలంగాణలో సెప్టెంబర్ 19న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది1
- ప్రత్యేకంగా రెండవ రోజు గణనాథునికి మంగళహారతులు ఇస్తున్న మహిళా మణులు ( కోడుమూరు శురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోటకొండ సురేష్ ఇంటి సమీపంలో రెండవ రోజున గణనాథుని ప్రత్యేకంగా మహిళా మణులు మంగళ హారతులు ఇచ్చి గణనాథుని అనుగ్రహం ప్రసాదించాలని భక్తుల కోరిక.సంపూర్ణంగా వర్షాలు కురవాలని అందుకే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మహిళా మణులు శురు న్యూస్ తో తెలిపారువారు.1
- ఆత్మకూరు పట్టణం గౌడ్ సెంటర్ లో గణేష్ నిమ్మజణ సంబరాలకు అధిక సంఖ్యలో ప్రజలు, భక్తులు, యువత తో ఆనందభరీతంగా ఉత్సవం సందడితో గణేష్ నిమ్మజణం కోసం యాత్ర కోన సాగుతుంది. ఆత్మకూరు:నంద్యాల జిల్లా గణేష్ నిమ్మజణం కి అధిక ఎండా ఉన్న లెక్కచేయకుండా భక్తదులు స్వామి వారిని మేళా తలలతో సందడి చేస్తూ కనుల పండుగల పోలీష్ బందోబస్తూ మధ్య గణేశుని ఆడుతూ పడుతూ తీసుకెళ్లడం జరిగినది చిన్న పిల్లలు సైతం ఆనందాన్ని వ్యక్తపరిచారు, విగ్రహ బాధ్యత తీసుకొన్న ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదలు, అల్పాహారం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్, భక్తదులకు అందించడం జరిగినది,ఏది ఏమైనా వినాయక చవితి పండుగ ను పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగినది. పోలీస్ అధికారులు ఎటువంటి సంఘటనలకు తావు ఇవ్వకుండా కర్తవ్యని నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం పరుస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ భక్తులతో కలసి పోయి ఉత్సవానీ ముందుకు సాగేలా పని చేసినారు, జిల్లా ఎస్పీ ముందు ఒక రోజు ఆత్మకూరు పట్టణం ను పరిశీలించి అధికార మార్గదర్శకాలను తెలియ పరిచి వెళ్ళడము జరిగింది,.గణేష్ నిమ్మజణం పూర్తి కావలసి ఉంది.4
- బనగానపల్లె : పలుకూరు గ్రామంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. విశ్వకర్మ పేరు ఒక యూనివర్సిటీ కి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు విశ్వకర్మ జయంతి ఉత్సవాల పురస్కరించుకొని శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ విశిష్టత భక్తి విశిష్టతపై సదస్సు నిర్వహించారు. మొదట విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ఈ సృష్టికి మూలకర్త విశ్వకర్మని దేవతలకు దేవలోకాన్ని పాండవులకు ఇంద్రస్తూ పురాని రావణాసునికి లంక నగరాన్ని నిర్మించడమే కాకుండా అనేక వస్తువులను కూడా సృష్టించిన సృష్టికర్త విశ్వకర్మన్నారు ఆయన పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక యూనివర్సిటీ గానీ ఒక రాష్ట్రానికి గాని ఒక జిల్లాకు గాని ప్రభుత్వ పథకాల కూడా ఆయన పేరు పెట్టాలని ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఆయన పేరు మీద విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బ్రహ్మానందచారిజ్ఞప్తి చేశారు. తమ విలువైన సమయంలో ఒక గంట అయినా తమ విష్టాదైవానికి కేటాయించాలని మంచి మార్గానికి దగ్గర ద్వారా భక్తిని బ్రహ్మానంద చారి అన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి కేఈ వెంకటసుబ్బయ్య గౌడు రాముడు మరియు భక్త బృందం పాల్గొన్నారు.2
- పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ను సందర్శించిన నందికొట్కూరు ఎమ్మెల్యే జూపాడుబంగ్లా(M) పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్లో 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోయి గేటు నీటిలో పడిన ఘటనపై ఎమ్మెల్యే జయసూర్య స్పందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. రూ.3 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు. పనుల పురోగతిని ఎమ్మెల్యే బుధవారం పరిశీలించి, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా గేట్ల నిర్వహణ మరమత్తులను పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.1
- చర్మ డప్పు కళాకారుల పెన్షన్ గడువు పెంచాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఆన్లైన్ ప్రక్రియ కొనసాగించాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ ఎమ్మిగనూరు: చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేయనున్న పెన్షన్ దరఖాస్తుల గడువును మరింత పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కళాకారుడికి పెన్షన్ అందేలా నిబంధనలను సరళీకరించి, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల, మూడు నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, చర్మకారులు, డప్పు కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయమని ఆంటోనీ పేర్కొన్నారు. పెన్షన్ కోసం చర్మకారులు, డప్పు కళాకారులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో పాటు ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పెన్షన్ ప్రక్రియను ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ఉన్న కొన్ని నిబంధనలు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేద చర్మకారులు, డప్పు కళాకారులకు ఇబ్బందికరంగా మారాయని ఆంటోనీ తెలిపారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ (Self Declaration) విధానం వల్ల అర్హులైన పలువురు కళాకారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే అద్దె ఇళ్లలో నివసిస్తున్న కళాకారుల వద్ద ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు తదితర పత్రాలు లేకపోవడం వల్ల వారు పెన్షన్కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరతరాలుగా సంప్రదాయ చర్మకార వృత్తిని, డప్పు కళను నమ్ముకుని జీవిస్తున్న పేద కళాకారులకు ఇటువంటి నిబంధనలు అడ్డంకిగా మారకూడదని ఆయన అన్నారు. ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు అవకాశం కల్పించాలి ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను నిర్ధారించే విధంగా ఆన్లైన్ ప్రక్రియను కొనసాగించాలని ఆంటోనీ కోరారు. కుటుంబ వివరాలు, చిరునామా, వృత్తి తదితర అంశాలను రేషన్ కార్డు ఆధారంగా పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అద్దె ఇళ్లలో నివసించే కళాకారులకు కరెంట్ బిల్లు, హౌస్ ట్యాక్స్ వంటి పత్రాల నిబంధనలను సడలించాలని, వారి సంప్రదాయ వృత్తిని ప్రామాణికంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి అర్హతను నిర్ధారించే అవకాశం కల్పించాలని సూచించారు. గడువు పొడిగించి ప్రతి అర్హుడికి అవకాశం ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరింత పొడిగించాలని ఆంటోనీ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చర్మకారులు, డప్పు కళాకారులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో పాటు అవసరమైన పత్రాలు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొంత సమయం కేటాయించి, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క కళాకారుడు కూడా కేవలం నిబంధనల కారణంగా పెన్షన్కు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్మకారులు, డప్పు కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకరించి, ఆధార్–రేషన్ కార్డు ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు అవకాశం కల్పించడంతో పాటు పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంటోనీ ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.1