Shuru
Apke Nagar Ki App…
యావపూర్లో తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు తూప్రాన్ మండలం యావపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కొత్త రాములు(50) మొదటి భార్య మృతిచెందడంతో ఆమె సోదరిని రెండో వివాహం చేసుకున్నాడు. వారికి కుమార్తె జన్మించింది. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో తల్లి అనంతగిరిపల్లిలోని తన తల్లిగారి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల కుమార్తె మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని మృతిచెందింది. కుమార్తె మృతిచెందిన విషయం తెలిసిన రాములు తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో తండ్రి, కుమార్తె మృతిచెందడంతో యావపూర్లో విషాదం నెలకొంది.
Sraya
యావపూర్లో తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు తూప్రాన్ మండలం యావపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కొత్త రాములు(50) మొదటి భార్య మృతిచెందడంతో ఆమె సోదరిని రెండో వివాహం చేసుకున్నాడు. వారికి కుమార్తె జన్మించింది. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో తల్లి అనంతగిరిపల్లిలోని తన తల్లిగారి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల కుమార్తె మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని మృతిచెందింది. కుమార్తె మృతిచెందిన విషయం తెలిసిన రాములు తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో తండ్రి, కుమార్తె మృతిచెందడంతో యావపూర్లో విషాదం నెలకొంది.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు” కామారెడ్డి: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త అందజేశారు. డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈu సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమవుతుందని, వారి జీవితాంతం రక్తం అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. తన రక్తదాన సేవలకు సహకరిస్తున్న రక్తదాతలు, శ్రేయోభిలాషులు, వాసవి సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు మీడియా ప్రతినిధులకు డాక్టర్ బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం” అనే మానవతా సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.1
- కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం. కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం.1
- ఎక్కడ తగ్గేది లే అంటున్న మహిళలు మద్యం మత్తులో హల్చల్ తో దాడి చేసిన ముగ్గురు అరెస్ట్ *_ఎక్కడ తగ్గేది లే అంటున్న మహిళలు: మద్యం మత్తులో హల్చల్.. బీరు బాటిళ్లతో దాడి చేసిన ముగ్గురి అరెస్ట్!_* రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్లో మద్యం మహమ్మారి వీధివీధికీ పాకింది. ప్రశాంతతకు మారుపేరైన రాజమండ్రి నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆలయం వద్ద సోమవారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేగింది. మద్యం మత్తులో ముగ్గురు మహిళలు రోడ్డుపై తీవ్రంగా ప్రవర్తించడమే కాకుండా, అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులపై బీరు బాటిళ్లతో దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. *సంఘటన వివరాలు:* సోమవారం అర్ధరాత్రి సమయంలో వన్ టౌన్ పరిధిలోని ఒక స్థానిక ఆలయం సమీపంలో ముగ్గురు మహిళలు మద్యం తాగి గొడవ సృష్టిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు వారి ప్రవర్తనను ప్రశ్నించగా, తీవ్ర ఆవేశానికి లోనైన మహిళలు యువకులతో వాగ్వాదానికి దిగారు. 'ఎక్కడా తగ్గేది లేదు' అన్నట్లుగా ప్రవర్తిస్తూ, తమ వద్ద ఉన్న బీరు బాటిళ్లతో వారిపై దాడికి దిగారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్: దాడికి గురైన యువకులు వెంటనే రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు1
- నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ... నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని అనిత గొళ్ళెం వేసి పక్కింటి కి వెళ్ళి వచ్చి చూసే వరకు ఇంట్లో బీరువా తాళం పగిలి, దుస్తులు చిందర వందరగా ఉండడం చూసి చోరీ జరిగిందని భావించి బీరువాలో ఉన్న 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీ.సీ. ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు1
- గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు 26 వేల రూపాయలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని , మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , హెల్త్ కార్డులు అందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ప్రతి నెల ఒకటో తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ చేయాలని , 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు CITU - తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ లు మాట్లాడుతూ గ్రామాలను పచ్చదనం , పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ఎండనక , వాననక , చలనక అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలో కూడా స్థానిక అధికారులు , పాలకవర్గాలు కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని బడ్జెట్ లేదని సాకుతో కొన్ని గ్రామాలలో నెలల తరబడి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని స్థానిక సమస్యలపై జిల్లా అధికారులను కలిసిన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులు , జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరూ నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి సిఐటియు జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్ , యూనియన్ జిల్లా కార్యదర్శి మల్యాల నర్సయ్య యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు లోకిని శ్రీనివాస్ , కంసాని రవీందర్ , నారపురం నర్సయ్య , మహేష్ , శేఖర్ , అనిల్ , కాంతయ్య , లక్ష్మి , పద్మ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు3
- ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.2
- చౌదర్పల్లి గ్రామంలో నిర్మించనున్న శ్రీ హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులకు శ్రీకారం నిజాంపేట మండలం చౌదర్పల్లి గ్రామంలో గ్రామస్థుల సహకారంతో నిర్మించనున్న శ్రీ హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ఆలయ నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తై గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని కోరుకున్నారు.1
- నిండు ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ మహబూబాద్ జిల్లాలో నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ దిలీప్ ఎపూర్ గ్రామంలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ దిలీప్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దిగారు. బావిలో లోతుగా ఉన్న యువతిని ఎంతో ధైర్యసాహసాలతో చేరుకుని, తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు. కానిస్టేబుల్ దిలీప్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, మానవత్వాన్ని గ్రామస్థులు అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చిన దిలీప్ను పలువురు ప్రశంసించారు. “పోలీసు అంటే కేవలం విధులు నిర్వర్తించడమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వం” అని గ్రామస్థులు కొనియాడారు....1
- ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. జామే మజీద్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. పెద్ద సంఖ్యలో యువత ర్యాలీలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి, ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. అనంతరం జామే మజీద్ నుంచి దర్గా వరకు ముస్లిం సోదరులు పాదయాత్ర నిర్వహించారు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన ఖీర్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు శాంతి, సోదరభావం, దయ, మానవత్వం, సేవాభావం వంటి విలువలను చాటుతూ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు, యూసుఫ్, ముస్తఫా, సత్తార్, సయ్యద్ సమద్, రఫిక్, మునీర్, సయ్యద్ సోహెల్, సయ్యద్ అక్రమ్, రైస్, మహమూద్, షాదాబ్, అంజద్, చాంద్, మత పెద్దలు పాల్గొన్నారు.2