logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కడప నియోజకవర్గంలో 01-06-2026న ఉదయం 6:30 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమై విజయవంతంగా కొనసాగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి, జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు కడప నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి గార్ల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. 26వ డివిజన్ ఇంచార్జ్ చవలముడి శంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో తెలుగు మహిళ కడప పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు చవలముడి మౌనిక, TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మసాపేట శివ, 26వ డివిజన్ టీడీపీ నాయకులు స్వర్ణ లక్ష్మీనారాయణ, ఆనంద్, చరణ్, సచివాలయం, కార్పొరేషన్ సిబ్బందితోపాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

1 hr ago
user_Ponna Eswaraiah
Ponna Eswaraiah
Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
1 hr ago
37e72600-0387-4ab0-919d-d4b355f0bc44

కడప నియోజకవర్గంలో 01-06-2026న ఉదయం 6:30 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమై విజయవంతంగా కొనసాగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి, జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు కడప నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి గార్ల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. 26వ డివిజన్ ఇంచార్జ్ చవలముడి శంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో తెలుగు మహిళ కడప పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు చవలముడి మౌనిక, TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మసాపేట శివ, 26వ డివిజన్ టీడీపీ నాయకులు స్వర్ణ లక్ష్మీనారాయణ, ఆనంద్, చరణ్, సచివాలయం, కార్పొరేషన్ సిబ్బందితోపాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చందమూరు నారాయణరెడ్డి, ప్రభాకర్, చాంద్ బాషా తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం, కృష్ణ అభిమానులు పేదల కోసం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
    1
    శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చందమూరు నారాయణరెడ్డి, ప్రభాకర్, చాంద్ బాషా తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం, కృష్ణ అభిమానులు పేదల కోసం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌లో ఉన్న వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణం బైటిపేటకు చెందిన చాకలి నాగయ్య అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో నిందితుడు గత ఐదు సంవత్సరాలుగా మానసిక రోగి అని, వైయస్సార్‌సీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని వెల్లడైంది. ఈ ఘటన వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని సీఐ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అనేక కోణాల్లో పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి మానసిక రోగేనని నంద్యాల సీఐ సుధాకర్ రెడ్డి పునరుద్ఘాటించారు.
    1
    నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌లో ఉన్న వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణం బైటిపేటకు చెందిన చాకలి నాగయ్య అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రాథమిక విచారణలో నిందితుడు గత ఐదు సంవత్సరాలుగా మానసిక రోగి అని, వైయస్సార్‌సీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని వెల్లడైంది. ఈ ఘటన వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని సీఐ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అనేక కోణాల్లో పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి మానసిక రోగేనని నంద్యాల సీఐ సుధాకర్ రెడ్డి పునరుద్ఘాటించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • గంగవరంలో మే 31న జరిగిన బహుజన ఆత్మీయ సమ్మేళనంలో, హైకోర్టు న్యాయవాది, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి, బహుజన సమాజాన్ని నిర్మించడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాధ్యత అని ఉద్ఘాటించారు. బహుజన నాయకులు డి.వి. మునిరత్నం అధ్యక్షతన గంగవరం మండలం బ్రిడ్జ్ వద్ద గల ఎస్. ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది బహుజన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 76 సంవత్సరాలు గడిచినా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం బహుజనులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లభించలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దేశాన్ని ఆధిపత్య కులాలు పరిపాలిస్తున్నాయని, బహుజనులు రాజ్యాధికారం చేపట్టలేదని వారు పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సమయంలో ఆధిపత్య కులాలు మాయమాటలు చెప్పి బహుజనులను నిలువునా ముంచుతూ, వారి హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా బహుజనులు మేలుకోవాలని, ఆధిపత్య కులాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న తాము బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణించి పాలకులవ్వాలని చింతమాకుల పుణ్యమూర్తి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామానికి అంబేద్కర్ సిద్ధాంతం, రాజ్యాంగం, చట్టాలు, హక్కుల గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఇకమీదట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యమత్యమై ప్రజలకు నాణ్యమైన ప్రజాస్వామ్యాన్ని అందించాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం బహుజనుల వనభోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు, ఇందులో జిల్లాస్థాయి, పలమనేర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజలు వందలాదిగా హాజరయ్యారు.
    1
    గంగవరంలో మే 31న జరిగిన బహుజన ఆత్మీయ సమ్మేళనంలో, హైకోర్టు న్యాయవాది, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి, బహుజన సమాజాన్ని నిర్మించడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాధ్యత అని ఉద్ఘాటించారు. బహుజన నాయకులు డి.వి. మునిరత్నం అధ్యక్షతన గంగవరం మండలం బ్రిడ్జ్ వద్ద గల ఎస్. ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది బహుజన నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 76 సంవత్సరాలు గడిచినా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం బహుజనులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లభించలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దేశాన్ని ఆధిపత్య కులాలు పరిపాలిస్తున్నాయని, బహుజనులు రాజ్యాధికారం చేపట్టలేదని వారు పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సమయంలో ఆధిపత్య కులాలు మాయమాటలు చెప్పి బహుజనులను నిలువునా ముంచుతూ, వారి హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు.

