ఆదిలాబాద్ పట్టణంలోని ఉపాధ్యాయుల నివాస గృహ సముదాయం (టీచర్స్ కాలనీ) నందు వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి గుడిలో రేపు, అంటే 24-06-2026 బుధవారం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, జంటనాగులు, ఒంటె, ద్వార గజాలు మరియు వినాయకుల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ఈ శుభకార్యానికి భక్తులందరూ తరలిరావాలని ప్రముఖ వైదికులు శ్రీ చికిలి అగస్త్య పిలుపునిచ్చారు. ఈ వేడుకలు శ్రీ చికిలి వారి సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత మూడు రోజులుగా, జూన్ 22 నుండి జూన్ 24 వరకు, శాస్త్రోక్తంగా ఈ వేడుకలు జరుగుతున్నాయని వివరించారు. నిన్న సోమవారం స్వస్తి పుణ్యాహవాచనం, శ్రీ గౌరీ గణాధిపతి పూజ, హోమగుండ ప్రజ్వలన, దేవతా విగ్రహాలకు అభిషేకాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. నేడు మంగళవారం వివిధ ప్రత్యేక పూజలు, మూల మంత్ర హోమములు, శయనాధివాస వేడుకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాన వేడుకలు రేపు బుధవారం ఉదయం 8:45 నిమిషాలకు, చిత్తా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు, అత్యంత ఘనంగా విగ్రహ యంత్ర ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి మరియు మహాప్రసాద వితరణతో జరుగుతాయి. మధ్యాహ్నం 1:00 గంటల నుండి భక్తులందరికీ అన్నదానం ఉంటుంది. భక్తులందరూ ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీ చికిలి అగస్త్య కోరారు. ఈ వేడుకలలో ఆలయ గౌరవ పెద్దలు శ్రీ గెడం తులసిదాస్, ఆలయ కార్యనిర్వాహక వర్గ అధ్యక్షులు శ్రీ బోలిశెట్టి వామన్, ప్రధాన కార్యదర్శి శ్రీ ధాలే రవి, కోశాధికారి శ్రీ కేంద్రె రాజు పాల్గొన్నారు. వీరితో పాటు ఆ ప్రాంత పెద్దలు శ్రీ రాజేందర్, శ్రీ గంగయ్య, శ్రీ సుదర్శన్, శ్రీ బోయర్ అశోక్, శ్రీ రాజన్న, ఆలయ అర్చకులు శ్రీ ఉమాశంకర్ పంతులు, కార్యనిర్వాహక సభ్యులు శ్రీ శ్రీనివాస్, శ్రీ సుధాకర్, శ్రీ కె. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొని వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని ఉపాధ్యాయుల నివాస గృహ సముదాయం (టీచర్స్ కాలనీ) నందు వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి గుడిలో రేపు, అంటే 24-06-2026 బుధవారం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, జంటనాగులు, ఒంటె, ద్వార గజాలు మరియు వినాయకుల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ఈ శుభకార్యానికి భక్తులందరూ తరలిరావాలని ప్రముఖ వైదికులు శ్రీ చికిలి అగస్త్య పిలుపునిచ్చారు. ఈ వేడుకలు శ్రీ చికిలి వారి సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత మూడు రోజులుగా, జూన్ 22 నుండి జూన్ 24 వరకు, శాస్త్రోక్తంగా ఈ వేడుకలు జరుగుతున్నాయని వివరించారు. నిన్న సోమవారం స్వస్తి పుణ్యాహవాచనం, శ్రీ గౌరీ గణాధిపతి పూజ, హోమగుండ ప్రజ్వలన, దేవతా విగ్రహాలకు అభిషేకాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. నేడు మంగళవారం వివిధ ప్రత్యేక పూజలు, మూల మంత్ర హోమములు, శయనాధివాస వేడుకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాన వేడుకలు రేపు బుధవారం ఉదయం 8:45 నిమిషాలకు, చిత్తా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు, అత్యంత ఘనంగా విగ్రహ యంత్ర ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి మరియు మహాప్రసాద వితరణతో జరుగుతాయి. మధ్యాహ్నం 1:00 గంటల నుండి భక్తులందరికీ అన్నదానం ఉంటుంది. భక్తులందరూ ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీ చికిలి అగస్త్య కోరారు. ఈ వేడుకలలో ఆలయ గౌరవ పెద్దలు శ్రీ గెడం తులసిదాస్, ఆలయ కార్యనిర్వాహక వర్గ అధ్యక్షులు శ్రీ బోలిశెట్టి వామన్, ప్రధాన కార్యదర్శి శ్రీ ధాలే రవి, కోశాధికారి శ్రీ కేంద్రె రాజు పాల్గొన్నారు. వీరితో పాటు ఆ ప్రాంత పెద్దలు శ్రీ రాజేందర్, శ్రీ గంగయ్య, శ్రీ సుదర్శన్, శ్రీ బోయర్ అశోక్, శ్రీ రాజన్న, ఆలయ అర్చకులు శ్రీ ఉమాశంకర్ పంతులు, కార్యనిర్వాహక సభ్యులు శ్రీ శ్రీనివాస్, శ్రీ సుధాకర్, శ్రీ కె. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొని వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
