logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అమావాస్య పూజలందుకున్న చిక్కనేశ్వరుడు రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం లో వెలసిన ప్రసిద్ధ చిక్కనేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు.భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.

9 hrs ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago
5992a725-c0bc-4a47-b5c0-e779d6e67651

అమావాస్య పూజలందుకున్న చిక్కనేశ్వరుడు రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం లో వెలసిన ప్రసిద్ధ చిక్కనేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు.భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చింతల ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    చింతల ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_M vinod kumar
    M vinod kumar
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్‌డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్‌డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.
జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_అధ్యక్ష న్యూస్
    అధ్యక్ష న్యూస్
    Local News Reporter అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కాలువలో తీసిన డ్రైనేజీ చెత్తను తరలించండి ..! గుత్తి మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్లో గల డ్రైనేజీ కాలవలో చెత్తాచెదారాన్ని బయటకి తీశారు. అయితే వారం రోజులు గడుస్తున్నా రోడ్డుపై ఉన్న చెత్తను తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని పాదచారులు, వాహనాదారులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని అధికారులను పాదచారులు విన్నవించారు.
    1
    కాలువలో తీసిన డ్రైనేజీ చెత్తను తరలించండి ..!
గుత్తి మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్లో గల డ్రైనేజీ కాలవలో చెత్తాచెదారాన్ని బయటకి తీశారు. అయితే వారం రోజులు గడుస్తున్నా రోడ్డుపై ఉన్న చెత్తను తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని పాదచారులు, వాహనాదారులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని అధికారులను పాదచారులు విన్నవించారు.
    user_S.BASHA న్యూస్ రిపోర్టర్.  గుత్తి
    S.BASHA న్యూస్ రిపోర్టర్. గుత్తి
    గూటి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • కేటీ దొడ్డి: మండలంలోని వివిధ గ్రామాల పంట పొలాల్లో సాగు అవుతున్న మామిడి తోటలకు ఈ సంవత్సరం అధిక వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. మామిడి తోటలు ఎక్కువగా సాగు అవుతున్న మండలంలో కేటి దొడ్డి ఉంది. పచ్చని ఆకులతో నిండుగా కనబడుతున్న చెట్లను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ సప్లై కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు.
    1
    కేటీ దొడ్డి: మండలంలోని వివిధ గ్రామాల పంట
పొలాల్లో సాగు అవుతున్న మామిడి తోటలకు ఈ సంవత్సరం అధిక వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. మామిడి తోటలు ఎక్కువగా సాగు అవుతున్న మండలంలో కేటి దొడ్డి ఉంది. పచ్చని ఆకులతో నిండుగా కనబడుతున్న చెట్లను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ సప్లై కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    11 hrs ago
  • మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..
    1
    మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు,  ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..
    user_SREENIVAS
    SREENIVAS
    Teacher మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అన్నమయ్య జిల్లా మదనపల్లె: బాలిక రిషిక ప్రియాను హత్య చేసిన ప్రదేశంలో ఉద్రిక్తత. వందలాదిగా తరలివచ్చిన స్థానికులు.. హిజ్రాలు సైతం రంగ ప్రవేశం.హంతకున్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు... ప్రజా కోర్టులో నిందితుని శిక్షించాలని సిపిఐ నాయకులు సాంబ డిమాండ్.
    1
    అన్నమయ్య జిల్లా మదనపల్లె: బాలిక రిషిక ప్రియాను హత్య చేసిన ప్రదేశంలో ఉద్రిక్తత.