ఇకనైనా బహుజనులు మేలుకోవాలని, ఆధిపత్య కులాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న తాము బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణించి పాలకులవ్వాలని చింతమాకుల పుణ్యమూర్తి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామానికి అంబేద్కర్ సిద్ధాంతం, రాజ్యాంగం, చట్టాలు, హక్కుల గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఇకమీదట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యమత్యమై ప్రజలకు నాణ్యమైన ప్రజాస్వామ్యాన్ని అందించాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం బహుజనుల వనభోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు, ఇందులో జిల్లాస్థాయి, పలమనేర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజలు వందలాదిగా హాజరయ్యారు.
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    15 hrs ago
  • చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో సాయి కిషోర్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసన సభ్యులు శ్రీ ఎన్. అమరనాథ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై కళాశాలను లాంఛనంగా ప్రారంభించారు. కళాశాల యాజమాన్యం ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, జ్ఞాపికలతో సన్మానించి గౌరవించింది. ఈ సందర్భంగా శ్రీ అమరనాథ రెడ్డి గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు గల విద్యా సంస్థల ఏర్పాటుతో విలువలతో కూడిన విద్య అందుతుందని తెలిపారు. ఈ కోవకు చెందిన సాయి కిషోర్ జూనియర్ కళాశాలను ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలమనేరు పట్టణ మరియు గంగవరం మండల టీడీపీ నాయకులు కూడా శ్రీ అమరనాథ రెడ్డి గారితో పాటు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో సాయి కిషోర్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసన సభ్యులు శ్రీ ఎన్. అమరనాథ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై కళాశాలను లాంఛనంగా ప్రారంభించారు. కళాశాల యాజమాన్యం ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, జ్ఞాపికలతో సన్మానించి గౌరవించింది.

ఈ సందర్భంగా శ్రీ అమరనాథ రెడ్డి గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు గల విద్యా సంస్థల ఏర్పాటుతో విలువలతో కూడిన విద్య అందుతుందని తెలిపారు. ఈ కోవకు చెందిన సాయి కిషోర్ జూనియర్ కళాశాలను ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలమనేరు పట్టణ మరియు గంగవరం మండల టీడీపీ నాయకులు కూడా శ్రీ అమరనాథ రెడ్డి గారితో పాటు పాల్గొన్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • దైవందిన్నెలోని జెడ్పీ హైస్కూల్‌లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించారు.
    1
    దైవందిన్నెలోని జెడ్పీ హైస్కూల్‌లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • తెలంగాణలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీష్ రావు వార్డు మెంబర్‌గా కూడా గెలవకపోయినా, కాంగ్రెస్ పార్టీయే ఆయన్ను మంత్రిని చేసిందని దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాల వల్లే హరీష్ రావు రాజకీయంగా ఎదిగారని స్పష్టం చేస్తూ, ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    1
    తెలంగాణలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీష్ రావు వార్డు మెంబర్‌గా కూడా గెలవకపోయినా, కాంగ్రెస్ పార్టీయే ఆయన్ను మంత్రిని చేసిందని దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాల వల్లే హరీష్ రావు రాజకీయంగా ఎదిగారని స్పష్టం చేస్తూ, ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    24 min ago
  • శ్రీ సత్యసాయి బాబా గిరి ప్రదక్షిణను పుట్టపర్తిలో భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి ప్రశాంతి నిలయం గణేశ్ గేటు వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తిపాటలు పాడుతూ భక్తులు రథాన్ని లాగారు. ఈ గిరి ప్రదక్షిణ గోకులం, ఎనుములపల్లి, గణేశ్ సర్కిల్‌, పెట్రోలు బంకు, చింత తోపు, గోవిందపేట, శివాలయం వీధి, గోపురం వీధి రోడ్డు మీదుగా సాగింది. మంగళ హారతితో గిరి ప్రదక్షిణను ముగించిన అనంతరం, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
    1
    శ్రీ సత్యసాయి బాబా గిరి ప్రదక్షిణను పుట్టపర్తిలో భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి ప్రశాంతి నిలయం గణేశ్ గేటు వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తిపాటలు పాడుతూ భక్తులు రథాన్ని లాగారు.

