టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్కు శుభాభినందనలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులుగా మహేశ్ కుమార్ గౌడ్ విజయవంతంగా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈరోజు హైదరాబాద్లోని వారి నివాసంలో పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ కి పుష్పగుచ్ఛం అందజేసి, టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల కాలంలో పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తలకు అండగా నిలవడం, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషిని అభినందించారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టంగా ముందుకు సాగుతోందని, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతూ పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసే దిశగా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ సమన్వయంతో పార్టీ మరియు ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతున్నాయని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రతి కార్యకర్తతో కలిసి ప్రజాసేవలో ముందుండి పనిచేస్తామని తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్కు శుభాభినందనలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులుగా మహేశ్ కుమార్ గౌడ్ విజయవంతంగా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈరోజు హైదరాబాద్లోని వారి నివాసంలో పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ కి పుష్పగుచ్ఛం అందజేసి, టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల కాలంలో పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తలకు అండగా నిలవడం, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషిని అభినందించారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టంగా ముందుకు సాగుతోందని, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతూ పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసే దిశగా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ సమన్వయంతో పార్టీ మరియు ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతున్నాయని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రతి కార్యకర్తతో కలిసి ప్రజాసేవలో ముందుండి పనిచేస్తామని తెలిపారు.
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- ఇల్లు అద్దెకు ఇస్తే వాడు ఏకంగా దర్గా గా మార్చేసాడు, .. .. 💦😡 ఇల్లు అద్దెకు ఇస్తే వాడు ఏకంగా దర్గా గా మార్చేసాడు, .. .. 💦😡👆1
- తెలంగాణ రైతాoగా పోరాట యోధుల్ని స్మరించుకుందాం :సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సీపీఐ పార్టీ 78 వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాట యోధులు తన విప్లవ పందాను కొనసాగిస్తూ ప్రజల హక్కుల కోసం తపించారాని పేర్కొన్నారు.. అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను కొనియాడారు.. ఈ కార్యక్రమం లోజిల్లా కౌన్సిల్ సభ్యులు రషీద్ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు..2
- రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్ను సంప్రదించవచ్చు అని అన్నారు.1
- *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ* రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కారుదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ లు పిలుపునిచ్చారు. మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆలేరులో ఏ.ఐ.కె.ఎం.ఎస్. ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతుల హక్కుల కోసం జరిగే పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను నిర్మించడమే లక్ష్యంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్. పనిచేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జరగనున్న జాతీయ మహాసభలు భవిష్యత్ రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జాతీయ మహాసభల పిలుపును గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆలేరు ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మహాసభల సందేశాన్ని చేరవేయడంతో పాటు, పోస్టర్లను ఆవిష్కరించి మహాసభల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో జాతీయ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ఇక్కిరి సహదేవ్, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, తమ్మడి అంజయ్య, పాకాల సరిత, రాఘవ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేకల వెంకటేష్, మార్కొండయ్య , పాకాల నరేష్, బాల్ రెడ్డి,ఇక్కిరి శ్రీనివాస్, గడ్డం మంకన్న, మురళి, కుమార్, అంజిరెడ్డి, భూష శ్రీశైలం, బాలయ్య, రామ చంద్రయ్య, మశయ్య, ఆర్.ఉదయ్, పాల్గొన్నారు.2
- యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.1
- అవసరమైన చోట ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్డీవో ఆఫీసుల నిర్మాణాలు చేస్తాం*_ _*ఇప్పటికే మొదటి విడత రూ. 600 కోట్లకు పైగా నిధులు కేటాయించాం*_ _*అవసరమైన చోట ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్డీవో ఆఫీసుల నిర్మాణాలు చేస్తాం*_ _*ఇప్పటికే మొదటి విడత రూ. 600 కోట్లకు పైగా నిధులు కేటాయించాం*_ -శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు1
- తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్.. మహబూబాబాద్ జిల్లా తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్ చేసింది.. ప్రధాన రహవారిపై పడగ విప్పి ఉండటాన్ని కాసేపు స్థానికులు ఆసక్తిగా తిలకించారు.. ఆ తర్వాత రోడ్ వెంబడి ఉండే డివైడర్ వైపు చెట్ల పొదల్లోకి నాగు పాము వెళ్లడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..1
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1