వందలాదిగా తరలివచ్చిన స్థానికులు.. హిజ్రాలు సైతం రంగ ప్రవేశం.హంతకున్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు... ప్రజా కోర్టులో నిందితుని శిక్షించాలని సిపిఐ నాయకులు సాంబ డిమాండ్.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 min ago
  • బద్వేలు: పట్టణ అభివృద్ది సొసైటి సభ్యుల సమావేశంలో అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బద్వేలు మునిసిపాలిటీ ఏర్పడి 15 సంవత్సరాలు జరిగినా నేటికీ పట్టణం లోగల ప్రజలకు మౌళిక సదుపాయాల పూర్తిగా అందలేదని,శానిటరీ వర్కర్ల సంఖ్య పెంచి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని,యన్.జి.ఒ కాలనీలో ఉన్న పబ్లిక్ పర్పస్ 96 సెంట్లలో పార్కు,లైబ్రరీ చెన్నంపల్లె వద్ద స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు.ఆవాజ్ కమిటి పట్టణ అధ్యక్షులు యస్.ఎ.అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ పట్టణం లోని వీధుల రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నాయని, రోడ్లు గుంతలు పడి,డ్రైనేజీలు లేక వాహనదారులు,పాదచారులు అనేక ఇబ్బందులకు, ప్రమాదాలకు గురవుతున్నారని, పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున ప్రజలు టైఫాయిడ్ లాంటి దోమకాటు జ్వరాలతో బాధపడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ప్రధాన కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని మైన్ రోడ్లలో సాయంత్రం 5 గంటల తర్వాత ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా సంబధిత అధికారులు చర్యలు చేపట్టాలని, పట్టణానికి మధ్యలో ఉన్న నాగులచెరువును మధ్యలో బుద్ద విగ్రహావిగ్రహాన్ని ఏర్పాటుచేసి వినోద పర్యాటక చెరువుగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటి గౌరవాధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు,కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు, గనుమంతు రాజేష్ కుమార్,షేక్ మాహీర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి సరిత స్కూల్ కరస్పాండెంట్ రాము మరియు బిసి సంఘం నాయకులు వాకారామయ్య మరియు టెలిఫోన్ బాలయ్య మరియు చిన్న కేశం పల్లెమాజీ సర్పంచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు: పట్టణ అభివృద్ది సొసైటి సభ్యుల సమావేశంలో అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బద్వేలు మునిసిపాలిటీ ఏర్పడి 15 సంవత్సరాలు జరిగినా నేటికీ పట్టణం లోగల ప్రజలకు మౌళిక సదుపాయాల పూర్తిగా అందలేదని,శానిటరీ వర్కర్ల సంఖ్య పెంచి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని,యన్.జి.ఒ కాలనీలో ఉన్న పబ్లిక్ పర్పస్ 96 సెంట్లలో పార్కు,లైబ్రరీ చెన్నంపల్లె వద్ద స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు.ఆవాజ్ కమిటి పట్టణ అధ్యక్షులు యస్.ఎ.అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ పట్టణం లోని వీధుల రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నాయని, రోడ్లు గుంతలు పడి,డ్రైనేజీలు లేక వాహనదారులు,పాదచారులు అనేక ఇబ్బందులకు, ప్రమాదాలకు గురవుతున్నారని, పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున ప్రజలు టైఫాయిడ్ లాంటి దోమకాటు జ్వరాలతో బాధపడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ప్రధాన కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని మైన్ రోడ్లలో సాయంత్రం 5 గంటల తర్వాత ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా సంబధిత అధికారులు చర్యలు చేపట్టాలని, పట్టణానికి మధ్యలో ఉన్న నాగులచెరువును మధ్యలో బుద్ద