203 పోలీసు ట్రైనీ APSP కానిస్టేబుల్స్ కు CPR , ప్రథమచికిత్స(Fist Aid) పై కర్నూలు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం లో అవగాహన కార్యక్రమం కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ & ప్రిన్సిపాల్, DPTC, కర్నూలు శ్రీ హుస్సేన్ పీరా గారు. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో సిపిఆర్, ప్రథమ చికిత్స పై పోలీసు ట్రైనీ కానిస్టేబుల్స్ కు అవగాహన కార్యక్రమాన్ని కర్నూలు దిన్నేదేవరపాడు దగ్గర గల జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా గారు శనివారం ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ఆదుకోవటములో ముందుండే పోలీసు సిబ్బందికి CPR విధానం, గాయాల సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, ప్రథమచికిత్స పై అవగాహన కల్పించారు. ప్రధమ చికిత్స లో భాగంగా చేయాలి, ఏమి చేయకూడదో తెలియజేశారు. ఈ సంధర్బంగా మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీ సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ... గుండెపోటు వచ్చినప్పుడు, స్పృహ తప్పి కోల్పోయినప్పుడు , హాస్పిటల్ కు తీసుకువెళ్ళే 1 గంట లోపు చేసే సీపీఆర్ విధానంపై ట్రైనీ పోలీసు లకు శిక్షణ , అవగాహన కల్పించడంతో పాటు ట్రైనీ పోలీసులచే ప్రాక్టీస్ చేయిస్తున్నామన్నారు. ప్రతి ఇంట్లో సిపిఆర్ పై అవగాహన ఉండడం ముఖ్యమన్నారు. ఏ సమయంలో నైనా ఉపయోగపడవచ్చన్నారు. ప్రతి కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. పోలీసులకు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) మరియు ప్రథమ చికిత్స పై అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఎందుకంటే వారు అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సహాయం చేయడంలో మొదటి ప్రతిస్పందన దారులుగా ఉంటారన్నారు. సీపీఆర్ మరియు ప్రథమ చికిత్స నైపుణ్యాలు కలిగి ఉండటం వలన, ప్రమాదాలు జరిగినప్పుడు లేదా గుండెపోటు వచ్చినప్పుడు వ్యక్తుల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ / డి టి సి ప్రిన్సిపాల్ శ్రీ హుస్సేన్ పీరా గారితో పాటు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ యాదవ్, పోలీసు వేల్పేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి గారు, కర్నూలు డిటిసి డిఎస్పీ / వైస్ ప్రిన్సిపాల్ దుర్గ ప్రసాద్, సిఐలు , ఆర్ఐలు , ఎస్సెలు, ఆర్ ఎస్సైలు ఇతర సిబ్బంది, మెడికవర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
203 పోలీసు ట్రైనీ APSP కానిస్టేబుల్స్ కు CPR , ప్రథమచికిత్స(Fist Aid) పై కర్నూలు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం లో అవగాహన కార్యక్రమం కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ & ప్రిన్సిపాల్, DPTC, కర్నూలు శ్రీ హుస్సేన్ పీరా గారు. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో సిపిఆర్, ప్రథమ చికిత్స పై పోలీసు ట్రైనీ కానిస్టేబుల్స్ కు అవగాహన కార్యక్రమాన్ని కర్నూలు దిన్నేదేవరపాడు దగ్గర గల జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా గారు శనివారం
ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ఆదుకోవటములో ముందుండే పోలీసు సిబ్బందికి CPR విధానం, గాయాల సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, ప్రథమచికిత్స పై అవగాహన కల్పించారు. ప్రధమ చికిత్స లో భాగంగా చేయాలి, ఏమి చేయకూడదో తెలియజేశారు. ఈ సంధర్బంగా మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీ సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ... గుండెపోటు వచ్చినప్పుడు, స్పృహ తప్పి కోల్పోయినప్పుడు , హాస్పిటల్ కు తీసుకువెళ్ళే 1 గంట లోపు చేసే సీపీఆర్ విధానంపై ట్రైనీ పోలీసు లకు శిక్షణ , అవగాహన కల్పించడంతో పాటు ట్రైనీ పోలీసులచే ప్రాక్టీస్ చేయిస్తున్నామన్నారు. ప్రతి ఇంట్లో సిపిఆర్ పై అవగాహన ఉండడం ముఖ్యమన్నారు. ఏ సమయంలో నైనా ఉపయోగపడవచ్చన్నారు. ప్రతి కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. పోలీసులకు సీపీఆర్ (కార్డియో పల్మనరీ
రిససిటేషన్) మరియు ప్రథమ చికిత్స పై అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఎందుకంటే వారు అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సహాయం చేయడంలో మొదటి ప్రతిస్పందన దారులుగా ఉంటారన్నారు. సీపీఆర్ మరియు ప్రథమ చికిత్స నైపుణ్యాలు కలిగి ఉండటం వలన, ప్రమాదాలు జరిగినప్పుడు లేదా గుండెపోటు వచ్చినప్పుడు వ్యక్తుల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ / డి టి సి ప్రిన్సిపాల్ శ్రీ హుస్సేన్ పీరా గారితో పాటు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ యాదవ్, పోలీసు వేల్పేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి గారు, కర్నూలు డిటిసి డిఎస్పీ / వైస్ ప్రిన్సిపాల్ దుర్గ ప్రసాద్, సిఐలు , ఆర్ఐలు , ఎస్సెలు, ఆర్ ఎస్సైలు ఇతర సిబ్బంది, మెడికవర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది1
- బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ1
- ఉపాధి హామీ కూలీల హాజరు నమోదులో మల్దకల్ గ్రామ పంచాయతీ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొత్తగా వచ్చిన ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, 620 మంది కూలీల డేటాను నమోదు చేయడం ద్వారా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 9 మంది వర్కింగ్ మెట్ల కృషితో తెల్లవారుజామునే లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం. కార్యదర్శి చొరవను జిల్లా అధికారులు అభినందించారు. సాంకేతిక వినియోగంలో మల్దకల్ ఆదర్శనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ పంచాయతీ ప్రత్యేక గుర్తింపు పొందింది.1
- పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..1
- ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో బుధవారం పరిగి మండల పరిధిలోని కాలాపూర్ రాపోలు గ్రామ రైతులు తమ భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం లాక్కుంటుందని ధర్నాకు దిగడంతో దీనికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొనగా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చేసేదిలేక కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి దారుర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతులకు మద్దతు తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే భూసేకరణ ఆపాలని హెచ్చరించారు1
- ధరూర్: మండలంలోని జంపల్లి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కెనాల్ సమీపాన అంతర్ రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే 4 ఫీట్ల వరకు రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుంది అన్నారు. అక్కడ గుంతలు ఏర్పడిన కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.1