Shuru
Apke Nagar Ki App…
రాజకీయాలను పక్కనపెట్టి అర్హతను ప్రామాణికంగా తీసుకొని సామాజిక పెన్షన్లను మంజూరు చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్, బ్రహ్మసముద్రం వైసీపీ కన్వీనర్లు గోళ్ల సూర్యనారాయణ, పాల బండ్ల చంద్రశేఖర్లు గురువారం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఎంపీడీవో ధనంజయకు వినతిపత్రం అందజేశారు. అర్హత ఉన్న వారందరికీ పెన్షన్లు మంజూరు చేయకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు.
Merzaa Tv
రాజకీయాలను పక్కనపెట్టి అర్హతను ప్రామాణికంగా తీసుకొని సామాజిక పెన్షన్లను మంజూరు చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్, బ్రహ్మసముద్రం వైసీపీ కన్వీనర్లు గోళ్ల సూర్యనారాయణ, పాల బండ్ల చంద్రశేఖర్లు గురువారం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఎంపీడీవో ధనంజయకు వినతిపత్రం అందజేశారు. అర్హత ఉన్న వారందరికీ పెన్షన్లు మంజూరు చేయకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, నగిరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు 108 టెంకాయల సమర్పణ కార్యక్రమం ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, నగరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు 108 టెంకాయల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డినివాసులు పాల్గొన్నారు. 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పానికి ప్రతీకగా... మోదీ 75 జన్మదినం సందర్భంగా 108 టెంకాయల సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్ళీ ప్రధమంత్రి కావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవాలయంలో పూజలు నిర్వహించారు.1
- పత్తికొండ సీఐపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల ఆందోళన విలేకరులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ పత్తికొండ సీఐపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల ఆందోళన విలేకరులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ ఆలూరు, సెప్టెంబర్ 17: కర్నూలు జిల్లా ఆలూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. పత్తికొండ సర్కిల్ పరిధిలో విలేకరుల పట్ల సీఐ జయన్న దురుసుగా వ్యవహరించారని, కొంతమంది జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ “We Want Justice” అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. వార్తా సేకరణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న విలేకరులపై అనుచితంగా వ్యవహరించడం సరికాదని సంఘాల నాయకులు పేర్కొన్నారు. విలేకరులపై నమోదు చేసినట్లు ఆరోపిస్తున్న కేసులను తక్షణమే సమీక్షించి, న్యాయపరమైన ప్రక్రియకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై పత్తికొండ సీఐ జయన్నపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు భద్రత కల్పించడం, వారి విధులకు ఆటంకం కలగకుండా చూడడం అధికారుల బాధ్యత అని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు అన్నారు. తమ డిమాండ్లపై అధికారులు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని వారు తెలిపారు. రిపోర్టర్: ఆనంద్2
- చిప్పగిరిలో ఘనంగా గణనాథుడికి వీడ్కోలు ఈరోజు పకడ్బందీగా నిర్వహించిన వినాయకుని నిమజ్జనం స్పెషల్ నియమించిన సీఐ మస్తానన్నకి చిప్పగిరి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పత్తికొండ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.భక్తులు డప్పులు, మేళతాళాలతో నృత్యాలు చేస్తూ, “జై గణేష్ మహారాజ్కి జై” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.యువత,మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు.నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.అధికారులు, సీఐ మస్తానయ్య ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు.వినాయక నిమజ్జనంతో చిప్పగిరి లో భక్తి సందడి నేలకొంది.ఈకార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు చిప్పగిరిలో ఘనంగా గణనాథుడికి వీడ్కోలు ఈరోజు పకడ్బందీగా నిర్వహించిన వినాయకుని నిమజ్జనం స్పెషల్ నియమించిన సీఐ మస్తానన్నకి చిప్పగిరి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పత్తికొండ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.భక్తులు డప్పులు, మేళతాళాలతో నృత్యాలు చేస్తూ, “జై గణేష్ మహారాజ్కి జై” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.యువత,మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు.నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.అధికారులు, సీఐ మస్తానయ్య ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు.వినాయక నిమజ్జనంతో చిప్పగిరి లో భక్తి సందడి నేలకొంది.ఈకార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు4
- మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సేవలో ఉపాసన కొణిదెల..! శ్రీ రాఘవేంద్ర స్వామిని రామ్చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల దర్శించుకున్నారు. మధ్వ కారిడార్ వద్ద ఆలయ అధికారులు శ్రీపతి స్వామి, ఐపీ నరసింహమూర్తి, అనంత్ పురానిక్ సాంప్రదాయబద్ధంగా ఆమెకు స్వాగతం పలికారు. గ్రామదేవత మాంచాలమ్మకు కుంకుమార్చన నిర్వహించి, అనంతరం మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఫలమంత్రాక్షతలతో ఉపాసనను ఆశీర్వదించారు. మంత్రాలయంలో అపోలో 24/7 మెడికల్ షాప్ ఏర్పాటు చేయాలని పిఠాధిపతి ఆమెను కోరారు.1
- ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుడికి దీపాల హారతులు వేంపల్లెలోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా బుధవారం వినాయకుడికి సాంప్రదాయ దుస్తులతో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల దీపాల హారతులు ఇచ్చారు. పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో 32 రకాల దీపాల హారతులు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.1
- ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రూ.35 లక్షల జంబో షెడ్కు శంకుస్థాపన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.35 లక్షలతో జంబో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన1
- ఆదోని తిరుమల నగర్లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....! ఆదోని పట్టణంలోని తిరుమల నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.1
- కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మండలాల ప్రజలకు సకాలంలో తాగునీరు అందించండి ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్లు జెడ్పి చైర్మన్ అధ్యక్షతనలో జిల్లా పరిషత్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, మరియు కర్నూలు ఎంపీ పాల్గొన్నారు, ఈ సమావేశంలో ఈ ఏపీ స్టేట్ కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప గారు మాట్లాడుతూ ముందుగా గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో చిప్పగిరి, ఆలూరు, ఆలహర్వీ, హోలగుంద, ఆదోని1, ఆదోని2, కౌతాళం, మండలంలోని 196 గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామ ప్రజలకు తాగడానికి సకాలంలో నీళ్లు అందించి ప్రజలను ఆదుకోవాలని కోరినారు, అంతేకాదు తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ కు 227 లింక్ కింద ఆదోని మండలం బసాపురం గ్రామం దగ్గర గర్జివంక ఉంది ఆ వంకకింద దాదాపు 10 గ్రామాలు ఉన్నాయి, ఈ వంకకు ఎల్ఎల్సీ కాలువనుంచి కొంత నీరు విడిస్తే పశువులకు వన్య జీవులకు తాగడానికి నీళ్లు ఉపయోగ పడుతుంది, మరియు ప్రజలకు అనుకూల పరిస్థితి ఉంటుంది అని కలెక్టర్ మరియు జిల్లా చైర్పర్సన్ గారిని అడిగినారు, అంతేకాదు ఇలా ఎల్ఎల్సి కింద ఉన్న వంకలువు కొంత నీరు వదిలితే పశువులకు తాగడానికి నీరు మరియు మేయడానికి గడ్డి దొరుకుతుందని సూచించారు, ఈ విషయానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు2
- బిఆర్ఎస్ నూతన పంచాయతీలు గిరిజనులకు అభివృద్ధి తండాలను గ్రామపంచాయతీ చేసిన కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే.గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి గిరిజనలతో కలిసి,పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు గురువారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా మరియు గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో గిరిజనులకు జనాభా ప్రకారం *6% శాతం ఉన్న రిజర్వేశాన్ని 10% శాతానికి పెంచి, నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి తండాల గిరిజన మహిళలతో కలిసి,బాసు హనుమంతు నాయుడు గారు పాలాభిషేకం చేసి, సంబురాలు జరుపుకున్నారు. అంతక ముందు.బాసు హనుమంతు నాయుడు గారిని గిరిజన మహిళలు కేసీఆర్ గారి పాటలకు నృత్యం చేస్తూ,పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తండాల్లో గిరిజనులు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగించారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చివేసి వాటికి మహర్దశ వచ్చేలా చేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆరదేనన్నారు. ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచారని, గిరిజన విద్యార్థులకు 71 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు.దాదాపు అన్ని గిరిజనతండాలకు తారు రోడ్ల నిర్మాణం చేశారన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను కేటాయించి, చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా కెసిఆర్ దేనని అన్నారు.గిరిజన మహిళల సంక్షేమానికి గత కెసిఆర్ గారి ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేశామని, ప్రభుత్వ పథకాలన్నింటినీ విధిగా వర్తింపజేశామని చెప్పారు.గిరిజన పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.300కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గత కెసిఆర్ గారి హయంలో గిరిజన జీపీల్లో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు గడుస్తున్నా గిరిజనుల కోసం చేసిందేమీ లేదన్నారు.గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.గిరిజన విద్యార్థుల చదువు కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు..గిరిజనుల హక్కులను కాపాడుతూ వారి ఆత్మగౌరవం,సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడు పాటుపడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.కెసిఆర్ గారు గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, గిరిజనులను ప్రజా ప్రతినిధులుగా ఎదిగే అవకాశం కల్పించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి,సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప,మాజీ సర్పంచులు కృష్ణవేణి నరేందర్ నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి, అంగడి బసవరాజ్,పటేల్ జనార్దన్ రెడ్డి,ప్రతాప్,రంగ నాయక్,బీచుపల్లి,చక్రీధర్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,బాసు గోపాల్,ఎస్.రాము నాయుడు,టీ.రవి,రాజు నాయుడు,బోయలగూడెం నాగరాజు,జాంపల్లి భరత్ సింహారెడ్డి,సోమశేఖర్ రెడ్డి,కిష్టప్ప,బాసు బొజ్జయ్య నాయుడు, వీరేష్ నాయక్, పూడూరు రఘు నాయుడు,ఒదే నాయక్,లక్ష్మారెడ్డి,రాము,పాగుంటప్ప,కరెప్ప, స్వామి,రామకృష్ణ,ఆంజనేయులు,అరవిందు,గోవిందు, రజినీబాబు,నరసింహులు నాయక్,కృష్ణ,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు....4