పెదకూరపాడు ఎంఈఓ2 గా బాధ్యతలు చేపట్టిన కెవి రమణ. . పెదకూరపాడు మండల విద్యాశాఖ అధికారి-2 గా పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకాని వెంకట రమణ విధులలో చేరారు. మండల విద్యాశాఖ అధికారి-1 ప్రసాదరావు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కె.వి.రమణ గ ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.జి. ప. ఉ పాఠశాల 75-- తాళ్లూరు ప్రధానోపాధ్యాయులు అన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి జి.ప.ఉ పాఠశాల గారపాడు ప్రధానోపాధ్యాయులు శివ నాగేశ్వరావు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పెదకూరపాడు మండల విద్యాశాఖ అధికారి-2 గా నియమితులైన కె.వి రమణ మాట్లాడుతూ..... రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో ఈ పెదకూరపాడు మండల విద్యాశాఖ అధికారి II బాధ్యతలను నియమించడం మరింత బాధ్యత పెంచిందని, విద్యా శాఖలో తన వంతు కృషి చేసే అవకాశం భగవంతుడు కల్పించాడని రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో తన సహోద్యోగులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు,ఎంఆర్సి సిబ్బంది ఎంఈఓ కి శుభాకాంక్షలు తెలిపారు.
పెదకూరపాడు ఎంఈఓ2 గా బాధ్యతలు చేపట్టిన కెవి రమణ. . పెదకూరపాడు మండల విద్యాశాఖ అధికారి-2 గా పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకాని వెంకట రమణ విధులలో చేరారు. మండల విద్యాశాఖ అధికారి-1 ప్రసాదరావు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కె.వి.రమణ గ ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.జి. ప. ఉ పాఠశాల 75-- తాళ్లూరు ప్రధానోపాధ్యాయులు అన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి జి.ప.ఉ పాఠశాల గారపాడు ప్రధానోపాధ్యాయులు శివ నాగేశ్వరావు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పెదకూరపాడు మండల విద్యాశాఖ అధికారి-2 గా నియమితులైన కె.వి రమణ మాట్లాడుతూ..... రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో ఈ పెదకూరపాడు మండల విద్యాశాఖ అధికారి II బాధ్యతలను నియమించడం మరింత బాధ్యత పెంచిందని, విద్యా శాఖలో తన వంతు కృషి చేసే అవకాశం భగవంతుడు కల్పించాడని రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో తన సహోద్యోగులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు,ఎంఆర్సి సిబ్బంది ఎంఈఓ కి శుభాకాంక్షలు తెలిపారు.
- *స్కూల్ బస్ లో పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం* ఒక్కసారిగా బస్సు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో స్కూల్ పిల్లలందరినీ కూడా సడన్గా బస్సులో నుంచి దింపేసిన పరిస్థితి నెలకొంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సులో నుంచి దింపిన ఆయా *ఎన్టీఆర్ జిల్లా.* *ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు* కాలం చెల్లిన బస్సులను మెయింటినెన్స్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు1
- ఎంబిబిఎస్ అడ్మిన్షన్స్ లో జీవో నంబర్ 102 నష్టాదాయకం - డా || ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 30వ తేదీన విడుదల చేసిన జీవో నెం 102, 2026 నీట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఎంబిబిఎస్ విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంపల్సరీ చేయకపోవడం వలన విద్యార్థులు నష్టపోతారని గతంలో ఉన్న 151 జీవో ను అమలుపరిచాలని కోరారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు లోని జన చైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో డా || ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ 102 జివో ను అమలు చేస్తే విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ కంపల్సరిగా పెట్టుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని తత్ఫలితంగా రిజర్వేషన్లు పొందిన విద్యార్థులు ఓపెన్ క్యాటగిరిలో సీటు వచ్చే అవకాశాన్ని వినియోగించుకోవడాన్ని కోల్పోయి రిజర్వేషన్ కేటగిరీలో సీటు పొందితే తత్ఫలితంగా రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు వారి వారి సీట్లను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక 102 జీవోను రద్దు చేసి గతంలో మెడికల్ విద్యార్థులందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న 151 జీవోను కొనసాగించాలని కోరారు. ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రమెడికల్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ కు విజ్ఞప్తిని అందించినామని తెలిపారు. గతంలో మెడికల్ అడ్మిషన్స్ లో ఉన్న లోపాలను సవరించడానికి హైకోర్టు 2019లో ఇచ్చిన ఉత్తర్వులు ఆధారంగా ఆరుగురు నిపుణులతో కమిటీ వేశారని, వారి నివేదిక ఆధారంగా 151 జీవో అమల్లోకి వచ్చి ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగుతుండగా నేడు 102 జీవోను అమలు చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని, రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు నష్టపోతారన్నారు. విద్యార్థులు అందరూ అన్ని ఆప్షన్లను పెట్టుకోవడం కంపల్సరీ చేయాలని కోరారు. 2వ, 3వ కౌన్సిల్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం కల్పించాలన్నారు.1
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకలలో భాగంగా చరిత్ర సృష్టించిన మన గిరిజన ఆడబిడ్డలు గర్వపడేలా చేసిన మన సంస్కృతి !! భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక రికార్డు కాదు మన గిరిజన సంప్రదాయాలకు ప్రపంచం ఇచ్చిన గౌరవం. గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి @GSandhyarani_ గారు అందుకోవడం, అనంతరం బాలికలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొనడం ప్రతి గిరిజన కుటుంబానికి గర్వకారణం. మన మూలాలను, మన సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రతి గిరిజన బాలికకు హృదయపూర్వక అభినందనలు. మీ అడుగుల తాళానికి ప్రపంచం చప్పట్లు కొట్టింది .1
- ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముదిగొండ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ళ ను కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పనులు జరుగుతున్న రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.1
- జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.1
- ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది1
- *ప్రస్తుతం ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్తితి......*1