ఈ గిరి ప్రదక్షిణ గోకులం, ఎనుములపల్లి, గణేశ్ సర్కిల్‌, పెట్రోలు బంకు, చింత తోపు, గోవిందపేట, శివాలయం వీధి, గోపురం వీధి రోడ్డు మీదుగా సాగింది. మంగళ హారతితో గిరి ప్రదక్షిణను ముగించిన అనంతరం, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • మే 31న బద్వేలు పట్టణంలో దొంగలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను, వ్యాపార సముదాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు జరిగాయి, ఇది పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. ఘటనల వివరాల్లోకి వెళ్తే, మున్సిపాలిటీ పరిధిలోని శివరామకృష్ణ నగర్‌లో ఒక ఇంట్లోకి చొరబడిన దొంగలు అక్కడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో నగదును అపహరించుకుపోయారు. అదే రోజు అర్ధరాత్రి, నెల్లూరు రోడ్డు సమీపంలోని 'ఎంసీ ఫర్నిచర్' దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు చోరీకి పాల్పడటమే కాకుండా, తాము దొరికిపోకూడదనే ప్లాన్‌తో షాపులోని సీసీ కెమెరాల డీవీఆర్ (DVR) తో పాటు ఒక పర్సును కూడా ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా, నెల్లూరు రోడ్డులోనే ఉన్న సిఐటి డీలర్ షాపు తాళాలు కూడా పగలగొట్టి, అక్కడ ఉన్న ₹60,000 నగదుతో పాటు, అక్కడి సీసీ కెమెరాల డీవీఆర్ (DVR) ను మాయం చేశారు. ఒకే రోజు పగలు, రాత్రి మూడు ప్రధాన ప్రాంతాల్లో చోరీలు జరగడం, దొంగలు చాకచక్యంగా సీసీటీవీ ఆధారాలు దొరకకుండా డీవీఆర్‌లను సైతం ఎత్తుకెళ్లడం చూస్తుంటే ఇది పక్కా స్కెచ్‌తో జరిగిన ప్రొఫెషనల్ దొంగల పనేనని పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న బద్వేల్ పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. దొంగల ముఠాను పట్టుకోవడానికి పోలీసులు అన్ని కోణాల్లో పూర్తిస్థాయి విచారణను వేగవంతం చేశారని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
    4
    మే 31న బద్వేలు పట్టణంలో దొంగలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను, వ్యాపార సముదాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు జరిగాయి, ఇది పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.

ఘటనల వివరాల్లోకి వెళ్తే, మున్సిపాలిటీ పరిధిలోని శివరామకృష్ణ నగర్‌లో ఒక ఇంట్లోకి చొరబడిన దొంగలు అక్కడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో నగదును అపహరించుకుపోయారు. అదే రోజు అర్ధరాత్రి, నెల్లూరు రోడ్డు సమీపంలోని 'ఎంసీ ఫర్నిచర్' దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు చోరీకి పాల్పడటమే కాకుండా, తాము దొరికిపోకూడదనే ప్లాన్‌తో షాపులోని సీసీ కెమెరాల డీవీఆర్ (DVR) తో పాటు ఒక పర్సును కూడా ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా, నెల్లూరు రోడ్డులోనే ఉన్న సిఐటి డీలర్ షాపు తాళాలు కూడా పగలగొట్టి, అక్కడ ఉన్న ₹60,000 నగదుతో పాటు, అక్కడి సీసీ కెమెరాల డీవీఆర్ (DVR) ను మాయం చేశారు. ఒకే రోజు పగలు, రాత్రి మూడు ప్రధాన ప్రాంతాల్లో చోరీలు జరగడం, దొంగలు చాకచక్యంగా సీసీటీవీ ఆధారాలు దొరకకుండా డీవీఆర్‌లను సైతం ఎత్తుకెళ్లడం చూస్తుంటే ఇది పక్కా స్కెచ్‌తో జరిగిన ప్రొఫెషనల్ దొంగల పనేనని పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న బద్వేల్ పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. దొంగల ముఠాను పట్టుకోవడానికి పోలీసులు అన్ని కోణాల్లో పూర్తిస్థాయి విచారణను వేగవంతం చేశారని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.