రహదారి వనం మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ,జిల్లా ఎస్పీ సతీష్ కుమార్* పుట్టపర్తి., మే 11: పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుండి ఫైర్ స్టేషన్ వరకు ఉన్న రహదారి వనం (Roadside Plantation) మార్గంలో సుమారు *330 మొక్కలను* ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు విద్యార్థులు కలిసి నాటారు.కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర కీలకమని, జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ పుట్టపర్తిని హరిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ చక్రపాని, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు. రహదారి పొడవునా పచ్చదనం వెల్లివిరిసేలా అటవీశాఖ తీసుకున్న ఈ చొరవను స్థానికులు అభినందించారు.
రహదారి వనం మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ,జిల్లా ఎస్పీ సతీష్ కుమార్* పుట్టపర్తి., మే 11: పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుండి ఫైర్ స్టేషన్ వరకు ఉన్న రహదారి వనం (Roadside Plantation) మార్గంలో సుమారు *330 మొక్కలను* ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు విద్యార్థులు కలిసి నాటారు.కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ
సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర కీలకమని, జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ పుట్టపర్తిని హరిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ చక్రపాని, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు. రహదారి పొడవునా పచ్చదనం వెల్లివిరిసేలా అటవీశాఖ తీసుకున్న ఈ చొరవను స్థానికులు అభినందించారు.
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేసిన కార్మికులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది సత్య సాయి కార్మికులకు మద్దతుగా సంఘీభావం తెలపడానికి కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు హెచ్ చెలిమప్ప మల్లెపల్లి మధు జేఏసీ కార్యకర్తలు వన్నూరు స్వామి మారెన్న వెంకటేశులు, చెన్నప్ప తదితరులు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేశారు.1
- రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా చేపట్టింది. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు బైఠాయించి నిరసన తెలిపారు.2
- ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన నాగరాజు S/o కొట్టయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు నాగరాజుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.1
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో రూ.4.89 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు. కొత్త సబ్స్టేషన్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులతో గ్రామం రూపురేఖలు మారాయి. ఐకేపీ రుణాలతో భూమి కొనుగోలు చేసిన 81 మందికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమి పట్టాలు అందజేశారు.1
- బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ శివారులో ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ శివారులో ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 52 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. గొర్రె పిల్లలను ఓ చెట్టు నీడలో వదిలిన ఎర్రిస్వామి పొలంలోకి వెళ్లారు. ఆ సమయంలో కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేసి చంపడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.1