కల్లేరు గ్రామంలో భూ రీ-సర్వే పనులు ప్రారంభం మేటి అమరావతి న్యూస్ | చింతూరు డివిజన్ ప్రతినిధి పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు గ్రామంలో శుక్రవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ రీ-సర్వే పనులు కొనసాగాయి. గ్రామంలోని వ్యవసాయ భూములు, నివాస స్థలాల సరిహద్దులను ఆధునిక సర్వే పరికరాల సహాయంతో అధికారులు కొలతలు చేపట్టారు. భూ రికార్డులను కచ్చితంగా నమోదు చేసి, భవిష్యత్తులో భూ వివాదాలను తగ్గించడం ఈ రీ-సర్వే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. సర్వే సమయంలో భూ యజమానులు తమకు సంబంధించిన పట్టాలు, పాత రికార్డులు, అవసరమైన పత్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. భూముల సరిహద్దులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత సర్వే అధికారులకు తెలియజేయాలని గ్రామ ప్రజలకు సూచించారు. రీ-సర్వే పూర్తైన అనంతరం భూ రికార్డుల్లో పారదర్శకత పెరిగి, రైతులు మరియు భూ యజమానులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా కల్లేరు గ్రామంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
కల్లేరు గ్రామంలో భూ రీ-సర్వే పనులు ప్రారంభం మేటి అమరావతి న్యూస్ | చింతూరు డివిజన్ ప్రతినిధి పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు గ్రామంలో శుక్రవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ రీ-సర్వే పనులు కొనసాగాయి. గ్రామంలోని వ్యవసాయ భూములు, నివాస స్థలాల సరిహద్దులను ఆధునిక సర్వే పరికరాల సహాయంతో అధికారులు కొలతలు చేపట్టారు. భూ రికార్డులను కచ్చితంగా నమోదు చేసి, భవిష్యత్తులో భూ వివాదాలను తగ్గించడం ఈ రీ-సర్వే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. సర్వే సమయంలో భూ యజమానులు తమకు సంబంధించిన పట్టాలు, పాత రికార్డులు, అవసరమైన పత్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. భూముల సరిహద్దులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత సర్వే అధికారులకు తెలియజేయాలని గ్రామ ప్రజలకు సూచించారు. రీ-సర్వే పూర్తైన అనంతరం భూ రికార్డుల్లో పారదర్శకత పెరిగి, రైతులు మరియు భూ యజమానులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా కల్లేరు గ్రామంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
- ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా ఆధ్వర్యంలో సర్వే బూర్గంపాడు మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు పంచాయతీ ప్రభుత్వ పాఠశాలల్లో వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా సంఘం ఆధ్వర్యంలో పాఠశాలల సమస్యలపై శుక్రవారం సర్వే నిర్వహించారు. తాళ్లగొమ్మూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు, ముగ్గురు ఉపాధ్యాయులు, 31 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు శాశ్వత ప్రధానోపాధ్యాయుడు లేకపోవడంతో విజయకుమారి ఇన్చార్జి హెడ్మిస్ట్రెస్గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఇప్పటివరకు పాఠశాల యూనిఫాంలు అందలేదని, త్వరలో కొత్త యూనిఫాంలు వస్తాయని ఆమె పేర్కొన్నారు.మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు రాయల లక్ష్మి, మారం పుష్ప మాట్లాడుతూ తమకు నెలకు కేవలం రూ.3,000 మాత్రమే వేతనం అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగది భవనాలు శిథిలావస్థలో ఉండటంతో వర్షాకాలంలో వర్షం పడుతున్నా అదే పరిస్థితుల్లో వంట చేసి విద్యార్థులకు భోజనం అందించాల్సి వస్తోందన్నారు.కోడిగుడ్డుకు ప్రభుత్వం రూ.6 మాత్రమే చెల్లిస్తుండగా, మార్కెట్ ధర రూ.9.50 ఉండటంతో ఒక్కో గుడ్డుపై రూ.3.50 తమ జేబు నుంచి భరించాల్సి వస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో రూ.10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం రూ.3,000 మాత్రమే ఇస్తున్నారని, అది కూడా ప్రతి నెల సకాలంలో అందడం లేదని వాపోయారు.గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని, పాఠశాలలో ఒక్క గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉండటంతో అది అయిపోతే వెంటనే కొత్త సిలిండర్ అందడం లేదని, ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు కట్టెలు కూడా అందుబాటులో లేవని మధ్యాహ్న భోజన వర్కర్లు తెలిపారు.ఈ సర్వేలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ఎస్.కే. అబీద, మండల కమిటీ సభ్యురాలు మరియమ్మ, సంఘం జిల్లా నాయకురాలు పాపినేని సరోజినీ ,మండల నాయకురాలు, కవులూరి నాగమణి ,మడకం లత, తదితరులు పాల్గొనడం జరిగింది3
