దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి. దళిత హక్కులకై వీరోచిత పోరాటాలకు సంసిద్ధం కావాలి. -జిల్లా కార్యదర్శి గాలి చంద్ర బద్వేలు, ఏప్రిల్ 20:దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని, వారికి సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని, వారి హక్కులకై దళిత హక్కుల పోరాట సమితి వీరోచిత పోరాటాలకు సంసిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పేర్కొన్నారు.డి హెచ్ పి ఎస్ , జిల్లా మహాసభలు బద్వేలు లో జరుగుతున్న సందర్భంగా రెండవ రోజు ప్రతినిధుల సభలో ఆయన ముఖ్య అతి థిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం! కుల వివక్షత నిర్మూలన!! మానవీయ హక్కుల సాధన!!! లక్ష్యాలతో దళిత హక్కుల పోరాట సమితి (DHPS) 2006 అక్టోబర్ 22న విశాఖపట్నంలో ఆవిర్భవించిందని,సమాజంలో దళితులపై జరుగుతున్న కులవివక్ష అంటరానితనం దాడులపై ఆనాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకుదక్కుతుందన్నారు.మన భారత రాజ్యాంగాన్ని నేడు దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు భారత రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కుట్ర చేస్తుంది.అందుకోసం దళితులకు రక్షణగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను మార్పు చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 28 రకాల పథకాలను తిరిగి అమలు చేస్తానని మాట ఇచ్చి అధికారం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వాటి ప్రస్తావనే చేయడంలేదు. దేశంలో రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల పైన ,వారికి జరిగే అన్యాయాల పైన, వారి సంక్షేమ పథకాల కొరకై, వారి హక్కుల సాధనకై దళిత హక్కుల పోరాట సమితి ముందు బాగానే ఉండి వివిధ ప్రజా సంఘాలను కలుపుకొని, పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన తెలిపారు. సమావేశం అనంతరం దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఎంపిక చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు నాగ దాసరి ఇమ్మానుయేలు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పడిగే వెంకటరమణ,ఉపాధ్యక్షులుగా ఇరుపోతు శ్రీనివాస వర్మ, ప్రధాన కార్యదర్శిగా కానగాల మునయ్య, సహాయ కార్యదర్శిగా, నాగేశ్వరరావు, కోశాధికారిగా కృప లతో పాటుజిల్లా కౌన్సిల్ 39 మందితో ఎంపిక, తీర్మానాలు చేసి ఆమోదింప చేయడం జరిగింది.డప్పు, చర్మ కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, అర్హులైన వారికి పింఛన్లుఇవ్వాలి.దళిత క్రైస్తవులకు ఎస్సీ చట్టాలు కొనసాగించాలి. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, బద్వేలు ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, పట్టణ కార్యదర్శి బాలు, సహాయ కార్యదర్శి నాగరాజు డి హెచ్ పి ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి. దళిత హక్కులకై వీరోచిత పోరాటాలకు సంసిద్ధం కావాలి. -జిల్లా కార్యదర్శి గాలి చంద్ర బద్వేలు, ఏప్రిల్ 20:దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని, వారికి సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని, వారి హక్కులకై దళిత హక్కుల పోరాట సమితి వీరోచిత పోరాటాలకు సంసిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పేర్కొన్నారు.డి హెచ్ పి ఎస్ , జిల్లా మహాసభలు బద్వేలు లో జరుగుతున్న సందర్భంగా రెండవ రోజు ప్రతినిధుల సభలో ఆయన ముఖ్య అతి థిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం! కుల వివక్షత నిర్మూలన!! మానవీయ హక్కుల సాధన!!! లక్ష్యాలతో దళిత హక్కుల పోరాట సమితి (DHPS) 2006 అక్టోబర్ 22న విశాఖపట్నంలో ఆవిర్భవించిందని,సమాజంలో దళితులపై జరుగుతున్న కులవివక్ష అంటరానితనం దాడులపై ఆనాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకుదక్కుతుందన్నారు.మన భారత రాజ్యాంగాన్ని నేడు దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు భారత రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కుట్ర చేస్తుంది.అందుకోసం దళితులకు రక్షణగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను మార్పు చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన వెంటనే 28 రకాల పథకాలను తిరిగి అమలు చేస్తానని మాట ఇచ్చి అధికారం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వాటి ప్రస్తావనే చేయడంలేదు. దేశంలో రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల పైన ,వారికి జరిగే అన్యాయాల పైన, వారి సంక్షేమ పథకాల కొరకై, వారి హక్కుల సాధనకై దళిత హక్కుల పోరాట సమితి ముందు బాగానే ఉండి వివిధ ప్రజా సంఘాలను కలుపుకొని, పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన తెలిపారు. సమావేశం అనంతరం దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఎంపిక చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు నాగ దాసరి ఇమ్మానుయేలు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పడిగే వెంకటరమణ,ఉపాధ్యక్షులుగా ఇరుపోతు శ్రీనివాస వర్మ, ప్రధాన కార్యదర్శిగా కానగాల మునయ్య, సహాయ కార్యదర్శిగా, నాగేశ్వరరావు, కోశాధికారిగా కృప లతో పాటుజిల్లా కౌన్సిల్ 39 మందితో ఎంపిక, తీర్మానాలు చేసి ఆమోదింప చేయడం జరిగింది.డప్పు, చర్మ కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, అర్హులైన వారికి పింఛన్లుఇవ్వాలి.దళిత క్రైస్తవులకు ఎస్సీ చట్టాలు కొనసాగించాలి. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, బద్వేలు ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, పట్టణ కార్యదర్శి బాలు, సహాయ కార్యదర్శి నాగరాజు డి హెచ్ పి ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Post by T. Raja simha1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- *రోడ్లన్నీ పాలు పోసి పాలు ఎత్తుకునేలా వేశాం అన్నారు కదా... ??* *జనాలు ఏంటి ఇలా అంటున్నారు మరి.* *పొదలకూరు టు సైదాపురం రూట్ మరీ దారుణం వెంటనే రోడ్డు వేయాలని రోడ్డుపై మంచం వేసుకొని నిరసన తెలిపిన యువకుడు.*1
- Post by Bondhu Suresh1
- కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు - ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం. - చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. - నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. - విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం. - కోవూరు అన్నా క్యాంటీన్లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.4
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో యూరియా కలిపిన నీరు త్రాగి దాదాపు 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి 40 గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు 4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.1
- బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.1