Shuru
Apke Nagar Ki App…
ఆదివాసులకు 100% ఉద్యోగాలు కల్పించాలి: ఎంపీ తనూజ....... అరుకు ఎంపీ డా. తనూజ నేతృత్వంలో గిరిజన ప్రజా సంఘాల ప్రతినిధులు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయాల్ ఓరంను కలిసి ఆదివాసీ ప్రాంతాల సమస్యలను వివరించారు. జీవో–3 రద్దుతో గిరిజన విద్యా వ్యవస్థ దెబ్బతింటోందని, గిరిజన బి.ఎడ్ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్–1లో కొనసాగించాలని, పాడేరు ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Nava surya
ఆదివాసులకు 100% ఉద్యోగాలు కల్పించాలి: ఎంపీ తనూజ....... అరుకు ఎంపీ డా. తనూజ నేతృత్వంలో గిరిజన ప్రజా సంఘాల ప్రతినిధులు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయాల్ ఓరంను కలిసి ఆదివాసీ ప్రాంతాల సమస్యలను వివరించారు. జీవో–3 రద్దుతో గిరిజన విద్యా వ్యవస్థ దెబ్బతింటోందని, గిరిజన బి.ఎడ్ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్–1లో కొనసాగించాలని, పాడేరు ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీకి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. 2020లో తండ్రి మరణించగా, 2025లో తల్లి కూడా చనిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవరూ ఆదుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోమంగి అంజలి ఆవేదన వ్యక్తం చేసింది. తమ పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసిన అక్కాచెల్లెళ్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించి జీవనోపాధి కల్పించాలని కోరారు.1
- Post by Shyam1
- పెదబయలు మండలంలోని గల్లెల, గోమంగి, కిముడుపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించేలా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్ రామారావు దొర మాట్లాడుతూ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆదివాసీలకు పూర్తిగా అమలు కావాలని, స్థానికులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు1
- పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం ఆమిటి జంక్షన్లో అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం నుండి ఒడిశా గుమడ గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అనిల్ జైన్ గా గుర్తించారు. భార్య జ్యోతి జైన్, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- రామభద్రపురంలో యాక్సిడెంట్.. క్షతగాత్రుల వివరాలు1
- A small cavity may seem harmless at first. కానీ చిన్న పళ్ల రంధ్రాన్ని పట్టించుకోకపోతే అది క్రమంగా లోపలికి పెరుగుతుంది. Untreated cavities can lead to: • tooth pain • infection • need for root canal treatment Early fillings are simple and prevent bigger treatments later. Have you ever ignored a small cavity thinking it is nothing serious?1
- ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर1
- రంపచోడవరం ఏజెన్సీలో విద్యార్థులకు పాడైన కోడిగుడ్లు పెడితే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శిరీష దేవి హెచ్చరించారు. అవసరం అయితే కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ను మార్చి వేస్తామన్నారు. మంగళవారం దేవీపట్నం మండలం పోతవరం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పాడైన గుడ్లు పెట్టిన విషయం తెలిసి పాఠశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.1