క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు దైనందిన కార్యక్రమాల్లో క్రీడలను ఎంచుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండల కేంద్రంలో సీఎం కప్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే గణపురం :క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దైనందిన కార్యక్రమాల్లో క్రీడలను ఎంచుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సీఎం కప్ క్రీడల్లో భాగంగా గణపురం మండల కేంద్రంలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల తో కలిసి సీఎం కప్ క్రీడాజ్యోతిని ముఖ్య అతిథులుగా హాజరైన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు రోజువారి దైనందిన కార్యక్రమాల్లో భాగంగా క్రీడలను ఎంచుకోవాలని శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు అదేవిధంగా క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఎదగాలని వారు కోరారు. సీఎం కప్ గ్రామీణ మండల జిల్లా స్థాయిలలో వివిధ విభాగాలలో నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు విద్యార్థులు గ్రామస్థాయి నుండి మండల జిల్లా రాష్ట్రస్థాయి వరకు క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచుకుని ఎదగాలని అంతేకాకుండా విద్యార్థులు క్రీడలతో పాటు విద్యను అభ్యసించి సరైన లక్ష్యాలను పాఠశాల స్థాయిలోనే నిర్దేశించుకుని వాటి కొసం ప్రణాళిక బద్ధంగా చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎమ్మెల్యే కాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పాఠశాలల్లో మెరుగైన వసతులతో పాటు ఉన్నతమైన విషయ జ్ఞానం కలిగిన ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి తద్వారా విద్యాబోధన గావించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లను కూడా నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలను అందించే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు గ్రామీణ మండల స్థాయి విద్యార్థులు అవకాశాలను వినియోగించుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా విద్య శాఖ అధికారి రాజేందర్ డివైఎస్ఓ చిర్ర రఘు గౌడ్ గణపురం తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపీడీవో ఎల్ భాస్కర్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ ఎంఈఓ ఎండి అఫ్రోజ్ గణపురం గ్రామ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ హెచ్ఎమ్ లు దేసు సతీష్, దూలం కుమారస్వామి గౌడ్ జి వీరన్న పిఈటిలు సరిత మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు దైనందిన కార్యక్రమాల్లో క్రీడలను ఎంచుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండల కేంద్రంలో సీఎం కప్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే గణపురం :క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దైనందిన కార్యక్రమాల్లో క్రీడలను ఎంచుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సీఎం కప్ క్రీడల్లో భాగంగా గణపురం మండల కేంద్రంలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల తో కలిసి సీఎం కప్ క్రీడాజ్యోతిని ముఖ్య అతిథులుగా హాజరైన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు రోజువారి దైనందిన కార్యక్రమాల్లో భాగంగా క్రీడలను ఎంచుకోవాలని శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు అదేవిధంగా క్రీడా
స్ఫూర్తితో జీవితంలో ఎదగాలని వారు కోరారు. సీఎం కప్ గ్రామీణ మండల జిల్లా స్థాయిలలో వివిధ విభాగాలలో నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు విద్యార్థులు గ్రామస్థాయి నుండి మండల జిల్లా రాష్ట్రస్థాయి వరకు క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచుకుని ఎదగాలని అంతేకాకుండా విద్యార్థులు క్రీడలతో పాటు విద్యను అభ్యసించి సరైన లక్ష్యాలను పాఠశాల స్థాయిలోనే నిర్దేశించుకుని వాటి కొసం ప్రణాళిక బద్ధంగా చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎమ్మెల్యే కాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పాఠశాలల్లో మెరుగైన వసతులతో పాటు ఉన్నతమైన విషయ జ్ఞానం కలిగిన ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి తద్వారా విద్యాబోధన గావించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లను కూడా నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలను అందించే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు గ్రామీణ మండల స్థాయి విద్యార్థులు అవకాశాలను వినియోగించుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా విద్య శాఖ అధికారి రాజేందర్ డివైఎస్ఓ చిర్ర రఘు గౌడ్ గణపురం తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపీడీవో ఎల్ భాస్కర్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ ఎంఈఓ ఎండి అఫ్రోజ్ గణపురం గ్రామ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ హెచ్ఎమ్ లు దేసు సతీష్, దూలం కుమారస్వామి గౌడ్ జి వీరన్న పిఈటిలు సరిత మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- హన్మకొండ:నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, అధికారులు పాల్గొన్నారు.2
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ కొంపముంచిన అ*క్రమ సంబంధం.. | : కట్టుకున్నవాడిని కాదని కట్టుకథలు చెప్పే కాలయముడిని నమ్మినట్లుగా అయ్యింది ఓ వివాహిత జీవితం. పరిచయమైన నెల రోజుల్లోనే నమ్మిన ప్రియుడే డిసెంబర్ 31వ రోజు వేడుకల పేరిట నమ్మించి గొంతు నుమిలి చంపాడు వివాహిత కల్పన అనే మహిళను. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ శివారులో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. విచారణ జరుపగా చేగుంట మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన మంతూరు కల్పన(26) గా పోలీసులు గుర్తించారు. అయితే కల్పనకు గత కొద్ది నెలల కిందట కుటుంబీకులు నిచ్చయించిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కుటుంబంలో నెలకొన్న గొడవల కారణంగా తల్లివారి ఇంటి వద్దే కల్పన నివసిస్తుంది. ఈ క్రమంలో చేగుంటలోని ఓ కళ్ళు దుకాణంలో మాసాయి పేట మండలం కొప్పుల పల్లి గ్రామానికి చెందిన పెంటయ్య(30) తో కల్పనకు నెల రోజుల కిందట పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఫోన్ లు మాట్లాడుతుండటంతో ఇరువురి బంధం బలపడింది. కాగా ఈ నెల 31 వ తేదీన కల్పన హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షల పేరిట వెళ్లి నాచారం బ్రిడ్జ్ వద్ద శవమై తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా తన ప్రియుడు పెంటయ్య హత్య చేసినట్లుగా గుర్తించామని ఏసిపి నర్సింలు తెలిపారు. ప్రియుడి బొలెరో వాహనంలో నాచారం బ్రిడ్జ్ వద్ద ఇరువురు చేరుకుని మద్యం సేవించి, తమ వెంట తెచ్చుకున్న బిర్యానీనీ తిన్నారు. ఇక తనకు పదివేల రూపాయలు కావాలని లేదంటే నీ పై మానభంగం కేసు పెడతానని తనను కల్పన బెదిరించిందని పెంటయ్య పోలీసుల విచారణలో తెలిపాడు. కాగా తన వద్ద అంత డబ్బు లేదని,నా పై ఇప్పటికే పలు చోరీ కేసులు ఉన్నాయనే భయాందోళనలో కల్పనను మెడకు త్రాడు వేసి బలంగా లాగి హత్య చేశాడు ఆయన అన్నారు. విచారణ అనంతరం నిందితుడు పెంటయ్యను రిమాండ్ చేసినట్లుగా ఏసిపి పేర్కొన్నారు. B.నర్సింలు(గజ్వేల్) మీడియా సమావేశంలో1
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 6000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేసేందుకు 6000 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు తమను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో 6000 రూపాయలు కృష్ణకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన..... వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.1
- జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనకు దిగారు. నిన్న యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కటౌట్కు ఉరి తీయడాన్ని ఖండిస్తూ, నేడు ఆర్టీసీ చౌరస్తాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కటౌట్లను ఉరి తీశారు. అనంతరం వాటిని బాత్రూమ్ క్లీనర్ హార్పిక్తో కడిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.1
- కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ రెండవ ఎడిషన్ పోటీలను కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గార్లతో కలసి క్రీడా జ్వాలను వెలిగించి క్రీడలను ప్రారంభించిన చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం1