అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా, తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 'యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్' కార్యక్రమాలు కరీంనగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నాల్గవ రోజున కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, ఎక్సైజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుండి ప్రారంభమైన ఈ 2 కిలోమీటర్ల ర్యాలీ గీతాభవన్ చౌరస్తా మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, నర్సింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గీతాభవన్ చౌరస్తాలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన వీధి నాటకం (నాటిక) మరియు అవగాహన గీతాలు ప్రజలను, తోటి విద్యార్థులను ఎంతగానో ఆలోచింపజేశాయి. ర్యాలీ అనంతరం, కమిషనరేట్ కేంద్రంలోని ‘అస్త్ర కన్వెన్షన్ హాలు’లో పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం అధ్యక్షతన విద్యార్థులతో భారీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ విడుదల చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థులకు ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించారు. చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్, డ్రగ్స్ మహమ్మారి వల్ల యువత జీవితాలు ఎలా అంధకారంలోకి వెళ్తాయి, కుటుంబాలు ఎలా నాశనమవుతాయనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. నర్సింగ్ విద్యార్థినులు తమ నృత్య ప్రదర్శన ద్వారా డ్రగ్స్ రహిత సమాజంపై చక్కని సందేశాన్ని అందించారు. సదస్సులో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలకు లోనుకాకూడదని హితవు పలికారు, చదువుల వల్ల కలిగే ఒత్తిడిని అధిగమించేందుకు డ్రగ్స్ వైపు కాకుండా, క్రీడలు మరియు శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని సూచించారు. కరీంనగర్ జిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల విద్యాసంస్థల పరిసరాల్లోని 100 మీటర్ల లోపు ఉన్న 99 పాన్ షాపులపై దాడులు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 52 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కమీషనరేట్ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ‘కాన్షియస్ క్లబ్స్’ ఏర్పాటు చేశామని, “SAY NO TO DRUGS - SAY YES TO LIFE” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ లేదా గంజాయి సేవించడం, విక్రయించడం ‘ఎన్.డి.పి.ఎస్ (NDPS) యాక్ట్ - సెక్షన్ 27’ ప్రకారం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, దీనివల్ల భవిష్యత్తు సర్వనాశనమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు ఎంతో కృషి చేస్తున్నాయని, యువతలో 'స్వీయ నియంత్రణ' ఉన్నప్పుడే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి, తమ జీవిత లక్ష్యాలను చేరుకోగలరని ఆకాంక్షించారు. యాంటీ డ్రగ్స్ వీక్లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు సీపీ గౌష్ ఆలం చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం అధికారులు, విద్యార్థులందరూ కలిసి డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘సంతకాల సేకరణ బోర్డు’పై సీపీతో పాటు ఇతర అతిథులు, అధికారులు సంతకాలు చేసి, కరీంనగర్ను డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుతామని సంకల్పించారు. ఈ సదస్సులో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి (DWO) సరస్వతి, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (DCPO) పర్వీన్, ఏసీపీలు వేణుగోపాల్, విజయకుమార్, యాదగిరిస్వామి, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, ఇతర పోలీస్, ఎక్సైజ్ అధికారులు, వివిధ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా, తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 'యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్' కార్యక్రమాలు కరీంనగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నాల్గవ రోజున కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, ఎక్సైజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుండి ప్రారంభమైన ఈ 2 కిలోమీటర్ల ర్యాలీ గీతాభవన్ చౌరస్తా మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, నర్సింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గీతాభవన్ చౌరస్తాలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన వీధి నాటకం (నాటిక) మరియు అవగాహన గీతాలు ప్రజలను, తోటి విద్యార్థులను ఎంతగానో ఆలోచింపజేశాయి. ర్యాలీ అనంతరం, కమిషనరేట్ కేంద్రంలోని ‘అస్త్ర కన్వెన్షన్ హాలు’లో
పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం అధ్యక్షతన విద్యార్థులతో భారీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ విడుదల చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థులకు ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించారు. చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్, డ్రగ్స్ మహమ్మారి వల్ల యువత జీవితాలు ఎలా అంధకారంలోకి వెళ్తాయి, కుటుంబాలు ఎలా నాశనమవుతాయనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. నర్సింగ్ విద్యార్థినులు తమ నృత్య ప్రదర్శన ద్వారా డ్రగ్స్ రహిత సమాజంపై చక్కని సందేశాన్ని అందించారు. సదస్సులో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలకు లోనుకాకూడదని హితవు పలికారు, చదువుల వల్ల కలిగే ఒత్తిడిని అధిగమించేందుకు డ్రగ్స్ వైపు కాకుండా, క్రీడలు మరియు శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని సూచించారు. కరీంనగర్ జిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా
పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల విద్యాసంస్థల పరిసరాల్లోని 100 మీటర్ల లోపు ఉన్న 99 పాన్ షాపులపై దాడులు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 52 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కమీషనరేట్ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ‘కాన్షియస్ క్లబ్స్’ ఏర్పాటు చేశామని, “SAY NO TO DRUGS - SAY YES TO LIFE” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ లేదా గంజాయి సేవించడం, విక్రయించడం ‘ఎన్.డి.పి.ఎస్ (NDPS) యాక్ట్ - సెక్షన్ 27’ ప్రకారం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, దీనివల్ల భవిష్యత్తు సర్వనాశనమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు ఎంతో కృషి చేస్తున్నాయని, యువతలో 'స్వీయ నియంత్రణ' ఉన్నప్పుడే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి, తమ
జీవిత లక్ష్యాలను చేరుకోగలరని ఆకాంక్షించారు. యాంటీ డ్రగ్స్ వీక్లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు సీపీ గౌష్ ఆలం చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం అధికారులు, విద్యార్థులందరూ కలిసి డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘సంతకాల సేకరణ బోర్డు’పై సీపీతో పాటు ఇతర అతిథులు, అధికారులు సంతకాలు చేసి, కరీంనగర్ను డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుతామని సంకల్పించారు. ఈ సదస్సులో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి (DWO) సరస్వతి, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (DCPO) పర్వీన్, ఏసీపీలు వేణుగోపాల్, విజయకుమార్, యాదగిరిస్వామి, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, ఇతర పోలీస్, ఎక్సైజ్ అధికారులు, వివిధ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- నగరంలోని 47వ డివిజన్లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తూ, ఏ ఒక్క అసలైన ఓటరుకూ అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. మ్యాపింగ్ కాని ఓటర్లు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను బీఎల్ఏలు దగ్గరుండి చూసుకోవాలని ఆయన సూచించారు. మ్యాపింగ్ అయిన ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలను స్వయంగా నింపించి, బీఎల్ఓల ద్వారా అప్లోడ్ చేయించాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారమ్లు నింపి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ లిస్ట్లో ఓటు నమోదు కాదని, కాబట్టి ప్రతి ఎన్యూమరేషన్ ఫారమ్ తప్పకుండా నింపించి ఇవ్వాలని బీఎల్ఏలకు స్పష్టమైన సూచనలు చేశారు. అలాగే, బీఎల్ఓలతో కలిసి బీఎల్ఏలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా ఎన్యూమరేషన్ పత్రాలు తప్పకుండా నింపించి ఇచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, బీఎల్ఓ సునీత, బీఎల్ఓ సూపర్ వైజర్ జమున, శ్రీనివాస్ గౌడ్, కేశవ రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగించబడదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఓటరు జాబితా ప్రక్షాళన చేయడమేనని శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలో 316 పోలింగ్ కేంద్రాలకు 316 మంది బీఎల్వోలు, 32 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. నియోజకవర్గంలో మొత్తం 2,26,250 మంది ఓటర్లు ఉండగా, వారిలో రెండు లక్షల మందికి పైగా ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. సుమారు 24 వేల మంది ఓటర్ల మ్యాపింగ్ ఇంకా జరగాల్సి ఉండగా, 47 వేల మంది ఓటర్ల మ్యాపింగ్లో సవరణలు అవసరమని గుర్తించారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మ్యాపింగ్ డేటా ఆధారంగా బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించి, ఓటర్లకు ముద్రిత ప్రతులను అందజేస్తారని తెలిపారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని బీఎల్వోలకు సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.2
- కోరిన కోర్కెలు తీర్చే వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమన్న గుడిలో కోడెనాగు ప్రత్యక్షమై భక్తులు, ఆలయ సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో భయపడిన ఆలయ అధికారులు వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. దాదాపు రెండు గంటల పాటు కష్టపడి స్నేక్ క్యాచర్ జగదీష్ ఆ కోడెనాగును పట్టుకున్నారు. పట్టుకున్న అనంతరం జగదీష్ ఆ కోడెనాగును అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.1
- బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు, సంకల్పాలు నిర్వహించిన అనంతరం భక్తులు ఈ ప్రదక్షిణను ప్రారంభించారు. బెజ్జంకి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృప కోసం ప్రార్థనలు చేశారు. “ఓం లక్ష్మీనరసింహాయ నమః” నామస్మరణతో పాటు భజనలు, కీర్తనలు చేస్తూ భక్తులు గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేశారు. కొండ లేదా దేవాలయాన్ని దైవ స్వరూపంగా భావించి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణ చేయడం అనే పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా, భక్తులు ఆలయ ముఖద్వారం వద్ద ప్రార్థనలు చేసి, కొండను కుడివైపున ఉంచుకుంటూ సవ్యదిశలో నడిచి ప్రదక్షిణ పూర్తి చేశారు. చాలామంది భక్తులు పాదరక్షలు లేకుండా నడుస్తూ దైవనామ స్మరణలో పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలు, భజనలతో ఆలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటం ఆనందదాయకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా, భక్తి భావంతో విజయవంతంగా ముగిసింది.4
