logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్లబెల్లి మండలం, రుద్రగూడెం ఎస్సీ కాలనీలో ఎన్నికల హామీ మేరకు సుమారు రూ.6 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలోతు చరణ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాలోతు చరణ్ సింగ్ మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించిన తక్కువ కాలంలోనే ప్రజల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రుద్రగూడెం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీర తిరుపతి, జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘుపతిరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కర్దూరి కట్టయ్య, యూత్ అధ్యక్షుడు అయ్యప్పతో పాటు పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

6 hrs ago
user_Chetty:Ramesh
Chetty:Ramesh
నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
6 hrs ago
3b9f8de0-484a-423e-ac1b-8d7b41e35a17

నల్లబెల్లి మండలం, రుద్రగూడెం ఎస్సీ కాలనీలో ఎన్నికల హామీ మేరకు సుమారు రూ.6 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలోతు చరణ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాలోతు చరణ్ సింగ్ మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించిన తక్కువ కాలంలోనే ప్రజల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రుద్రగూడెం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీర తిరుపతి, జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘుపతిరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కర్దూరి కట్టయ్య, యూత్ అధ్యక్షుడు అయ్యప్పతో పాటు పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్, కౌన్సిలర్లు, క్లస్టర్ బాధ్యులు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, రాష్ట్ర ఏర్పాటు, దాని సజీవ నిలకడ కోసం జీవితకాలం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు. జయశంకర్ గారి చరిత్రను నవతరం యువతరం ఎవరూ మరువలేరని ఆయన అన్నారు. ప్రజా పోరాటాలను శాంతియుతంగా, గాంధీ మార్గంలో కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిన జయశంకర్ గారి సందేశం వల్లనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రారంభించి, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా అద్భుతమైన పాలనను 10 సంవత్సరాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా, సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తక్కువ కాలంలో పునర్నిర్మించిన వ్యూహకర్త కేసీఆర్ గారికి సలహా సూచనలు ఇచ్చిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ గారికి దక్కుతుందన్నారు. జయశంకర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు కేసీఆర్ గారి పాలన చేసిన తర్వాత, మార్పులో భాగంగా కొత్త పాలన రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పునిచ్చారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అభివృద్ధి పథంలో నచ్చిన తెలంగాణను మళ్లీ పునాదుల్లోనే అణిచివేసే కుట్ర రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. కేసీఆర్ గారు ఆనాడు వ్యూహ రచన చేసి సంక్షేమ పథకాలు అమలు చేసి, తక్కువ కాలంలో 90% తెలంగాణ పునర్నిర్మాణం సాధించారని గుర్తుచేస్తూ, కేసీఆర్ గారి వారసత్వాన్ని తుడిచిపెడతామంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆనవాళ్లను లేకుండా చేస్తామని చెప్పడమేనని తీవ్ర ఆరోపణ చేశారు.
    2
    నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్, కౌన్సిలర్లు, క్లస్టర్ బాధ్యులు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, రాష్ట్ర ఏర్పాటు, దాని సజీవ నిలకడ కోసం జీవితకాలం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు. జయశంకర్ గారి చరిత్రను నవతరం యువతరం ఎవరూ మరువలేరని ఆయన అన్నారు. ప్రజా పోరాటాలను శాంతియుతంగా, గాంధీ మార్గంలో కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిన జయశంకర్ గారి సందేశం వల్లనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రారంభించి, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా అద్భుతమైన పాలనను 10 సంవత్సరాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా, సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తక్కువ కాలంలో పునర్నిర్మించిన వ్యూహకర్త కేసీఆర్ గారికి సలహా సూచనలు ఇచ్చిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ గారికి దక్కుతుందన్నారు.

జయశంకర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు కేసీఆర్ గారి పాలన చేసిన తర్వాత, మార్పులో భాగంగా కొత్త పాలన రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పునిచ్చారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అభివృద్ధి పథంలో నచ్చిన తెలంగాణను మళ్లీ పునాదుల్లోనే అణిచివేసే కుట్ర రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. కేసీఆర్ గారు ఆనాడు వ్యూహ రచన చేసి సంక్షేమ పథకాలు అమలు చేసి, తక్కువ కాలంలో 90% తెలంగాణ పునర్నిర్మాణం సాధించారని గుర్తుచేస్తూ, కేసీఆర్ గారి వారసత్వాన్ని తుడిచిపెడతామంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆనవాళ్లను లేకుండా చేస్తామని చెప్పడమేనని తీవ్ర ఆరోపణ చేశారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • వరంగల్ నగరంలోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగోల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో శనివారం 'నమో జెన్-Z కన్క్లేవ్' సమావేశం ఘనంగా నిర్వహించబడింది. నవభారత నిర్మాణంలో యువత పాత్ర, దేశ ప్రగతిపై వారికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని ప్రశంసించారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలు నేటి 'జెన్-Z' యువతకు సరికొత్త అవకాశాలను సృష్టించాయని వివరించారు. దేశ భద్రత, ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల కల్పనలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను యువతకు తెలియజేసి, వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను కావాలని దిశా నిర్దేశం చేశారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ముఖ్య అతిథులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేసిందని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో యువత అంతా మోడీ గారి అభివృద్ధి విధానాలకు ఆకర్షితులవుతున్నారని, దేశ సరిహద్దుల రక్షణ నుండి అంతరిక్ష రంగం వరకు భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి యువత గర్విస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రత్నం సతీష్, ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై. శ్రవణ్, ప్రశాంత్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, నర్సంపేట నియోజకవర్గ నాయకులు, పదాధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బీజేవైఎం శ్రేణులు నిరంతరం యువత సమస్యలపై పోరాడుతూనే, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    3
    వరంగల్ నగరంలోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగోల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో శనివారం 'నమో జెన్-Z కన్క్లేవ్' సమావేశం ఘనంగా నిర్వహించబడింది. నవభారత నిర్మాణంలో యువత పాత్ర, దేశ ప్రగతిపై వారికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం.

ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని ప్రశంసించారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలు నేటి 'జెన్-Z' యువతకు సరికొత్త అవకాశాలను సృష్టించాయని వివరించారు. దేశ భద్రత, ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల కల్పనలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను యువతకు తెలియజేసి, వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను కావాలని దిశా నిర్దేశం చేశారు.

దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ముఖ్య అతిథులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేసిందని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో యువత అంతా మోడీ గారి అభివృద్ధి విధానాలకు ఆకర్షితులవుతున్నారని, దేశ సరిహద్దుల రక్షణ నుండి అంతరిక్ష రంగం వరకు భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి యువత గర్విస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రత్నం సతీష్, ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై. శ్రవణ్, ప్రశాంత్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, నర్సంపేట నియోజకవర్గ నాయకులు, పదాధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బీజేవైఎం శ్రేణులు నిరంతరం యువత సమస్యలపై పోరాడుతూనే, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    user_Vinod Kumar paladugula
    Vinod Kumar paladugula
    Local News Reporter నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • హనుమకొండకు చెందిన బండా సదానంద రావు పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పనిచేసి 1998లో పదవీ విరమణ పొందారు. ఆయన కుమార్తె బండా రామలీల 2021లో బాలసముద్రంలో మల్లికాంబ మనోవికాస కేంద్రాన్ని ప్రారంభించగా, తండ్రి సదానంద రావు ఆమెకు పూర్తి అండగా నిలిచారు. గత 24 ఏళ్లుగా ప్రత్యేక అవసరాలున్న మరియు మానసిక వికలాంగులైన సుమారు 220 మందికి సేవలు అందిస్తూ తండ్రీకూతుళ్లు ఇద్దరూ ఆదర్శంగా నిలిచారు. ఫాదర్స్ డే సందర్భంగా వారి ఈ విశేషమైన సేవాభావం అనేక మంది ప్రశంసలు అందుకుంటోంది.
    1
    హనుమకొండకు చెందిన బండా సదానంద రావు పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పనిచేసి 1998లో పదవీ విరమణ పొందారు. ఆయన కుమార్తె బండా రామలీల 2021లో బాలసముద్రంలో మల్లికాంబ మనోవికాస కేంద్రాన్ని ప్రారంభించగా, తండ్రి సదానంద రావు ఆమెకు పూర్తి అండగా నిలిచారు. గత 24 ఏళ్లుగా ప్రత్యేక అవసరాలున్న మరియు మానసిక వికలాంగులైన సుమారు 220 మందికి సేవలు అందిస్తూ తండ్రీకూతుళ్లు ఇద్దరూ ఆదర్శంగా నిలిచారు. ఫాదర్స్ డే సందర్భంగా వారి ఈ విశేషమైన సేవాభావం అనేక మంది ప్రశంసలు అందుకుంటోంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • జూన్ 21న తమిళనాడు రాష్ట్రంలో విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ మహాసంఘ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ డా. మద్దిశెట్టి సామేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో సుమారు 30 గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు, ఆలయ పూజారులు, ధర్మకర్తలు మరియు హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభకు విచ్చేసిన డా. మద్దిశెట్టి సామేలుకు పూలమాలలు, బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, మహంత్ ముకేశ్ నాథ్ జీ ఆదేశాల మేరకు, చిన్నదురై గారిని తమిళనాడు రాష్ట్ర విశ్వ హిందూ మహాసంఘ్ అధ్యక్షుడిగా ప్రకటించారు. అలాగే, డా. మద్దిశెట్టి సామేలు తమిళనాడులోని 30 గ్రామ పంచాయతీల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సంస్థను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.
    1
    జూన్ 21న తమిళనాడు రాష్ట్రంలో విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ మహాసంఘ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ డా. మద్దిశెట్టి సామేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సభలో సుమారు 30 గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు, ఆలయ పూజారులు, ధర్మకర్తలు మరియు హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభకు విచ్చేసిన డా. మద్దిశెట్టి సామేలుకు పూలమాలలు, బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, మహంత్ ముకేశ్ నాథ్ జీ ఆదేశాల మేరకు, చిన్నదురై గారిని తమిళనాడు రాష్ట్ర విశ్వ హిందూ మహాసంఘ్ అధ్యక్షుడిగా ప్రకటించారు.

