అచ్యుతాపురం, గుమ్మళ్లదొడ్డిలో ఘనంగా కంబాల కానుక వనితల వేడుక... 1,650 మంది మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసిన కంబాల శ్రీనివాసరావు.. అచ్యుతాపురం, గుమ్మళ్లదొడ్డిలో ఘనంగా కంబాల కానుక వనితల వేడుక... 1,650 మంది మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసిన కంబాల శ్రీనివాసరావు.. కోరుకొండ ఆగస్టు 01మన జ్యోతి గోకవరం మండలం అచ్చుతాపురం, గుమ్మళ్ళదొడ్డి గ్రామాలలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కంబాల కానుక వనితల వేడుక పట్టు చీరలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు తొలిత ఆయా గ్రామాల మహిళలు హరతులతో స్వాగతం పలికారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, యువత అభిమానులు ఘన స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించారు. ఆయా గ్రామాలలోని ఆలయాలను దర్శించుకుని, పూజలు నిర్వహించి, గ్రామ దేవతలకు తొలి చీరలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల నుంచి కులమతాలకు అతీతంగా మహిళలు తరలివచ్చారు. ఈ సందర్బంగా కంబాల శ్రీనివారావు మాట్లాడుతూ శ్రావణమాసం సందర్భంగా మహిళలకు ఉచితంగా పట్టు చీరలను అందించేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని, వారిని గౌరవించుకోవడం మన బాధ్యతని అన్నారు. కులమతాలకు అతీతంగా జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం, మూడు నియోజకవర్గాల్లో తమ సేవలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదం, సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని వెల్లడించారు. పట్టు చీరల పంపిణీ కార్యక్రమానికి గ్రామాలలో మహిళాల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. అనంతరం అచ్చుతాపురం గ్రామంలో 730 మంది మహిళలకు, గుమ్మళ్ళ దొడ్డి గ్రామంలో 920 మంది మహిళలకు ఉచితంగా పట్టు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు...
అచ్యుతాపురం, గుమ్మళ్లదొడ్డిలో ఘనంగా కంబాల కానుక వనితల వేడుక... 1,650 మంది మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసిన కంబాల శ్రీనివాసరావు.. అచ్యుతాపురం, గుమ్మళ్లదొడ్డిలో ఘనంగా కంబాల కానుక వనితల వేడుక... 1,650 మంది మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసిన కంబాల శ్రీనివాసరావు.. కోరుకొండ ఆగస్టు 01మన జ్యోతి గోకవరం మండలం అచ్చుతాపురం, గుమ్మళ్ళదొడ్డి గ్రామాలలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కంబాల కానుక వనితల వేడుక పట్టు చీరలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు తొలిత ఆయా గ్రామాల మహిళలు హరతులతో స్వాగతం పలికారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, యువత అభిమానులు ఘన స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించారు. ఆయా గ్రామాలలోని ఆలయాలను దర్శించుకుని, పూజలు నిర్వహించి, గ్రామ దేవతలకు తొలి చీరలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల నుంచి కులమతాలకు అతీతంగా మహిళలు తరలివచ్చారు. ఈ సందర్బంగా కంబాల శ్రీనివారావు మాట్లాడుతూ శ్రావణమాసం సందర్భంగా మహిళలకు ఉచితంగా పట్టు చీరలను అందించేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని, వారిని గౌరవించుకోవడం మన బాధ్యతని అన్నారు. కులమతాలకు అతీతంగా జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం, మూడు నియోజకవర్గాల్లో తమ సేవలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదం, సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని వెల్లడించారు. పట్టు చీరల పంపిణీ కార్యక్రమానికి గ్రామాలలో మహిళాల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. అనంతరం అచ్చుతాపురం గ్రామంలో 730 మంది మహిళలకు, గుమ్మళ్ళ దొడ్డి గ్రామంలో 920 మంది మహిళలకు ఉచితంగా పట్టు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు...
- Post by Adimlamganash1
- వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్కు పోటెత్తిన జనం. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు. స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి. అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.1
- భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...1
- 🙏🙏1
- Post by Adimlamganash1
- భద్రాచలం రామాలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి స్థానాలవాటిక వద్దకు చేరుకున్న గోదావరి వరద నీరు భద్రాచలం లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు1