logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పద్నాలుగు ఓట్లతో గెలిచిన సర్పంచ్ -కాని పదవి అయిపోయింది -ఆసక్తికరమైన ఈ సంఘటన గురించి తెలుసుకోండి... సాలువాలు, పూలమాలలతో విజయ దరహాసంలో ఉన్న ఈయన పేరు పెద్దిరెడ్డి వెంకట కృష్ణారావు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక సర్పంచిగా 14 ఓట్ల మెజార్టీతో సోమవారం(ఏప్రిల్ 13) గెలుపొందారు. ఇదేంటి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఏమి జరగలేదు కదా అనుకుంటున్నారా...? అవును నిజమే కాని ఈయనను అయిదేళ్ళ క్రితమే ఓటర్లు గెలిపించారు. కాని ఎన్నికల అధికారులు ఓడించారు. తీరా ఇప్పుడు గెలిచాక ప్రమాణ స్వీకారం చేద్దామంటే పదవి అయిపోయింది. అత్యంత అరుదైన ఈయన ఓటమి...గెలుపు గురించి తెలుసుకుందాం. 2021 ఫిబ్రవరి21 గాడిలంక అనే చిన్న గ్రామంలో సర్పంచ్ పదవికి వైకాపా మద్దతు దారుడుగా పెద్దింటి నాగమునీంద్రరావు పోటీ చేయగా ఇదే ఇంటిపేరు కలిగిన వెంకట కృష్ణారావు టిడపి మద్దతుతో ఫొటీ చేసారు. వీరిలో మునీంద్రరావు పది ఓట్లు ఆధిక్యతతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటిస్తూ ద్రవ పత్రం జారీచేసారు.మొత్తం 982 ఓట్లు పోలవ్వగా మునీంద్రరావుకు 472 ఓట్లు, వెంకటకృష్ణారావు కు 462 ఓట్లు, చెల్లనవి 19,నోటాకు 29 ఓట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అయితే కౌంటింగ్ లో తేడా జరిగాయని అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రీకౌంటింగ్ జరపాలని వెంకటకృష్ణారావు అప్పుడే పట్టు పట్టారు. కాని అధికారులు రీకౌంటింగ్ కు నిరాకరించారు. మునీందరరావవునే సర్పంచ్ గా నిర్ధారించి ప్రమాణ స్వీకారం చేయించారు. అయినప్పటికీ కృష్ణారావు పట్టువదలని విక్రమార్కుడిలా నాయిస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటినుంచి వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. చివరికి సోమవారం ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈ ఎన్నికలకు సంబంధించి తీర్పునిచ్చింది. తిరిగి ఈ ఓట్లు లెక్కింపు నిర్వహించగా 25 చెల్లని ఓట్లును మునీంద్రరావుకు కలిపినట్లు గుర్తించారు. అలాగే చెల్లని ఓట్లు గా గుర్తించిన వాటిలో ఒక ఓటు కృష్ణారావుకు వచ్చింది. దీంతో మొత్తం 14 ఓట్లతో ఆయన గెలిచినట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణారావు సర్పంచ్ గా గెలిచినట్లు కోర్టు తీర్పు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే ఈనెల 2తో సర్పంచుల పదవీ కాలం పూర్తయిపోయింది. ఓడిపోయిన మునీందర రావు ఐదేళ్లపాటు ఎలాంటి అంతరాయం లేకుండా సర్పంచ్ పదవిలో కొనసాగారు. అందువల్ల వెంకటకృష్ణారావుకు కనీసం సర్పంచిగా ప్రమాణస్వీకారం చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. దీంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు కృష్ణారావుకు శాలువాలు, పూలమాల వేసి సత్కరించి అభినందించారు. ఎన్నికల అధికారులపై చర్యలు ఉండవా..? గాడిలంక సర్పంచ్ ఎన్నికల కోర్టు తీర్పు అనంతరం అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల సమయంలో తప్పులు చేసిన అధికారులపై ఇప్పుడు చర్యలు ఉండాలని చాలామంది పట్టుపడుతున్నారు. కాని ఉండవనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల చట్టంలో అలాగే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్-1 అధికారికి ఈ చెల్లని ఓట్ల తిప్పలు ఎప్పుడూ ఉంటాయి. బ్యాలెట్ పై ఓటు వేసే సమయంలో కొందరు ఓటర్లు తగిన అవగాహన లేక రకరకాల తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు నిర్ధారించడం తలకి మించిన భయారమే. అది ఎలాగంటే క్రికెట్‌లో ఎంపైర్ మాదిరిగా ఉంటుంది.