Shuru
Apke Nagar Ki App…
వేముల మండలం వి. కొత్తపల్లిలో ఘనంగా అమ్మవారి బోనాల పండుగ వేముల మండలం వి.కొత్తపల్లిలో ఆదివారం బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పసుపు,కుంకుమలతో అలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువతీయువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
LAKKU SIVA SANKAR reddy
వేముల మండలం వి. కొత్తపల్లిలో ఘనంగా అమ్మవారి బోనాల పండుగ వేముల మండలం వి.కొత్తపల్లిలో ఆదివారం బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పసుపు,కుంకుమలతో అలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువతీయువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బర్త్డే హంగామాకు బ్రేక్.. 9 మందిపై కేసు! రోడ్డుపై బైక్ స్టంట్స్.. ఇందుకూరు బస్టాండ్లో యువకుల హల్చల్ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఇన్స్పెక్టర్ శివరాముడు పుట్టినరోజు వేడుకల పేరుతో రోడ్డుపై హంగామా చేస్తూ బైక్ స్టంట్స్ నిర్వహించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించిన తొమ్మిది మందిపై ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ముదిగుబ్బ ఇన్స్పెక్టర్ జి. శివరాముడు హెచ్చరించారు.ఈ నెల 8న ఇందుకూరు బస్టాండ్ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడంతో పాటు బైక్ స్టంట్స్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ, గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందడంతో ముదిగుబ్బ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఈ సందర్భంగా మేకల బద్రి, లేపాక్షి టోపీ సాహెబ్, బిల్లే ఆకాష్, డేరంగుల దినేష్, దేవర రామమోహన్, భోగరాతి సాయికుమార్, మేకల వంశీ, సంగాల ప్రసాద్, మట్ట మల్లికార్జునరెడ్డిలను పోలీసులు గుర్తించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు.కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం ఈ ఘటనపై ఈ నెల 9న ముదిగుబ్బ గ్రామీణ పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 87/2026 కింద భారతీయ న్యాయ సంహితలోని 126(2), 281, 290 సెక్షన్లతో పాటు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్లపై అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్ స్టంట్స్ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం చట్టపరంగా చర్యలకు దారితీస్తుందని పోలీసులు తెలిపారు.వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ జి. శివరాముడు మాట్లాడుతూ.. పుట్టినరోజులు, పండుగలు, ఇతర వేడుకలను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. రోడ్లపై హంగామా చేయడం, బైక్ స్టంట్స్ నిర్వహించడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని శివరాముడు కోరారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.3
- మిత్రమాARDV కంపెనీలో జాయిన్ అయ్యి డైలీ టాస్క్ చూస్తూ సెల్ఫ్ గా 135 రూపాయలు సంపాదించుకోవచ్చు మిత్రమా1
- రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ బైక్ స్టంట్స్, ప్రజాశాంతికి భంగం కలిగించిన 9 మందిపై ముదిగుబ్బ పోలీసులు చట్టపరమైన చర్యలు శ్రీ సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, *శ్రీ S. సతీష్ కుమార్, I.P.S* గారి ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్-డివిజన్ పోలీసు అధికారి, *B.V. జగన్నాధ రాజు* గారి సూచనలతో ముదిగుబ్బ పోలీసులు గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. 08-08-2026న ఇందుకూరు బస్టాండ్ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడం, బైక్ స్టంట్స్ చేయడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం మరియు గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ముదిగుబ్బ పోలీసులు అక్కడికి చేరుకుని *మేకల బద్రి, లేపాక్షి టోపీ సాహెబ్, బిల్లే ఆకాష్, డేరంగుల దినేష్, దేవర రామ మోహన్, భోగరాతి సాయికుమార్, మేకల వంశీ, సంగాల ప్రసాద్ మరియు మట్ట మల్లికార్జున రెడ్డిలను* గుర్తించి, వారికి *కౌన్సెలింగ్* ఇచ్చి అక్కడి నుండి పంపించారు. ఈ ఘటనపై 09-08-2026న ప్రత్యేక నివేదిక అందగా, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. రోడ్లపై *అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్ స్టంట్స్ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం సహించబోమని ముదిగుబ్బ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి. శివరాముడు* గారు హెచ్చరించారు. ప్రజలు పండుగలు, వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.2