- తమ అభిమాన నాయకుడి కోసం నర్సంపేట కన్నీటిపర్యంతం 😔 అడుగడుగునా అండగా నిలిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఆఖరిసారిగా చూస్తూ, గుండెలు పగిలేలా ఏడుస్తున్న ప్రజలు 😥 తమ అభిమాన నాయకుడి కోసం నర్సంపేట కన్నీటిపర్యంతం 😔 అడుగడుగునా అండగా నిలిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఆఖరిసారిగా చూస్తూ, గుండెలు పగిలేలా ఏడుస్తున్న ప్రజలు 😥1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం.... రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపిన కారేపల్లి సిఐ సాగర్.. రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారం తీరున కనిపించేలా తయారు చేస్తారు అనంతరం ఆ నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలలో తాకట్టు పెట్టి రుణాలు పొందుతారు ఈ విధంగా ప్రవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించడంలో ఈ ముఠా రూటే సపరేటు.. సిఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం... రామ్ చందర్ అనే వ్యక్తి తన ఏజెంట్ అయిన సునీల్ ను ఇల్లందులోని ఒక ముత్తూట్ ఫైనాన్సులో 52 గ్రాముల బంగారం పెట్టించి (390000) ఋణం తీసుకున్నారు దానిని విడిపించేందుకు మరో ప్లాన్ చేశారు... ఈసారి ఏకంగా ఈ నకిలీ బంగారం విడిపించేందుకు హైదరాబాదుకు చెందిన మరో కంపెనీని మోసం చేసే ఎత్తుగడ వేశారు.. అందులో భాగంగా హైదరాబాదులోని మన గోల్డ్ కంపెనీని సంప్రదించి వారి యొక్క ప్రతినిధి ద్వారా 5 లక్షల 80 వేల రూపాయలు సునీల్ తీసుకొని కారేపల్లి మండల సమీపంలో అతని నమ్మించి మోసం చేసి పారిపోయాడు.. దీనితో ఆ సంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా కారేపల్లి పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్టు చేయడoతో ఈ నకిలీ బంగారం విషయాలు వెలుగులోకి వచ్చాయి.. కారేపల్లి మండలం భాగ్యనగర్ కు చెందిన గుగులోతు సునీల్ కుమార్ ను ఇప్పటికే రిమాండ్ చేయగా మరొకరు రామ్ చందర్ ను విలేకరుల సమావేశంలో చూపించారు.. పరారీలో ఉన్న సూర్య తండా కు చెందిన రాకేష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని కారేపల్లి పోలీసులు తెలిపారు.. నిందితులు అంత సులువుగా నకిలీ బంగారం తనకా పెడుతున్నరూ అంటే దీని వెనుక ఫైనాన్సర్ సంస్థలలో ఉన్న కొందరి ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టేముందు లేదా కొనుగోలు చేసే ముందు సంబంధిత బంగారు ఆభరణాల స్వచ్ఛతను కచ్చితంగా పరీక్షించుకోవాలని అనుమానాధస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల సమాచారం ఉంటే తెలియజేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.1
- ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.1
- తిరుమల సమాచారం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . 👉🏻 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . 👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *18-20 గంటల* సమయం పడుతుంది. 👉🏻 300 రూ.. శీఘ్రదర్శనంకు *3–5 గంటల* సమయం పడుతుంది. 👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *5 నుండి 7 గంటల* సమయం పడుతుంది. 👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *67,063* 👉🏻 *25,565* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹4.81 కోట్లు* 👉🏻 నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *4.27 లక్షలు* 👉🏻 నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *2.53 లక్షలు* 👉🏻 నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య *3,166*1
- కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢 కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢1
- తెప్ప నడిపిన సీఐ.. గోదావరి వరదలో చిక్కుకున్న 40 మంది సురక్షితం చర్ల: మండలంలోని వీరాపురం గడ్డ వద్ద గోదావరి వరద ఉద్ధృతికి చిక్కుకున్న 40 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో భాగంగా చర్ల సీఐ రాజువర్మ స్వయంగా తెప్ప నడుపుతూ బాధితులను రక్షించడంలో కీలకంగా వ్యవహరించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో స్పందించి బాధితులకు అత్యవసర వసతులు కల్పించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.1