గతంలో మూడవ ఎంపైర్ లేనప్పుడు ఇలాంటి వివాదాలే జరిగేవి.ఎన్నికల అధికారుల పరిస్థితి కూడా దాదాపు అంతే.ఈ చెల్లని ఓట్లు చాలా వివాదాలకు దారితీస్తుంటుంది.అందువల్లనే కొన్ని పెద్ద పంచాయతీలలో కౌంటింగ్ పక్రియ రెండు రోజులు కూడా పడుతుంది. అయితే ఇలాంటి చిన్న పంచాయతీలో ఇన్ని ఓట్లు తేడా రావడంలో అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది.అందుకునే జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా ఈవీఎం మిషన్ లు వినియోగించడానికి ఎన్నికల కమిషన్ చర్యలు చేపడుతుంది. కేవలం గ్రామ పంచాయతీ,ఎంపిటీసి, జెడ్పిటీసీ ఎన్నకల్లోనే ఈ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. వాటికి కూడా ఇవీఎం మిషన్ లు అందుబాటులోకి తీసుకు రానున్నారు. వీటిలో మోసాలు జరగాయని చర్చ జరగడానికి అవకాశాలు ఉండవు.ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవు.కేవలం రోజుల వ్యవధిలో గుర్తుల కేటాయింపు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. దీనివల్ల వెంకటకృష్ణారావు మాదిరిగా గెలిచి ఓడిపోయే పరిస్థితులు ఉండవు.

2 hrs ago
user_Nandikolla Raghava
Nandikolla Raghava
Salesperson మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
8b32f382-7f4c-4a61-b16a-b6cf77e9f729

పద్నాలుగు ఓట్లతో గెలిచిన సర్పంచ్ -కాని పదవి అయిపోయింది -ఆసక్తికరమైన ఈ సంఘటన గురించి తెలుసుకోండి... సాలువాలు, పూలమాలలతో విజయ దరహాసంలో ఉన్న ఈయన పేరు పెద్దిరెడ్డి వెంకట కృష్ణారావు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక సర్పంచిగా 14 ఓట్ల మెజార్టీతో సోమవారం(ఏప్రిల్ 13) గెలుపొందారు. ఇదేంటి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఏమి జరగలేదు కదా అనుకుంటున్నారా...? అవును నిజమే కాని ఈయనను అయిదేళ్ళ క్రితమే ఓటర్లు గెలిపించారు. కాని ఎన్నికల అధికారులు ఓడించారు. తీరా ఇప్పుడు గెలిచాక ప్రమాణ స్వీకారం చేద్దామంటే పదవి అయిపోయింది. అత్యంత అరుదైన ఈయన ఓటమి...గెలుపు గురించి తెలుసుకుందాం. 2021 ఫిబ్రవరి21 గాడిలంక అనే చిన్న గ్రామంలో సర్పంచ్ పదవికి వైకాపా మద్దతు దారుడుగా పెద్దింటి నాగమునీంద్రరావు పోటీ చేయగా ఇదే ఇంటిపేరు కలిగిన వెంకట కృష్ణారావు టిడపి మద్దతుతో ఫొటీ చేసారు. వీరిలో మునీంద్రరావు పది ఓట్లు ఆధిక్యతతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటిస్తూ ద్రవ పత్రం జారీచేసారు.మొత్తం 982 ఓట్లు పోలవ్వగా మునీంద్రరావుకు 472 ఓట్లు, వెంకటకృష్ణారావు కు 462 ఓట్లు, చెల్లనవి 19,నోటాకు 29 ఓట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అయితే కౌంటింగ్ లో తేడా జరిగాయని అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రీకౌంటింగ్ జరపాలని వెంకటకృష్ణారావు అప్పుడే పట్టు పట్టారు. కాని అధికారులు రీకౌంటింగ్ కు నిరాకరించారు. మునీందరరావవునే సర్పంచ్ గా నిర్ధారించి ప్రమాణ స్వీకారం చేయించారు. అయినప్పటికీ కృష్ణారావు పట్టువదలని విక్రమార్కుడిలా నాయిస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటినుంచి వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. చివరికి సోమవారం ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈ ఎన్నికలకు