విగ్రహావిగ్రహాన్ని ఏర్పాటుచేసి వినోద పర్యాటక చెరువుగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో  సొసైటి గౌరవాధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు,కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు, గనుమంతు రాజేష్ కుమార్,షేక్ మాహీర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సాయి సరిత స్కూల్ కరస్పాండెంట్ రాము మరియు బిసి సంఘం నాయకులు వాకారామయ్య మరియు టెలిఫోన్ బాలయ్య మరియు చిన్న కేశం పల్లెమాజీ సర్పంచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • బద్వేలు :న్యాయవాది మల్లారపు దామోదరం వినతి బద్వేలు మండలంలోని అనంతరాజపురం లక్ష్మీ పాలెం గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉన్నది గ్రామంలో ఉన్న వీధులలో చాలామంది బాత్రూం నీళ్లు రోడ్డుపైకి వదులుతున్నారు. చాలామందికి చెప్పిన వారు వినిపించుకోవడం లేదుఅని అంటున్నారు. గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్లాలంటే రోడ్డుపై నుంచి ఉన్న నాలుగు వీధుల లో ఏదో ఒక వీధిలో భక్తులు ఆలయానికి వెళ్తుంటారు. ప్రతిరోజు రోడ్డుపై నీళ్లు పాడుతున్నందున రోడ్డు బంక పట్టి కాలు పెడితే జారిపడే పరిస్థితి ఉన్నది. మరో 10 రోజుల్లో గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎక్కువ మంది భక్తులు ఈ నాలుగు వీధుల గుండా రాకపోకలు సాగిస్తారు .గ్రామంలో బుచ్చం గారి వీధి, కుమ్మరి వీధి ,యామయ్య గారి వీధి, ఆనుగొంది వారి వీధి ఈ నాలుగు వీధుల్లో నిత్యము రోడ్డుపై నీళ్లు పాడుతుంటాయి సచివాలయ అధికారులకు చెప్పిన పట్టించుకోలేదు అందువలన జిల్లా కలెక్టర్కు ,బద్వేలు ఎంపీడీవోకు, జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారికి, అనంతరాజపురం గ్రామపంచాయతీ కార్యదర్శి వినతి పత్రాలు నా ద్వారా పంపించాను అన్ని అన్నారు.ఈ విషయము జర్నలిస్టు మీ పత్రికలలో వేసి గ్రామంలో అపరిశుభ్రత లేకుండా అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని అనంతరాజపురం వాసి న్యాయవాది మల్లారపు దామోదర్ కోరుతున్నారు.
    1
    బద్వేలు :న్యాయవాది మల్లారపు దామోదరం వినతి 
బద్వేలు మండలంలోని అనంతరాజపురం లక్ష్మీ పాలెం గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉన్నది గ్రామంలో ఉన్న వీధులలో చాలామంది బాత్రూం నీళ్లు రోడ్డుపైకి వదులుతున్నారు. చాలామందికి చెప్పిన వారు వినిపించుకోవడం లేదుఅని అంటున్నారు. గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్లాలంటే రోడ్డుపై నుంచి ఉన్న నాలుగు వీధుల లో ఏదో ఒక వీధిలో భక్తులు ఆలయానికి వెళ్తుంటారు. ప్రతిరోజు రోడ్డుపై నీళ్లు పాడుతున్నందున రోడ్డు బంక పట్టి కాలు పెడితే జారిపడే పరిస్థితి ఉన్నది. మరో 10 రోజుల్లో గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎక్కువ మంది భక్తులు ఈ నాలుగు వీధుల గుండా రాకపోకలు సాగిస్తారు .గ్రామంలో బుచ్చం గారి వీధి, కుమ్మరి వీధి ,యామయ్య గారి వీధి, ఆనుగొంది వారి వీధి ఈ నాలుగు వీధుల్లో నిత్యము రోడ్డుపై నీళ్లు పాడుతుంటాయి సచివాలయ అధికారులకు చెప్పిన పట్టించుకోలేదు అందువలన జిల్లా కలెక్టర్కు ,బద్వేలు ఎంపీడీవోకు, జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారికి, అనంతరాజపురం గ్రామపంచాయతీ కార్యదర్శి వినతి పత్రాలు నా ద్వారా పంపించాను అన్ని అన్నారు.ఈ విషయము జర్నలిస్టు మీ పత్రికలలో  వేసి గ్రామంలో అపరిశుభ్రత లేకుండా అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని అనంతరాజపురం వాసి న్యాయవాది మల్లారపు దామోదర్ కోరుతున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.