అలాగే, డా. మద్దిశెట్టి సామేలు తమిళనాడులోని 30 గ్రామ పంచాయతీల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సంస్థను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.
    user_Shiva shankar Yld
    Shiva shankar Yld
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
  • వీణవంక మండలంలోని కోర్కల్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఈ నూతన చేనేత సంఘం అధ్యక్షుడిగా అడిగొప్పుల సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలుగా అడిగొప్పుల నిర్మల, కోశాధికారిగా బొద్ధుల భావనఋషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు కొత్త డైరెక్టర్ల కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి జిల్లా ఎన్నికల అధికారి పలుకల సురేందర్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం, నూతనంగా ఎన్నికైన చేనేత సంఘం అధ్యక్షుడు అడిగొప్పుల సత్యనారాయణ మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు మరియు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కోర్కల్ చేనేత సహకార సంఘం అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జక్కు అరుణ, దూడం సంజీవులు, మార్త అశోక్, సిరిపురం శంకరయ్య, సింగం కుమార స్వామి, సింగం రామస్వామిలతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
    1
    వీణవంక మండలంలోని కోర్కల్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఈ నూతన చేనేత సంఘం అధ్యక్షుడిగా అడిగొప్పుల సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలుగా అడిగొప్పుల నిర్మల, కోశాధికారిగా బొద్ధుల భావనఋషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు కొత్త డైరెక్టర్ల కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి జిల్లా ఎన్నికల అధికారి పలుకల సురేందర్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.

అనంతరం, నూతనంగా ఎన్నికైన చేనేత సంఘం అధ్యక్షుడు అడిగొప్పుల సత్యనారాయణ మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు మరియు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కోర్కల్ చేనేత సహకార సంఘం అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జక్కు అరుణ, దూడం సంజీవులు, మార్త అశోక్, సిరిపురం శంకరయ్య, సింగం కుమార స్వామి, సింగం రామస్వామిలతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
    user_T. sridhar✍️
    T. sridhar✍️
    వీణవంక, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థిని కేవలం మూడు నిముషాల ఆలస్యం కారణంగా నీట్ పరీక్ష రాయలేకపోయింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉన్నప్పటికీ, విద్యార్థిని కొండగట్టు జేఎన్టీయూ నీట్ పరీక్షా కేంద్రానికి ఒంటి గంట 33 నిముషాలకు చేరుకుంది. అప్పటికే గేట్లు మూసివేసిన అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని విద్యార్థిని తల్లి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నా, నిబంధనల ప్రకారం ప్రవేశం కల్పించలేమని అధికారులు స్పష్టం చేశారు. గొల్లపల్లి మండలం రాపల్లి నుంచి ఆటోలో రావడం వల్ల ఆలస్యమైందని విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల కారణంగా కన్నీటి పర్యంతమై వారు వెనుతిరిగారు. ఈ నిముషం ఆలస్యం నిబంధనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, విద్యార్థిని భావోద్వేగ పరిస్థితిని చూసిన స్థానికులు, తోటి విద్యార్థులు సైతం విచారం వ్యక్తం చేశారు.
    4
    జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థిని కేవలం మూడు నిముషాల ఆలస్యం కారణంగా నీట్ పరీక్ష రాయలేకపోయింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉన్నప్పటికీ, విద్యార్థిని కొండగట్టు జేఎన్టీయూ నీట్ పరీక్షా కేంద్రానికి ఒంటి గంట 33 నిముషాలకు చేరుకుంది. అప్పటికే గేట్లు మూసివేసిన అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు.

పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని విద్యార్థిని తల్లి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నా, నిబంధనల ప్రకారం ప్రవేశం కల్పించలేమని అధికారులు స్పష్టం చేశారు. గొల్లపల్లి మండలం రాపల్లి నుంచి ఆటోలో రావడం వల్ల ఆలస్యమైందని విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల కారణంగా కన్నీటి పర్యంతమై వారు వెనుతిరిగారు. ఈ నిముషం ఆలస్యం నిబంధనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, విద్యార్థిని భావోద్వేగ పరిస్థితిని చూసిన స్థానికులు, తోటి విద్యార్థులు సైతం విచారం వ్యక్తం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు. ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు.

ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter Jangoan, Telangana•
    5 hrs ago
  • జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరుగుతాయని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టడంతో పాటు బీఎన్ఏలకు శిక్షణ కార్యక్రమాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మరింత మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన సూచనలు కూడా ఆయన ఇవ్వనున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని మండల, క్లస్టర్ ఇన్‌చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని రాజయ్య పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరుగుతాయని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు.

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టడంతో పాటు బీఎన్ఏలకు శిక్షణ కార్యక్రమాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మరింత మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన సూచనలు కూడా ఆయన ఇవ్వనున్నారని తెలిపారు.

నియోజకవర్గంలోని మండల, క్లస్టర్ ఇన్‌చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని రాజయ్య పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.