Shuru
Apke Nagar Ki App…
ఆదిలాబాద్ లో కురిసిన భారీ వర్షం.. రోడ్డు మార్గాలన్నీ జలమయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సైతం వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గాలన్నీ జలమయంగా మారాయి. మార్కెట్ కు వచ్చిన ప్రజలు కాస్తంత ఇబ్బందులకు గురయ్యారు.
Mallaiah Potta
ఆదిలాబాద్ లో కురిసిన భారీ వర్షం.. రోడ్డు మార్గాలన్నీ జలమయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సైతం వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గాలన్నీ జలమయంగా మారాయి. మార్కెట్ కు వచ్చిన ప్రజలు కాస్తంత ఇబ్బందులకు గురయ్యారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ లొ ప్రారంభమైన ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియ. అయోమయ పరిస్థితిలో ఓటర్లు. నోటీస్ ఇచ్చిన సమయ గడువులో ఆధారాలు సమర్పించాలని తెలిపిన కమిషనర్ గోపు గంగాధర్.1
- Germany is rethinking its place in a rapidly changing world, from defence and energy to its dependence on China and its relationships with Europe and the US. And in that rethink, India is moving from the margins to the centre. Berlin’s “Focus on India” strategy calls India its most important partner in the region. Chancellor Friedrich Merz’s January 2026 visit to India further strengthened this shift, with both sides discussing deeper defence cooperation and joint weapons production. From a strategic partnership to defence manufacturing and a potential mega submarine deal, India and Germany are taking their relationship to a new level. • Watch as German MP and CDU/CSU foreign policy spokesperson Jürgen Hardt sheds light on the growing strategic ties between India and Germany. 🇮🇳🇩🇪1
- ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలి... ADB: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కొమరం భీమ్ చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.1
- అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి: మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డి సూచించారు. ఏ ఒక్క ఓటు కోల్పోకుండా జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని కోరారు. ప్రత్యేక తీవ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా మావల, తాంసి, భీంపూర్ మండలాల్లో ఆయన పర్యటించి పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. తాంసి మండలం గోట్కూరి గ్రామంలో జరిగిన గ్రామసభలో శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ, యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. జాబితాలో పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో తప్పులుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలన్నారు. ప్రతి కుటుంబం తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని, అర్హులైన వారి పేర్లు లేకుంటే వెంటనే నమోదు చేయించాలని కోరారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు ప్రజలు, బీఎల్ఓలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు గణేష్ జాదవ్, రమేష్, మావల ఎంపీడీఓ ముత్యం రావు, సర్పంచులు ధర్మపురి చంద్రశేఖర్, మతీన్, నాయకులు ఎండి ఖమరుద్దీన్ ఖాన్, బెజ్జంకి రోహిత్, ఉప సర్పంచ్ నిమ్మల మల్లయ్య, మార్కెట్ డైరెక్టర్ తాటి అశోక్, బత్తుల కిరణ్, బీఎల్ఓలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- స్వగ్రామాలకు బయలుదేరిన మహిళలు, బస్టాండులలో ప్రయాణికుల సందడి మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయింది. రక్షాబంధన్ పురస్కరించుకొని శుక్రవారం రాత్రి లక్షెట్టిపేట, జన్నారం. ఆర్టీసీ బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయాయి. ప్రభుత్వం బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళా ప్రయాణికులే ఎక్కువమంది కనిపిస్తున్నారు. అదనపు బస్సులు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బస్సులు నడపాలని మహిళా ప్రయాణికులు కోరుతున్నారు.1
- *కుక్క కాటుకు ఇద్దరు.. ఆసుపత్రిలో చికిత్స* *కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.. బాధితులను పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర*1
- నందిపేట్ మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఏ.లక్ష్మాన్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ప్రజల నుంచి 12 ఫిర్యాదులు అందాయని ఎండీఓ తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నేడు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా తెలిసింది.1
- ఆగస్టు 27, 2026_ఆదిలాబాదు: *గుంజాలలో వాటర్ షెడ్ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా* పత్రిక ప్రకటన భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా రైతులకు రెండో పంట సాగు అవకాశాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో నిర్వహించిన వాటర్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై గ్రామసభ, అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని న్యూట్రిగార్డెన్ నిర్వహణను పరిశీలించి అభినందించిన కలెక్టర్, అనంతరం వన మహోత్సవంలో భాగంగా స్వయంగా మొక్కనాటి నీరు పోశారు. ఈ మొక్కకు గ్రామస్తులు కలెక్టర్ పేరుతో నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ముసాయిదా ఓటరు జాబితా, ఏఎస్డీ జాబితాలను బిఎల్ఓ లక్ష్మీ చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గుంజాల గ్రామం నుండి ప్రారంభమైన ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మండలంలోని మిగతా 11 గ్రామాలకు దశలవారీగా విస్తరించబడుతుందని తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించడం, వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా రైతులు రెండు పంటలు వేసుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని, కేరళ తరహాలో నాబార్డ్ సహకారంతో జియో ట్యాగింగ్ (GPS, GIS) పద్ధతుల్లో పారదర్శకతతో ఈ పనులు చేపట్టడం జరుగుతోందని స్పష్టం చేశారు. అలాగే రైతుల విద్యుత్ సౌకర్యం కొరకు 1 కిలోమీటర్ పరిధిలో 20 పోల్స్ వరకు ఎలాంటి అదనపు డెవలప్మెంట్ చార్జీలు లేకుండా కేవలం రూ.9,150/- చెల్లిస్తే విద్యుత్ శాఖ ద్వారా ఉచితంగా పోల్స్, లైన్లు వేయబడతాయని తెలిపారు. చివరి ఇళ్లకు సైతం తక్కువ ఖర్చుతో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయించుకోవచ్చని వెల్లడించారు. హస్తాపూర్ - నార్నూర్ రహదారి పనులతో పాటు పెండింగ్లో ఉన్న రోడ్లకు త్వరలో నిధులు మంజూరు చేయడం, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో సిఆర్టి ఉపాధ్యాయుల కొరతను తీర్చడం, పాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడం, వృద్ధులు, దివ్యాంగుల పింఛన్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం అబ్దుల్ రౌఫ్, ధాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నీలేష్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, ఎంపీడీవో పుల్లరావు, ఏంఆర్ఓ రాజలింగు, ఏంఈఓ మనోహర్, డిఎల్పిఓ ప్రభాకర్, సర్పంచ్ జ్ఞానేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయులు రామారావు, పంచాయతీ కార్యదర్శి రాధిక, బిఎల్ఓ లక్ష్మీ, గ్రామస్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.1