ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కూటమి నాయకులు గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మైలవరం నియోజకవర్గంలో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజలు చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.గుంటుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రాథమిక వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైన చోట వైద్య మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్స, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తదితర సేవలు ప్రజలకు చేరువ కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.నూతన ఆరోగ్య కేంద్ర భవనం అందుబాటులోకి రావడంతో గుంటుపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కూటమి నాయకులు గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మైలవరం నియోజకవర్గంలో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య
సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజలు చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.గుంటుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రాథమిక వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైన చోట వైద్య మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని
చెప్పారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్స, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తదితర సేవలు ప్రజలకు చేరువ కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.నూతన ఆరోగ్య కేంద్ర భవనం అందుబాటులోకి రావడంతో గుంటుపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
- అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3
- ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు1
- పాలేరు నీళ్లు నియోజకవర్గ రైతులకే చెందాలి: మాజీ ఎమ్మెల్యే పాలేరు చెరువు నీటిపై మొదటి హక్కు పాలేరు నియోజకవర్గ రైతులదేనని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు నీరు ఇవ్వకపోయినా నిలబడి పోరాడామన్నారు. నియోజకవర్గ రైతుల సాగునీటి హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.1
- మేడ్చల్లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1
- సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.2
- Writing హైదరాబాద్–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ DCMను ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.1
- *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1