యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వీక్లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భారీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో శాంతినగర్ నుండి గాంధీ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద విద్యార్థులు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై నాటికలు ప్రదర్శించారు. అలాగే పోస్టర్ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొని, హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి యాంటీ-డ్రగ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. డ్రగ్స్కు దూరంగా ఉంటూ విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఇన్స్పెక్టర్ కోరారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన శిక్షలను వివరించారు. చెడు స్నేహితుల ప్రభావం, సామాజిక ఒత్తిళ్లు యువతను డ్రగ్స్ వైపు మళ్లించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, వాటికి దూరంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం విద్య, భవిష్యత్ కెరీర్, కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్లైన్ 8712671111కు లేదా సమీప పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వీక్లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భారీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో శాంతినగర్ నుండి గాంధీ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద విద్యార్థులు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై నాటికలు ప్రదర్శించారు. అలాగే పోస్టర్ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొని, హ్యూమన్ చైన్
ఏర్పాటు చేసి యాంటీ-డ్రగ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. డ్రగ్స్కు దూరంగా ఉంటూ విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఇన్స్పెక్టర్ కోరారు. మత్తు
పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన శిక్షలను వివరించారు. చెడు స్నేహితుల ప్రభావం, సామాజిక ఒత్తిళ్లు యువతను డ్రగ్స్ వైపు మళ్లించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, వాటికి దూరంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాదక ద్రవ్యాల
వినియోగం విద్య, భవిష్యత్ కెరీర్, కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్లైన్ 8712671111కు లేదా సమీప పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
- అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా, తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 'యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్' కార్యక్రమాలు కరీంనగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నాల్గవ రోజున కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, ఎక్సైజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుండి ప్రారంభమైన ఈ 2 కిలోమీటర్ల ర్యాలీ గీతాభవన్ చౌరస్తా మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, నర్సింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గీతాభవన్ చౌరస్తాలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన వీధి నాటకం (నాటిక) మరియు అవగాహన గీతాలు ప్రజలను, తోటి విద్యార్థులను ఎంతగానో ఆలోచింపజేశాయి. ర్యాలీ అనంతరం, కమిషనరేట్ కేంద్రంలోని ‘అస్త్ర కన్వెన్షన్ హాలు’లో పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం అధ్యక్షతన విద్యార్థులతో భారీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ విడుదల చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థులకు ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించారు. చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్, డ్రగ్స్ మహమ్మారి వల్ల యువత జీవితాలు ఎలా అంధకారంలోకి వెళ్తాయి, కుటుంబాలు ఎలా నాశనమవుతాయనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. నర్సింగ్ విద్యార్థినులు తమ నృత్య ప్రదర్శన ద్వారా డ్రగ్స్ రహిత సమాజంపై చక్కని సందేశాన్ని అందించారు. సదస్సులో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలకు లోనుకాకూడదని హితవు పలికారు, చదువుల వల్ల కలిగే ఒత్తిడిని అధిగమించేందుకు డ్రగ్స్ వైపు కాకుండా, క్రీడలు మరియు శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని సూచించారు. కరీంనగర్ జిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల విద్యాసంస్థల పరిసరాల్లోని 100 మీటర్ల లోపు ఉన్న 99 పాన్ షాపులపై దాడులు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 52 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కమీషనరేట్ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ‘కాన్షియస్ క్లబ్స్’ ఏర్పాటు చేశామని, “SAY NO TO DRUGS - SAY YES TO LIFE” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ లేదా గంజాయి సేవించడం, విక్రయించడం ‘ఎన్.డి.పి.ఎస్ (NDPS) యాక్ట్ - సెక్షన్ 27’ ప్రకారం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, దీనివల్ల భవిష్యత్తు సర్వనాశనమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు ఎంతో కృషి చేస్తున్నాయని, యువతలో 'స్వీయ నియంత్రణ' ఉన్నప్పుడే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి, తమ జీవిత లక్ష్యాలను చేరుకోగలరని ఆకాంక్షించారు. యాంటీ డ్రగ్స్ వీక్లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు సీపీ గౌష్ ఆలం చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం అధికారులు, విద్యార్థులందరూ కలిసి డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘సంతకాల సేకరణ బోర్డు’పై సీపీతో పాటు ఇతర అతిథులు, అధికారులు సంతకాలు చేసి, కరీంనగర్ను డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుతామని సంకల్పించారు. ఈ సదస్సులో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి (DWO) సరస్వతి, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (DCPO) పర్వీన్, ఏసీపీలు వేణుగోపాల్, విజయకుమార్, యాదగిరిస్వామి, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, ఇతర పోలీస్, ఎక్సైజ్ అధికారులు, వివిధ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.4
- అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం, కామారెడ్డి జిల్లాలో మాదక ద్రవ్యాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిపాలన, పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అధికారులు, పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొని మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, యువత దేశ భవిష్యత్తుకు మూలస్తంభమని, మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆయన కోరారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగుతోందని చెప్పారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసు శాఖకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాజ సహకారంతోనే కామారెడ్డిని మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముగింపులో మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి నిర్మూలనకు కృషి చేయాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, జిల్లా సంక్షేమ అధికారి కుమారి ఐ. ప్రసన్న, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, పోలీసు అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.1
- ధర్మపురి పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన బీజేపీ కార్యకర్త ఆసం సురేష్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు దామేర రామ సుధాకర్ రావు పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వారి నివాసానికి చేరుకున్న ఆయన, బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించడంతో పాటు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా, కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండటమే బీజేపీ లక్ష్యమని దామేర రామ సుధాకర్ రావు పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, భవిష్యత్తులో అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.1
- యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వీక్లో భాగంగా, జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల పట్టణంలో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నార్కోటిక్ జాగిలాన్ని ఉపయోగించి కిరాణా దుకాణాలు, పాన్ షాప్లు, బస్టాండ్ మరియు విద్యాసంస్థల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో గంజాయి సరఫరా మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా, పాన్ షాప్లు, కిరాణా దుకాణాలు, బస్టాండ్ల వంటి రద్దీ ప్రాంతాల్లో నార్కోటిక్ జాగిలాల సహాయంతో తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, వాటి దుష్పరిణామాలపై ప్రజలు, విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వీక్లో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్లైన్ నంబర్ 8712671111 కు లేదా సమీప పోలీస్ అధికారులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.3
- కరీంనగర్లోని రాంనగర్ ప్రాంతంలో కొనసాగుతున్న 'సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే' (SIR) కార్యక్రమాన్ని శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సర్వే సిబ్బందితో కలిసి పలు ఇళ్లను సందర్శించి, ఓటు మరియు ఓటర్ గుర్తింపు కార్డుల వివరాల నమోదు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు, అలాగే ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు ఈ సర్వే ఎంతో కీలకమని చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి తప్పులు లేకుండా, అత్యంత పారదర్శకంగా వివరాలను సేకరించాలని ఆయన సర్వే సిబ్బందికి సూచించారు.3
- కరీంనగర్లో తాగునీటి కొరతను తక్షణమే నివారించాలని, కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలని డిమాండ్ చేస్తూ సీపీఐ కార్యకర్తలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సీపీఐ కార్యకర్తలు మున్సిపల్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఒక దశలో ధర్నా ఉధృతం కావడంతో, అధికారులతో చర్చల కోసం నాయకులు, కార్యకర్తలు కార్పొరేషన్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను గట్టిగా ప్రతిఘటించారు. అనంతరం, పోలీసులు నిరసనకారులను, సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్తో సహా పలువురు ముఖ్య నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. మంచినీటి ఎద్దడిని నిరసిస్తూ సీపీఐ నాయకులు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.4
- కరీంనగర్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనడం, మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లోని చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. తాగునీటి కష్టాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఖాళీ బిందెలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ క్రమంలో వారు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, నాయకులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు సీపీఐ నాయకులను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ వివరాలను సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి వెల్లడించారు. ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, కరీంనగర్ ప్రజలకు అందుబాటులో లోయర్ మానేరు డ్యామ్ (ఎల్.ఎం.డి.) ఉన్నప్పటికీ, ఆ నీటిని పక్క జిల్లాలకు తరలించడం వల్ల స్థానికులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎండాకాలంలో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు ఎండిపోవడంతో ప్రజలు నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారని, నగరంలో ఎటు చూసినా, ఏ డివిజన్కు వెళ్లినా ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు సరైన మార్గదర్శకాలు లేకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే (బీఆర్ఎస్ పార్టీ), ఎంపీ (బీజేపీ పార్టీ), కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రతినిధి లేకపోవడంతో నాయకుల మధ్య సమన్వయం లోపించిందని, సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం వల్లే కరీంనగర్ ప్రజల దాహార్తి తీర్చే నాధుడే కరువయ్యాడని శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఇటీవలి కాలంలో మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లోని చెరువులు, కుంటలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలకు గురవుతున్నాయని, ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరుగుతున్నాయని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని ఆయన ఎత్తిచూపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు నగర ప్రజల తాగునీటి కష్టాలను తీర్చి, భూముల కబ్జాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన మరిన్ని ఉద్ధృత పోరాటాలు నిర్వహిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, మచ్చ రమేష్, శాఖ కార్యదర్శులు బాకం ఆంజనేయులు, గామినేని సత్యం చెంచల మురళి, నగునూరి రమేష్, కాల్వ శ్రీనివాస్, ఈ.భారతి, కేంసారం శ్రీనివాస్, అల్లేపు రాజు, నునావత్ శ్రీనివాస్, మామిడిపల్లి హేమంత్ కుమార్, మమత, స్రవంతి, దానవేణి రమేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.2