- ఇచ్చొడ మండలంలోని సిరిచెల్మా గ్రామంలో గల ప్రసిద్ధి చెందిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన దారిలో భక్తుల రాకపోకల సౌకర్యం కోసం నిర్మిస్తున్న కల్వర్టు పనులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం పరిశీలించారు. సుమారు రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ నూతన కల్వర్టు నిర్మాణంలో నాణ్యమైన పదార్థాలను ఉపయోగించాలని సదరు కాంట్రాక్టర్ మరియు అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పనుల పరిశీలన అనంతరం, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట పాల్గొన్నారు.4
- జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పట్టణం ఆదర్శనగర్కు చెందిన బిల్డర్ దాసరి రాజేంద్రప్రసాద్ (55) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హనుమాన్ నగర్లో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాజేంద్రప్రసాద్ను అతని వద్ద పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కార్మికుడు గౌతమ్ కుమార్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన మెట్పల్లి పోలీసులు, సంఘటన స్థల పరిశీలన, గాయాలు, కనిపించని బంగారు గొలుసు, సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా ఇది హత్యగా నిర్ధారించారు. విచారణలో నిందితుడు గౌతమ్ కుమార్ (23), తన స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా బంస్గావ్ మండలం బర్దిహ్ గ్రామం అని, బతుకుదెరువు నిమిత్తం మెట్పల్లికి వచ్చి టైల్స్, పెయింటింగ్ పనులు చేసుకుంటున్నానని అంగీకరించాడు. రాజేంద్రప్రసాద్ మెడలోని బంగారు గొలుసు, చేతిలోని బంగారు ఉంగరాన్ని దొంగిలించి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పాటు, పని సక్రమంగా చేయడం లేదని రాజేంద్రప్రసాద్ పలుమార్లు మందలించడంతో అతనిపై కోపం పెంచుకున్నట్లు తెలిపాడు. దొంగిలించిన తర్వాత గుర్తింపునకు రాకుండా ఉండాలంటే చంపడమే మార్గమని భావించి, ముందుగానే పథకం వేసుకున్నట్లు చెప్పాడు. తేదీ 20-06-2026 రాత్రి నిర్మాణ స్థలం వద్ద రాజేంద్రప్రసాద్తో వాగ్వాదం జరిగిన అనంతరం, నిందితుడు తాను ముందుగా కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్న గొడ్డలితో అతని తలపై బలంగా కొట్టి హత్య చేసి, అతని మెడలో ఉన్న బంగారు గొలుసును తీసుకుని వెళ్లిపోయాడు. నేరం తర్వాత తనపై అనుమానం రాకుండా ఉండేందుకు రాజేంద్రప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అతని భార్యకు చెప్పి, ఆ తర్వాత తిరిగి సంఘటన స్థలానికి వెళ్లి గొడ్డలిని పెయింట్ బకెట్లో పెట్టుకొని మృతుడి నివాసముండే ఇంటి వద్ద మెట్ల కింద దాచిపెట్టినట్లు నిందితుడు వెల్లడించాడు. నిందితుడి వద్ద నుండి మృతుడి మెడలో నుండి దొంగిలించిన 7.25 గ్రాముల బంగారు గొలుసు (గణపతి లాకెట్తో సహా), అతను ఉపయోగించిన ఐటెల్ స్మార్ట్ ఫోన్, సంఘటన సమయంలో ధరించిన రక్తపు మరకలతో కూడిన షర్టు మరియు ప్యాంటు, నేరానికి ఉపయోగించిన హీరో హోండా స్ప్లెండర్ బైక్ (రిజిస్ట్రేషన్ నెంబర్: AP-29-G-6199), మరియు హత్యకు ఉపయోగించిన ఇనుప గొడ్డలి, దానిని దాచిన పెయింట్ బకెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన మెట్పల్లి సీఐ బి. సురేష్ బాబు, ఎస్ఐ పి. కిరణ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎస్ఐ జి. నవీన్ కుమార్, మల్లాపూర్ ఎస్ఐ ఏ. అనిల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.1
- కమ్మర్పల్లి మండలం పరిధిలోని అమీర్ నగర్ గ్రామంలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో మానాల మరియు మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.3
- నిర్మల్ జిల్లాలోని బాసర అమ్మవారి ఉప ఆలయమైన మహాకాళి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన దుండగులు సెంటిమెంట్ ప్రదర్శిస్తూ అమ్మవారి మెడలోని బంగారు ఆభరణాలు, ముక్కుపుడకను వదిలివెళ్లారు. అయితే, ఆలయ హుండీతో పాటు అమ్మవారి వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. ఈ చోరీ ఘటన వెలుగులోకి రావడంతో ఉదయం నాలుగు గంటలకు జరగాల్సిన మహాకాళి అమ్మవారి అభిషేక సేవ ఆలస్యమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల, బైంసా ఏఎస్పీ సాయికుమార్తో కలిసి సీసీ ఫుటేజీ రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించారు. బైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్తో కలిసి ఆలయంలోని ఘటనను సమీక్షించిన ఎమ్మెల్యే రామారావు పటేల్, ఈవో అంజని దేవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ జానకి షర్మిల, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు.1
- నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం, బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విస్తృతంగా చేపట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ నివాస గృహంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు ఈ సూచనలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, బూత్ కమిటీలు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్, పట్టణ అధ్యక్షులు రవీంద్ర యాదవ్, సంజీవ్, నరసయ్య, కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులైన రవి శంకర్ గౌడ్, మిర్జాపురం హరీశంకర్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావు పల్లిలో గ్రామస్థులు పోచమ్మ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో మహిళలు ఉపవాసంతో తమ తలపై బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల మధ్య, బైండ్ల పూజారుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వారు నైవేద్యం సమర్పించి, తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మధు మాట్లాడుతూ, గ్రామానికి సమృద్ధిగా వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు, గ్రామస్తులు బాగుండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. పోచమ్మ బోనాల నిర్వహణకు సహకరించిన గ్రామస్థులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.1
- ఆదిలాబాద్ పట్టణంలోని ఉపాధ్యాయుల నివాస గృహ సముదాయం (టీచర్స్ కాలనీ) నందు వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి గుడిలో రేపు, అంటే 24-06-2026 బుధవారం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, జంటనాగులు, ఒంటె, ద్వార గజాలు మరియు వినాయకుల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ఈ శుభకార్యానికి భక్తులందరూ తరలిరావాలని ప్రముఖ వైదికులు శ్రీ చికిలి అగస్త్య పిలుపునిచ్చారు. ఈ వేడుకలు శ్రీ చికిలి వారి సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత మూడు రోజులుగా, జూన్ 22 నుండి జూన్ 24 వరకు, శాస్త్రోక్తంగా ఈ వేడుకలు జరుగుతున్నాయని వివరించారు. నిన్న సోమవారం స్వస్తి పుణ్యాహవాచనం, శ్రీ గౌరీ గణాధిపతి పూజ, హోమగుండ ప్రజ్వలన, దేవతా విగ్రహాలకు అభిషేకాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. నేడు మంగళవారం వివిధ ప్రత్యేక పూజలు, మూల మంత్ర హోమములు, శయనాధివాస వేడుకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాన వేడుకలు రేపు బుధవారం ఉదయం 8:45 నిమిషాలకు, చిత్తా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు, అత్యంత ఘనంగా విగ్రహ యంత్ర ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి మరియు మహాప్రసాద వితరణతో జరుగుతాయి. మధ్యాహ్నం 1:00 గంటల నుండి భక్తులందరికీ అన్నదానం ఉంటుంది. భక్తులందరూ ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీ చికిలి అగస్త్య కోరారు. ఈ వేడుకలలో ఆలయ గౌరవ పెద్దలు శ్రీ గెడం తులసిదాస్, ఆలయ కార్యనిర్వాహక వర్గ అధ్యక్షులు శ్రీ బోలిశెట్టి వామన్, ప్రధాన కార్యదర్శి శ్రీ ధాలే రవి, కోశాధికారి శ్రీ కేంద్రె రాజు పాల్గొన్నారు. వీరితో పాటు ఆ ప్రాంత పెద్దలు శ్రీ రాజేందర్, శ్రీ గంగయ్య, శ్రీ సుదర్శన్, శ్రీ బోయర్ అశోక్, శ్రీ రాజన్న, ఆలయ అర్చకులు శ్రీ ఉమాశంకర్ పంతులు, కార్యనిర్వాహక సభ్యులు శ్రీ శ్రీనివాస్, శ్రీ సుధాకర్, శ్రీ కె. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొని వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.1
- కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ఆలయానికి వెళ్లే మార్గం సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తీవ్రంగా దెబ్బతిని, కోతకు గురైంది. రోడ్డు పూర్తిగా పాడవడంతో ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయ్యప్ప ఆలయానికి వెళ్లే ఈ దారి ప్రమాదకరంగా మారడంతో మోటార్ సైకిళ్లు, కార్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని, దీంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి భక్తుల రాకపోకలు సాఫీగా జరిగేలా ఆలయ నిర్వాహకులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.1