మహా ధర్నాకు కదిలి వచ్చిన ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల లోకం* సూర్యాపేట సిటీ ఆగస్టు 27:: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక TGEJAC రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మారం జగదీష్ అలాగే సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఇచ్చిన దశల వారి పోరాటంలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్ అధ్యక్షత వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సంఘాల నాయకులు కార్యకర్తలు వేలాదిగా ధర్నాలో పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.* *ప్రధాన డిమాండ్లు:* *1. PRC అమలు చేయాలి* *2. పెండింగ్ లో ఉన్న 6 DA లను మంజూరు చేయాలి*. *3. CPS రద్దుచేసి OPS పునర్ధరించాలి.* *4. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి* *5. హెల్త్ కార్డులు సక్రమంగా అమలు చేయాలి.* *6. ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి* *7. పదోన్నతులు పూర్తి చేయాలి* *8. జీవో 25 సవరణ చేయాలి* *9. జీవో 190 అమలు చేయాలి* *10. VBGRAM ఉద్యోగులకు ప్రకటించిన పే స్కేల్స్ లను అమలు పరచాలి.* *11. ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలి* *రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి JAC నాయకత్వాన్ని ఆహ్వానించి సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 10వ తేదీన ఇందిరాపార్క్ వద్ద జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ భూపాల్ రెడ్డి, అడిషనల్ సెక్రటరీ జనరల్ తంగేళ్ల జితేందర్ రెడ్డి, రాష్ట్ర జేఏసీ నాయకులు రాధాకృష్ణ, కో చైర్మన్ లు ఎన్ సోంబాబు, పి వీరన్న, షేక్ ఉమర్, నిమ్మల శ్రీనివాస్, సీతారామయ్య, నాగేశ్వరరావు, మన్నెం యాదగిరి, బి పాండు నాయక్, కోడి రెక్క నాగేందర్, లక్కపాక ప్రవీణ్ కుమార్, ఎస్ రవికుమార్, నాయిని ఆకాష్ వర్మ, మడి పడగ సైదులు, డి.బాలు నాయక్, బంధం వెంకటేశ్వర్లు, సుంకరి అనిత, పద్మావతి, వెంకటరమణ, పి శ్రీనివాస్ రెడ్డి vbgram ఉద్యోగులు రామకృష్ణారెడ్డి, శ్రీరాములు, నాగయ్య, పంచాయతీ కార్యదర్శుల సంఘం ఇంద్ర బాబు, శ్రీకాంత్ రెడ్డి జిల్లా పరిషత్తు ఉద్యోగుల సంఘం శ్రీధర్ నాయుడు, sc,st ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు అయోధ్య, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం భూపతి వెంకటయ్య, రాష్ట్ర నాయకులు డాక్టర్ బట్టు గోపి, రేపక లింగన్న, పబ్బతి వెంకటేశ్వర్లు, మర్యాద సైదులు తదితర ఉద్యోగ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మహా ధర్నాకు కదిలి వచ్చిన ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల లోకం* సూర్యాపేట సిటీ ఆగస్టు 27:: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక TGEJAC రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మారం జగదీష్ అలాగే సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఇచ్చిన దశల వారి పోరాటంలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్ అధ్యక్షత వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సంఘాల నాయకులు కార్యకర్తలు వేలాదిగా ధర్నాలో పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.* *ప్రధాన డిమాండ్లు:* *1. PRC అమలు చేయాలి* *2. పెండింగ్ లో ఉన్న 6 DA లను మంజూరు చేయాలి*. *3. CPS రద్దుచేసి OPS పునర్ధరించాలి.* *4. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి* *5. హెల్త్ కార్డులు సక్రమంగా అమలు చేయాలి.* *6. ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి* *7. పదోన్నతులు పూర్తి చేయాలి* *8. జీవో 25 సవరణ చేయాలి* *9. జీవో 190 అమలు చేయాలి* *10. VBGRAM ఉద్యోగులకు ప్రకటించిన పే స్కేల్స్ లను అమలు పరచాలి.* *11. ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలి* *రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి
