Shuru
Apke Nagar Ki App…
ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండండి: ప్రధాని మోదీ అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలు పెరుగుతున్నాయని, వాటి కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. “ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండండి. పండుగలు, శుభకార్యాలైనా ఆసక్తి చూపించొద్దు,” అని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సభలో చెప్పారు. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారకద్రవ్యం పెరుగుతుందని మోదీ తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సైతం పొదుపుగా వాడాలని పేర్కొన్నారు.
Duppada Anandarao
ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండండి: ప్రధాని మోదీ అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలు పెరుగుతున్నాయని, వాటి కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. “ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండండి. పండుగలు, శుభకార్యాలైనా ఆసక్తి చూపించొద్దు,” అని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సభలో చెప్పారు. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారకద్రవ్యం పెరుగుతుందని మోదీ తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సైతం పొదుపుగా వాడాలని పేర్కొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- హైదరాబాద్లోని ఓ గుడిలో వందల కేజీల బరువున్న గంటను ఓ బామ్మ సులువుగా మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అసాధారణ శక్తిని చూసి ఆలయ సందర్శకులు, భక్తులు షాకయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.1
- సంతకవిటి : ప్రభుత్వ పాఠశాలలో చేరికలకు ఎమ్మెల్యే ప్రోత్సాహం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం మండవ కురిటి లో ఆదివారం ప్రైవేట్ పాఠశాల నుంచి సుమారు 18 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ ఆధ్వర్యంలో చేర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- హెలిప్యాడ్ స్థల పరిశీలన.జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, నరసన్న పేట, మే 10: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16 వ తేదీన జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో నరసన్న పేట సమీపంలోని జమ్మూ, తమరా పల్లి ప్రాంతాల వద్ద ప్రతిపాదిత స్థలాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. హెలిప్యాడ్ స్థల అనుకూలతలపై అధికారులతో చర్చించారు. హెలిప్యాడ్ స్థల విస్తీర్ణం మ్యాప్ ద్వారా నిశితంగా పరిశీలించారు, వాహనాల పార్కింగ్, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం, తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్ స్థల మైదానాన్ని చదును, శుభ్రపరచే పనులు త్వరితగతిన పూర్తి చేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రెవిన్యూ డివిజనల్ అధికారి వేణుగోపాలరావు, రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారి తిరుపతిరావు, తాసిల్దార్ సత్యనారాయణ, డి.ఎస్.పి లక్ష్మణరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్లు గణేష్, రంజిత్, తదితరులు, పాల్గొన్నారు.4
- పాతపట్నం నియోజకవర్గంలో కౌసల్యాపురం గ్రామస్తుడు సల్ల ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ₹1,21,784 విలువైన ఈ ఆర్థిక సహాయం మంజూరైంది.2
- జనసేన ఆధ్వర్యంలో అరసవల్లిలో రక్తదాన శిబిరం. భారీగా స్పందించిన రక్తదాతలు. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఆదిత్య నగర్ కాలనీ లోగల జనసేన ఆఫీసు యందు,బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, సిక్కులు సైనికుడు + సిక్కోలు సేవకుడు,కాకర్ల నర్సింగ్, ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ రక్తదానం సినిమాలో స్వచ్ఛందంగా పలువురు పాల్గొని రక్తదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, తెలుగుదేశం పార్టీ నగర కార్పొరేషన్, క్లస్టర్ ఇంచార్జ్,ఉంగటి రమణమూర్తి పాల్గొన్నారు, ప్రకటన శిబిరానికి వచ్చిన వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.4
- అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో ముఖ ఆధారిత ధృవీకరణ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనివల్ల వివిధ ప్రభుత్వ సేవలు, ఇతర కార్యకలాపాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.1
- గిరిజన ప్రజలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గత రెండు వారాలుగా అరకు వెలి మండలంతో సహా గిరిజన ప్రాంతాల్లో గ్యాస్ అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.1
- పిడుగు పాటు బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ రాజాం( M) గడ్డ వలస లో మే 5న పిడుగు పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందిన ఘటనపై ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ స్పందించారు. బాధ్యత కుటుంబాలను పరా మర్శించి, ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున వ్యక్తిగత ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ నుంచి పూర్తిస్థాయి సాయం అందేల చూస్తానని హామీ ఇచ్చారు. పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఈ దారుణం జరిగిందని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు.1