సంబంధించి తీర్పునిచ్చింది. తిరిగి ఈ ఓట్లు లెక్కింపు నిర్వహించగా 25 చెల్లని ఓట్లును మునీంద్రరావుకు కలిపినట్లు గుర్తించారు. అలాగే చెల్లని ఓట్లు గా గుర్తించిన వాటిలో ఒక ఓటు కృష్ణారావుకు వచ్చింది. దీంతో మొత్తం 14 ఓట్లతో ఆయన గెలిచినట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణారావు సర్పంచ్ గా గెలిచినట్లు కోర్టు తీర్పు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే ఈనెల 2తో సర్పంచుల పదవీ కాలం పూర్తయిపోయింది. ఓడిపోయిన మునీందర రావు ఐదేళ్లపాటు ఎలాంటి అంతరాయం లేకుండా సర్పంచ్ పదవిలో కొనసాగారు. అందువల్ల వెంకటకృష్ణారావుకు కనీసం సర్పంచిగా ప్రమాణస్వీకారం చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. దీంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు కృష్ణారావుకు శాలువాలు, పూలమాల వేసి సత్కరించి అభినందించారు. ఎన్నికల అధికారులపై చర్యలు ఉండవా..? గాడిలంక సర్పంచ్ ఎన్నికల కోర్టు తీర్పు అనంతరం అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల సమయంలో తప్పులు చేసిన అధికారులపై ఇప్పుడు చర్యలు ఉండాలని చాలామంది పట్టుపడుతున్నారు. కాని ఉండవనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల చట్టంలో అలాగే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్-1 అధికారికి ఈ చెల్లని ఓట్ల తిప్పలు ఎప్పుడూ ఉంటాయి. బ్యాలెట్ పై ఓటు వేసే సమయంలో కొందరు ఓటర్లు తగిన అవగాహన లేక రకరకాల తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు నిర్ధారించడం తలకి మించిన భయారమే. అది ఎలాగంటే క్రికెట్‌లో ఎంపైర్ మాదిరిగా ఉంటుంది.గతంలో మూడవ ఎంపైర్ లేనప్పుడు ఇలాంటి వివాదాలే జరిగేవి.ఎన్నికల అధికారుల పరిస్థితి కూడా దాదాపు అంతే.ఈ చెల్లని ఓట్లు చాలా వివాదాలకు దారితీస్తుంటుంది.అందువల్లనే కొన్ని పెద్ద పంచాయతీలలో కౌంటింగ్ పక్రియ రెండు రోజులు కూడా పడుతుంది. అయితే ఇలాంటి చిన్న పంచాయతీలో ఇన్ని ఓట్లు తేడా రావడంలో అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది.అందుకునే జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా ఈవీఎం మిషన్ లు వినియోగించడానికి ఎన్నికల కమిషన్ చర్యలు చేపడుతుంది. కేవలం గ్రామ పంచాయతీ,ఎంపిటీసి, జెడ్పిటీసీ ఎన్నకల్లోనే ఈ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. వాటికి కూడా ఇవీఎం మిషన్ లు అందుబాటులోకి తీసుకు రానున్నారు. వీటిలో మోసాలు జరగాయని చర్చ జరగడానికి అవకాశాలు ఉండవు.ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవు.కేవలం రోజుల వ్యవధిలో గుర్తుల కేటాయింపు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. దీనివల్ల వెంకటకృష్ణారావు మాదిరిగా గెలిచి ఓడిపోయే పరిస్థితులు ఉండవు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    19 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    1 hr ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations5191
    1
    ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆
id:cryancreations5191
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Visakhapatnam (Urban), Visakhapatanam•
    8 hrs ago
  • Post by SHOT NEWS
    1
    Post by SHOT NEWS
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
    1
    PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.