JAC నాయకత్వాన్ని ఆహ్వానించి సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 10వ తేదీన ఇందిరాపార్క్ వద్ద జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ భూపాల్ రెడ్డి, అడిషనల్ సెక్రటరీ జనరల్ తంగేళ్ల జితేందర్ రెడ్డి, రాష్ట్ర జేఏసీ నాయకులు రాధాకృష్ణ, కో చైర్మన్ లు ఎన్ సోంబాబు, పి వీరన్న, షేక్ ఉమర్, నిమ్మల శ్రీనివాస్, సీతారామయ్య, నాగేశ్వరరావు, మన్నెం యాదగిరి, బి పాండు నాయక్, కోడి రెక్క నాగేందర్, లక్కపాక ప్రవీణ్ కుమార్, ఎస్ రవికుమార్, నాయిని ఆకాష్ వర్మ, మడి పడగ సైదులు, డి.బాలు నాయక్, బంధం వెంకటేశ్వర్లు, సుంకరి అనిత, పద్మావతి, వెంకటరమణ, పి శ్రీనివాస్ రెడ్డి vbgram ఉద్యోగులు రామకృష్ణారెడ్డి, శ్రీరాములు, నాగయ్య, పంచాయతీ కార్యదర్శుల సంఘం ఇంద్ర బాబు, శ్రీకాంత్ రెడ్డి జిల్లా పరిషత్తు ఉద్యోగుల సంఘం శ్రీధర్ నాయుడు, sc,st ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు అయోధ్య, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం భూపతి వెంకటయ్య, రాష్ట్ర నాయకులు డాక్టర్ బట్టు గోపి, రేపక లింగన్న, పబ్బతి వెంకటేశ్వర్లు, మర్యాద సైదులు తదితర ఉద్యోగ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!* *- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. *సూర్యాపేట సిటీ ఆగస్టు 26: అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.1
- పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నార్కెట్పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నార్కెట్పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.4
- భక్తి బావంతో ఘనంగా బోనం ఎత్తి మొక్కులు సమర్పించిన మరిపెడ మహిళలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భక్తి బావంతో మహిళలు ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు.. పసుపు, కుంకుమ, బియ్యం లతో బోనాన్ని వండి మహిళలు తలపై మోస్తూ ముత్యాలమ్మ తల్లి కి సమర్పించేందుకు బయలు దేరి ఆటపాటలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు..2
- చౌటుప్పల్ లో భారీగా నిలిచిన ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల పొడవున నిలిచిన వాహనాలు, మధ్యలోనే ఇరుక్కుపోయిన రెండు అంబులెన్సులు .. అంబులెన్సులు కు సైతం దొరకని దారి. ..1
- ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.పెద్దమండవ,గందసిరి గ్రామాల్లోని మున్నేరు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్ లను పోలీసులు తనిఖీ చేయగా వాటికి ఎలాంటి అనుమతి లేనట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ముదిగొండ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ప్రైమరీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని గత కొంతకాలంగా శిధిలావస్థలో ఉన్న మంజూరు చేయించి ఆ నూతన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు.1
- మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.1
- పాడే పైనే రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించిన సోదరి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు కంటతడి పెట్టించిన హృదయ విధారక ఘటన... కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేష్ అనే ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు.. అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో దింపుడుకల్లం వద్ద అతని మృతదేహాన్ని చూసి రమేష్ అక్క గుండెలు అవిసేలా రోదించింది.., రెండు రోజులయితే రాఖీ కడుదాం అనుకున్న తమ్ముడా.., ఇంతలోనే మమ్మల్ని వదిలి వెల్లిపోయావా అంటూ గుండెలు బాదుకుని రోదించింది.. ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధనం వేడుక అంతిమయాత్రలో జరగడం.., తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ ఆ..అక్క బోరున విలపించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది.. మోటపోతుల రమేష్ తండ్రి పదిరోజులు క్రితం మరణించగా అతని దశదినకర్మ ఈ..రోజు చేయాల్సి ఉండగా నిన్న రమేష్ మరణించాడు.., గతంలో ఇతని తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందడంతో ఆ.. కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయని అంతిమయాత్రలో పాల్గొన్న బందువులు, ప్రజలు కన్నీటితో గుర్తు చేసుకున్నారు..1