- మండలం లోని పలు గ్రామాలలో గురువారం రాత్రి మొహరం వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యంగా నర్సింగాపూర్ గ్రామంలో ఈ వేడుకలను ప్రతి ఏటా కులమతాలకు అతీతంగా, అపారమైన భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా, మట్టితో తయారు చేసిన కొత్త కుండలో బెల్లం పానకంతో చేసిన షర్బత్, మటికీలు, మలీన ముద్దలు వంటి వాటిని సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం డప్పు చప్పుళ్లతో భక్తులు ఊరేగింపుగా గ్రామంలోని పీర్ల చావడి వద్ద ఉన్న పీర్ల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండం చుట్టూ తిరిగి, పీర్ల వద్ద మటికీలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ పీర్లకు దట్టీలను కట్టారు. పీర్లను పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ కమిటీ సభ్యులతో పాటు, కులమతాలకు అతీతంగా గ్రామస్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు, ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఒక ముఖ్యమైన సంప్రదాయం.1
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పరిధిలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో గురువారం ఒక నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఆలయంలోకి వచ్చిన భక్తులు వెంటనే పామును గమనించి దేవస్థాన సిబ్బందికి సమాచారం అందించారు. ఇటీవల ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలుమార్లు పాములు సంచరిస్తుండటంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ జగదీష్ హుటాహుటిన అక్కడికి చేరుకుని నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పాముకు ఎటువంటి హాని కలగకుండా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టారు. ఆలయ పరిసరాల్లో పాముల సంచారాన్ని నివారించడానికి తగిన చర్యలు చేపట్టాలని భక్తులు దేవస్థాన అధికారులను కోరుతున్నారు.1
- అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా, తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 'యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్' కార్యక్రమాలు కరీంనగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నాల్గవ రోజున కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, ఎక్సైజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుండి ప్రారంభమైన ఈ 2 కిలోమీటర్ల ర్యాలీ గీతాభవన్ చౌరస్తా మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, నర్సింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గీతాభవన్ చౌరస్తాలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన వీధి నాటకం (నాటిక) మరియు అవగాహన గీతాలు ప్రజలను, తోటి విద్యార్థులను ఎంతగానో ఆలోచింపజేశాయి. ర్యాలీ అనంతరం, కమిషనరేట్ కేంద్రంలోని ‘అస్త్ర కన్వెన్షన్ హాలు’లో పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం అధ్యక్షతన విద్యార్థులతో భారీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ విడుదల చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థులకు ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించారు. చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్, డ్రగ్స్ మహమ్మారి వల్ల యువత జీవితాలు ఎలా అంధకారంలోకి వెళ్తాయి, కుటుంబాలు ఎలా నాశనమవుతాయనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. నర్సింగ్ విద్యార్థినులు తమ నృత్య ప్రదర్శన ద్వారా డ్రగ్స్ రహిత సమాజంపై చక్కని సందేశాన్ని అందించారు. సదస్సులో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలకు లోనుకాకూడదని హితవు పలికారు, చదువుల వల్ల కలిగే ఒత్తిడిని అధిగమించేందుకు డ్రగ్స్ వైపు కాకుండా, క్రీడలు మరియు శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని సూచించారు. కరీంనగర్ జిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల విద్యాసంస్థల పరిసరాల్లోని 100 మీటర్ల లోపు ఉన్న 99 పాన్ షాపులపై దాడులు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 52 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కమీషనరేట్ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ‘కాన్షియస్ క్లబ్స్’ ఏర్పాటు చేశామని, “SAY NO TO DRUGS - SAY YES TO LIFE” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ లేదా గంజాయి సేవించడం, విక్రయించడం ‘ఎన్.డి.పి.ఎస్ (NDPS) యాక్ట్ - సెక్షన్ 27’ ప్రకారం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, దీనివల్ల భవిష్యత్తు సర్వనాశనమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు ఎంతో కృషి చేస్తున్నాయని, యువతలో 'స్వీయ నియంత్రణ' ఉన్నప్పుడే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి, తమ జీవిత లక్ష్యాలను చేరుకోగలరని ఆకాంక్షించారు. యాంటీ డ్రగ్స్ వీక్లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు సీపీ గౌష్ ఆలం చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం అధికారులు, విద్యార్థులందరూ కలిసి డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘సంతకాల సేకరణ బోర్డు’పై సీపీతో పాటు ఇతర అతిథులు, అధికారులు సంతకాలు చేసి, కరీంనగర్ను డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుతామని సంకల్పించారు. ఈ సదస్సులో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి (DWO) సరస్వతి, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (DCPO) పర్వీన్, ఏసీపీలు వేణుగోపాల్, విజయకుమార్, యాదగిరిస్వామి, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, ఇతర పోలీస్, ఎక్సైజ్ అధికారులు, వివిధ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.4
- ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండల కేంద్రంలో జరిగిన మొహరం ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. సవారి బంగ్లా ప్రారంభోత్సవం సందర్భంగా టపాసుల నిప్పురవ్వలు ఎగిసిపడటంతో సవారిపై ఉన్న కాగితపు పూలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సవారిపై ఉన్న వస్త్రాలు స్వల్పంగా దగ్ధమయ్యాయి. అయితే, అక్కడి స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.1