దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు దిశ వినుకొండ: దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం వినుకొండలోని తన కార్యాలయం వద్ద శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 మంది దివ్యాంగులకు ఆయన బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, గతంలో ఉన్న రూ. 3,000 పెన్షన్ను తమ ప్రభుత్వం రూ. 6,000కు పెంచి భరోసా ఇచ్చిందని గుర్తుచేశారు. 'దివ్యాంగ శక్తి' పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12.76 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, దీని కోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 207 కోట్ల సబ్సిడీ భరిస్తోందని వివరించారు. ఒక్కోటి రూ. 40 వేల విలువైన ఈ ట్రై సైకిళ్లు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని, వీటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి పార్టీల నాయకులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు దిశ వినుకొండ: దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం వినుకొండలోని తన కార్యాలయం వద్ద శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 మంది దివ్యాంగులకు ఆయన బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, గతంలో ఉన్న రూ. 3,000 పెన్షన్ను తమ ప్రభుత్వం రూ. 6,000కు పెంచి భరోసా ఇచ్చిందని గుర్తుచేశారు. 'దివ్యాంగ శక్తి' పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12.76 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, దీని కోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 207 కోట్ల సబ్సిడీ భరిస్తోందని వివరించారు. ఒక్కోటి రూ. 40 వేల విలువైన ఈ ట్రై సైకిళ్లు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని, వీటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి పార్టీల నాయకులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
- పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.1
- Post by Syyed taher1
- నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా, హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- బద్వేలు : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజీనామా చేయాలని ,చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు అగ్రసేనీ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ వి బి సి ఛానల్ అధిపతి పృథ్వీరాజ్ మహిళల పట్ల చేసిన పాపానికి తక్షణమే తొలగించాలని గుర్తు చేశారు. నైతిక బాధిత వహించి బి ఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ముక్తకంఠంగా అందరూ నినాదాలు చేశారు.2
- Post by Bondhu Suresh1
- ఊటుకూరు లో బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పార్లమెంటులో ఆంధ్రుల రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది4
- నందిగామలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. పాఠశాలలో సదుపాయాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.1