Shuru
Apke Nagar Ki App…
ఇల్లందు సుభాష్ నగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల రోడ్డు భద్రత నియమాల మానవహారం ప్రతిజ్ఞ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కరెంట్ ఆఫీస్ సుభాష్ నగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఈరోజు కరెంట్ ఆఫీస్ సెంటర్లో రోడ్డు భద్రతా నియమాల గురించి మానవహారం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల మనతోపాటు ఇతరులకు కూడా క్షేమం ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
Omkar mekala
ఇల్లందు సుభాష్ నగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల రోడ్డు భద్రత నియమాల మానవహారం ప్రతిజ్ఞ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కరెంట్ ఆఫీస్ సుభాష్ నగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఈరోజు కరెంట్ ఆఫీస్ సెంటర్లో రోడ్డు భద్రతా నియమాల గురించి మానవహారం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల మనతోపాటు ఇతరులకు కూడా క్షేమం ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1
- వరంగల్: దేశాయిపేటకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భర్తను 12 రోజుల క్రితం తీసుకెళ్లినప్పటి నుంచి ఆచూకీ తెలియజేయలేదని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసింది. మామునూరు ఏసీపీ, ఎనుమాముల సీఐ, ఎస్సై తన ఆత్మహత్యాయత్నానికి కారణమని నోట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనను, తన బిడ్డను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే భర్తపై కేసు నమోదు చేయడం, తన కుటుంబంపై కేసులు పెట్టడం వెనుక మార్కెట్ వ్యాపారుల పాత్ర ఉందని బాధిత మహిళ ఆరోపించింది.1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4
- సీఎం రేవంత్ రెడ్డి పై మాజీమంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని, బ్యాండ్ వాగన్ గా కోనసాగలేనని బయటకు వచ్చానని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సూచనల మేరకే కాంగ్రెస్ అధిష్టానం నడుస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో తాను చేయడం ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు.పదవులు కావాలి అనుకుంటే నీ దగ్గర పడిగాపులు కాసేవాన్ని....కానీ పదవులు శాశ్వతం కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి సూచించారు. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చూశానని, రేవంత్ నువ్వు ఎమ్ చూసావో నాకు తెలియదన్నారు. కెసిఆర్ నా వయసును గౌరవిస్తాడని, నన్ను అన్న అని పిలుస్తాడని, కెసిఆర్ కు ప్రజలంటే గౌరవం, నీలాగా కాదని అన్నారు. కేసీఆర్ పై విధానపరమైన విమర్శ చేశానే తప్ప వ్యక్తిగతంగా తాను ఏనాడు ఎవ్వరిని విమర్శించలేదన్నారు. పార్టీ సూచన తో ప్రభుత్వం నడువాలి కానీ, తెలంగాణ లో ప్రభుత్వ సూచన తో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని విమర్శించారు. పిల్లిని లోపల వేసి కొడితే తిరుగపడుద్దని జీవన్ రెడ్డి అన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేసి బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి సీతక్కపై కావాలనే బురదజల్లుతున్నారని ఆరోపిస్తూ, తప్పుడు ప్రచారాలు ఆపకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.1