నాలుగు లేబర్ కోడ్ లు రద్దుకై మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి-ఎజె రమేష్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి - మోడీ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం ఆగదని , నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్ పిలుపునిచ్చారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో లేబర్ కోడ్ ల విధివిధానాల ప్రతులను దగ్ధం చేయడం జరిగింది . ఈ నిరసన కార్యక్రమం లో ఏజే రమేష్ మాట్లాడుతూ భారతదేశ కార్మిక వర్గంపై నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి హక్కులను హరించే పద్ధతిలో వ్యవహరిస్తున్న బిజెపి విధానాలను కార్మిక వర్గం పసిగట్టి పోరాటాలను ఉధృతం చేయాలని ఆయన అన్నారు. నాలుగు లేబర్ కోడ్ లు అమలు అయితే పనిగంటలు పెరుగుతాయని, చాలీచాలని జీతాలు సరిపుచ్చుకోవాలని, పారిశ్రామిక సంబంధాల హక్కులను కోల్పోతామని, పరిశ్రమలో పనిచేసే కార్మికులందరూ కట్టు బానిసల్లాగా తయారవుతారని అన్ని విధాలుగా నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కార్మిక వర్గం గొంతెత్తి నినదించి ఫిబ్రవరి 12 తేదీన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న తీరును బట్టి కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని ఇప్పటికైనా మార్చుకోవాలని, లేదంటే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కార్మికుల పోరాటానికి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆగ్రహ జ్వాలకు బలి కావద్దని ఆయన అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించకుండా బలవంతంగా కేంద్రంలో అధికారంలో ఉన్నామని ధీమాతో ఏమీ ఎవరూ చేయలేరని పొగరుబోతు తనంతో పరిపాలన సాగిస్తున్న రాక్షస బిజెపి విధానాలను కార్మిక వర్గం తిప్పి కొట్టాలని ఆయన అన్నారు. కార్మిక శ్రమతోని ఉత్పత్తి చేస్తుంటే సంపద సృష్టికర్తలైన శ్రామిక వర్గాన్ని బానిసల్లాగా చేసి శ్రమ దోపిడీ చేయడానికి 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్పొరేట్ కంపెనీలకి అత్యంత విలువైన కార్మిక శ్రమను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు . బ్రిటిష్ కాలంలో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసే అధికారం ఉందని విర్రవీగుతున్న బిజెపి మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నేడు సమ్మె చేస్తున్న కార్మిక వర్గం దేశ ప్రజలపై భారాలు మోపుతున్న బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని కార్మిక కర్షక ,మైత్రితో మోడీ విధానాలపై ప్రజలందరినీ చైతన్యపరిచి భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. భారతదేశ శ్రామిక శక్తిని కార్పోరేట్లకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే బ్రిటిష్ పాలకవర్గానికి పట్టిన గతే బిజెపి ప్రభుత్వానికి పడుతుందని ఆయన అన్నారు . మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు ..
నాలుగు లేబర్ కోడ్ లు రద్దుకై మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి-ఎజె రమేష్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి - మోడీ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం ఆగదని , నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్ పిలుపునిచ్చారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో లేబర్ కోడ్ ల విధివిధానాల ప్రతులను దగ్ధం చేయడం జరిగింది . ఈ నిరసన కార్యక్రమం లో ఏజే రమేష్ మాట్లాడుతూ భారతదేశ కార్మిక వర్గంపై నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి
హక్కులను హరించే పద్ధతిలో వ్యవహరిస్తున్న బిజెపి విధానాలను కార్మిక వర్గం పసిగట్టి పోరాటాలను ఉధృతం చేయాలని ఆయన అన్నారు. నాలుగు లేబర్ కోడ్ లు అమలు అయితే పనిగంటలు పెరుగుతాయని, చాలీచాలని జీతాలు సరిపుచ్చుకోవాలని, పారిశ్రామిక సంబంధాల హక్కులను కోల్పోతామని, పరిశ్రమలో పనిచేసే కార్మికులందరూ కట్టు బానిసల్లాగా తయారవుతారని అన్ని విధాలుగా నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కార్మిక వర్గం గొంతెత్తి నినదించి ఫిబ్రవరి 12 తేదీన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న తీరును బట్టి కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని ఇప్పటికైనా మార్చుకోవాలని, లేదంటే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
కార్మికుల పోరాటానికి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆగ్రహ జ్వాలకు బలి కావద్దని ఆయన అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించకుండా బలవంతంగా కేంద్రంలో అధికారంలో ఉన్నామని ధీమాతో ఏమీ ఎవరూ చేయలేరని పొగరుబోతు తనంతో పరిపాలన సాగిస్తున్న రాక్షస బిజెపి విధానాలను కార్మిక వర్గం తిప్పి కొట్టాలని ఆయన అన్నారు. కార్మిక శ్రమతోని ఉత్పత్తి చేస్తుంటే సంపద సృష్టికర్తలైన శ్రామిక వర్గాన్ని బానిసల్లాగా చేసి శ్రమ దోపిడీ చేయడానికి 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్పొరేట్ కంపెనీలకి అత్యంత విలువైన కార్మిక శ్రమను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు
. బ్రిటిష్ కాలంలో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసే అధికారం ఉందని విర్రవీగుతున్న బిజెపి మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నేడు సమ్మె చేస్తున్న కార్మిక వర్గం దేశ ప్రజలపై భారాలు మోపుతున్న బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని కార్మిక కర్షక ,మైత్రితో మోడీ విధానాలపై ప్రజలందరినీ చైతన్యపరిచి భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. భారతదేశ శ్రామిక శక్తిని కార్పోరేట్లకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే బ్రిటిష్ పాలకవర్గానికి పట్టిన గతే బిజెపి ప్రభుత్వానికి పడుతుందని ఆయన అన్నారు . మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు ..
- భద్రాచలంలో తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరిగింది. నాయకులు, అభిమానులు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను, ముఖ్యంగా అపర భగీరథుడిగా ఆయన కృషిని కొనియాడారు.1
- హన్మకొండ జిల్లా ఐనవోలు నుండి 11 మంది హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టుకు పాదయాత్ర మొదలుపెట్టారు. నాలుగు రోజుల పాటు సుమారు 150 కిలోమీటర్లు నడిచి, వారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మాల విరమణ చేయనున్నారు.1
- హనుమకొండలోని కేయూ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీస్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ లారీ డ్రైవర్ను తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది, పోలీస్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.1
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించిన విజయ్ నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.1
- నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తుందని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు తెలిపారు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే సిలిండర్ అందించాలని డిమాండ్ చేశారు.1
- హైదరాబాద్కు చెందిన కండ్లకుంట శ్రీకాంత్, నీలిమ దంపతులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి అరుదైన కానుక సమర్పించారు. సుమారు 3 లక్షల రూపాయల విలువైన రాగిపై బంగారు పూత కలిగిన 108 తులసి దళాలను ఆలయ అధికారులకు అందజేశారు.2
- 40 ఎకరాల పామాయిల్ తోట ఖమ్మం జిల్లా కల్లూరులో అమ్మకానికి సిద్ధంగా ఉంది. నాలుగు బోర్లు, వివిధ వయసుల పామాయిల్ మొక్కలతో కూడిన ఈ భూమికి ఎకరం 31 లక్షలు ధర చెబుతున్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఇచ్చిన నంబర్ను సంప్రదించవచ్చు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆకేరు వాగుపై రూ.46 లక్షల వ్యయంతో నూతన చెక్డ్యామ్ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంది, రైతన్నలకు లబ్ధి చేకూరుతుంది. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని నేతలు తెలిపారు.1