- అప్పనపల్లి పంచాయతీలో రూ.2 కోట్లకు పైగా నిధుల అక్రమాలపై ACB / Vigilance & Enforcement విచారణకు డిమాండ్ 14వ, 15వ ఆర్థిక సంఘం, అమృత్ సరోవర్ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి.. ప్రెస్ నోట్ కడప జిల్లా: కాజీపేట మండలం అప్పనపల్లి గ్రామ పంచాయతీలో 2021 నుండి 2025 సంవత్సరం చివరి వరకు 14వ, 15వ ఆర్థిక సంఘం మరియు అమృత్ సరోవర్ పథకం కింద మంజూరైన నిధుల వినియోగంపై తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సాధారణ పంచాయతీరాజ్ శాఖ విచారణకు మాత్రమే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్కు వినతిపత్రం సమర్పించారు.జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈ వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాలకొండయ్య, కాలా వీరబ్రహ్మం, అధ్యక్షుడు పోకల శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.అప్పనపల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం, పత్రాలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా అమృత్ సరోవర్ మరియు ఇతర పంచాయతీ నిధులకు సంబంధించి రూ.2 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగి ఉండవచ్చనే ఆరోపణలు ఉన్నాయని, ఇందులో సుమారు రూ.1,43,30,108/- వరకు నిధులు వాస్తవ పనులు లేకుండానే లేదా పనుల వాస్తవికతపై అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో డ్రా/వినియోగం చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. అమృత్ సరోవర్ పనులపై భౌతిక పరిశీలన చేయాలి అమృత్ సరోవర్ పథకం కింద వాస్తవంగా చెరువులు లేదా పనులు లేని ప్రదేశాల్లో పనులు జరిగినట్లు చూపించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున, ప్రతి పని ప్రదేశాన్ని అధికారులు భౌతికంగా పరిశీలించి రికార్డుల్లో చూపిన పనులతో వాస్తవ పరిస్థితిని పోల్చి చూడాలని వారు కోరారు.అలాగే Measurement Books (MBs), బిల్లులు, వౌచర్లు, మస్టర్ రోల్స్, జియోట్యాగ్ ఫోటోలు, GPS వివరాలు, పని పూర్తి ధృవీకరణ పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే, బాధ్యుల నుండి ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయడంతో పాటు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బంది, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల పాత్రను గుర్తించి క్రిమినల్, శాఖాపరమైన మరియు ఆర్థిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏదైనా విచారణ జరిగి ఉంటే, దానికే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర పునర్విచారణ చేపట్టాలని కోరారు.విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అసలు రికార్డులు, కంప్యూటర్ డేటా, డిజిటల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను భద్రపరచాలని కూడా జిల్లా కలెక్టర్ను కోరారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి, నిధుల రికవరీతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.3
- కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వల్లం కొండు వెంకటరమణ ప్రమాణ స్వీకారం. టీజీ వెంకటేష్ కు క్రేన్ తో గజమాల వేసి స్వాగతం పలికిన సొల్లేటి వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు, కమిటీ . జిల్లా నలుమూల నుండి ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ లో కదం దక్కిన ఆర్యవైశ్యులు. బద్వేలు, ఆగస్టు 09 : బద్వేలు పట్టణంలోని చెన్నంపల్లి సమీపంలో ఉన్న ఆర్ఆర్ కన్వెన్షన్లో ఆదివారం కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వల్లంపండు వెంకటరమణ ,సెక్రటరీగా సివి నాగేశ్వరరావు, ట్రెజరర్ గా పద్ధతి చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెలిశెట్టి ప్రసాద్ ,మహిళ కమిటీ అధ్యక్షురాలుగా రాజా ,వెంకట వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా కుంజేటి అరుణ ,కోశాధికారిగా దేవత లలిత, యోజన సంఘం అధ్యక్షులుగా సన్నుతి హేమన్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ గా దొంతు సతీష్, సెక్రటరీగా అయ్యప్ప మనోజ్ ,కోశాధికారిగా పైడిమర్రి సురేష్ బాబు, వాసవి సేవా అధ్యక్షులుగా గాజులపల్లి హరి గోపాల్, సెక్రటరీగా రెడ్డి సురేష్, ట్రెజరర్ గా నాగ అభిరామ్, ప్రమాణస్వీకారంమహోత్సవ కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా మహాసభ అధ్యక్షులు నెల్లూరు లక్ష్మయ్య ,ప్రధాన కార్యదర్శి మాటూరు రంగనాథ్ ,మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు, మహాసభ ఉపాధ్యక్షులు పబ్బిశెట్టి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య, గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు శ్రేష్టి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కూడా) చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు శ్రేష్టిలకు ఘన స్వాగతం లభించింది. ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సొల్లేటి రమణ నేతృత్వంలో క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి అతిథులను సత్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వల్లంకొండు వెంకటరమణ, కమిటీ సభ్యులు ప్రత్యేక కోలాటాలు, భజంత్రీలు, వేద పండితుల పూర్ణకుంభ స్వాగతంతో శోభాయాత్రగా సభా ప్రాంగణానికి తీసుకెళ్లారు. జ్యోతి ప్రజ్వలన, అమ్మవారి ప్రార్థనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా వల్లంకొండు వెంకటరమణ, వారి కార్యవర్గం చేత ఆర్యవైశ్య మహాసభ నాయకులు ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాజా వెంకట వరలక్ష్మి మరియు వారి కార్యవర్గంతో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కే. రజిని, ప్రధాన కార్యదర్శి ఏ. సాయి నికిత, కోశాధికారి గంగా నాగ సుప్రజ ప్రమాణ స్వీకారం చేయించారు. ఐకమత్యంతోనే గుర్తింపు – టీజీ వెంకటేష్ పిలుపు: అనంతరం జరిగిన సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఐక్యత ఉన్నప్పుడే సమాజంలోనూ, అన్ని రాజకీయ పార్టీల్లోనూ తగిన గౌరవం లభిస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు అవకాశాలు కల్పించాలని, వ్యాపార రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ రాణించాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ఆర్యవైశ్యులకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ద్వారా పూర్తి అందిస్తామని హామీ ఇచ్చారు. క్షేమానికి, కష్టాల్లో ఉన్న వైశ్యులను ఆదుకోవడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కడప జిల్లా: మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ, కడప జిల్లాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఘనంగా జరగడం అభినందనీయమన్నారు. సంఘం సభ్యత్వ నమోదులో కడప జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం వెనుక జిల్లా అధ్యక్షుడు వల్లంకొండు వెంకటరమణ కృషి ఎంతో ఉందన్నారు. విజయవాడలో నిర్మిస్తున్న ఆర్యవైశ్య భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ‘కూడా’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ సంఘం విషయానికి వచ్చేసరికి ఐకమత్యంగా ఉండాలని సూచించారు. భారీగా తరలివచ్చిన బంధుమిత్తులు: ఈ మహోత్సవంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటూరు రంగనాద్, రాష్ట్ర మహాసభ ఐటీ అండ్ మెంబర్షిప్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ చక్క సూర్యప్రకాష్, బైలాస్ కమిటీ చైర్మన్ చెక్క చెన్నకేశవరావు రాష్ట్ర కార్యదర్శి పేరూరు గాంధీ, కడప జిల్లా సంఘ గౌరవాధ్యక్షులు పి.వి.ఎన్. ప్రసాద్, కుప్పం వెంకట సుబ్బారావు, స్టేట్ సెక్రటరీ కొండపల్లి చిన్న సుబ్బారావు స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకటసుబ్బయ్య మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు చిప్పగిరి వెంకట ప్రసాద్, టంగుటూరి మారుతి ప్రసాద్ మీడియా కమిటీ స్టేట్ వైస్ చైర్మన్ గోగుల శ్రీనివాసరావు, ఓబల శెట్టి రాధాకృష్ణ కొణతాలపల్లి నరసింహులు, రామసుబ్బయ్య సొల్లేటి వెంకటరమణ మున్సిపల్ మాజీ వైఫ్ చైర్మన్ అడుగుతా సాయి కృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కనుమరుల పుటీ ప్రసాద్, పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిటీలోని దాదాపు 700 మందికి పైగా పలువురికి శాలువాలు కప్పి ప్రమాణ స్వీకార పత్రాలు అందజేసి పెద్దల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేపించడం జరిగింది అనంతరం ఏర్పాటుచేసిన ప్రత్యేక విందులో పలువురు పాల్గొన్నారు.1
- కూటమి ప్రభుత్వంపై కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ఆరోపణలు పులివెందులలో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం పులివెందులలో నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు, పేదలకు అందాల్సిన సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.1