నిశ్శబ్ద సేవకురాలు నర్సు మంజుల నైటింగేల్ చూపిన మార్గం ఎంచుకొని.... అనురాగ హస్తాలతో ప్రాణాలు కాపాడే యోధులు. నిశ్శబ్ద సేవకురాలు నర్సు మంజుల నైటింగేల్ చూపిన మార్గం ఎంచుకొని.... అనురాగ హస్తాలతో ప్రాణాలు కాపాడే యోధులు. వేతనం తక్కువైనా... అలసట ఎక్కువైనా.... కరోన లాంటి సమయంలో మృత్యువుకు భయపడకుండా సేవలందించి... నైటింగేల్ వారసులై నిలిచిన నిశ్శబ్ద వీరులు..! మరణాన్ని జయించిన ప్రతి శ్వాస వెనుక... ఒక నర్సు త్యాగం నిశ్శబ్దంగా నిలుస్తుంది..! తమ బాధలు హృదయంలో దాచుకుని చిరునవ్వు చిందిస్తూ రోగికి ఆశల ఔషధ గంధం ఇచ్చి ధైర్యం ఇస్తుంది..! సాటి ప్రాణాల కోసం అంకితమైన మీ జీవనం మరిచిపోలేదు మేము..! రాత్రింబవళ్లు అనక సేవలందిస్తూ... అలసిన కళ్లలోనూ ఆశ వెలిగిస్తూ... మానవత్వానికి నిజమైన నిర్వచనం ఐనా మిమ్ములను మరిచిపోలేదు మేము..! ప్రతి నర్సుకి వందనం, సేవకు శతకోటి నమనం అంతర్జాతీయ నర్సుల దినోత్సవ(మే 12) శుభాకాంక్షలందనం. రచన: పత్తిపాటి మంజుల మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం చరవాణి 9347042218.
నిశ్శబ్ద సేవకురాలు నర్సు మంజుల నైటింగేల్ చూపిన మార్గం ఎంచుకొని.... అనురాగ హస్తాలతో ప్రాణాలు కాపాడే యోధులు. నిశ్శబ్ద సేవకురాలు నర్సు మంజుల నైటింగేల్ చూపిన మార్గం ఎంచుకొని.... అనురాగ హస్తాలతో ప్రాణాలు కాపాడే యోధులు. వేతనం తక్కువైనా... అలసట ఎక్కువైనా.... కరోన లాంటి సమయంలో మృత్యువుకు భయపడకుండా సేవలందించి... నైటింగేల్ వారసులై నిలిచిన నిశ్శబ్ద వీరులు..! మరణాన్ని జయించిన ప్రతి శ్వాస వెనుక... ఒక నర్సు త్యాగం నిశ్శబ్దంగా నిలుస్తుంది..! తమ బాధలు హృదయంలో దాచుకుని చిరునవ్వు చిందిస్తూ రోగికి ఆశల ఔషధ గంధం ఇచ్చి ధైర్యం ఇస్తుంది..! సాటి ప్రాణాల కోసం అంకితమైన మీ జీవనం మరిచిపోలేదు మేము..! రాత్రింబవళ్లు అనక సేవలందిస్తూ... అలసిన కళ్లలోనూ ఆశ వెలిగిస్తూ... మానవత్వానికి నిజమైన నిర్వచనం ఐనా మిమ్ములను మరిచిపోలేదు మేము..! ప్రతి నర్సుకి వందనం, సేవకు శతకోటి నమనం అంతర్జాతీయ నర్సుల దినోత్సవ(మే 12) శుభాకాంక్షలందనం. రచన: పత్తిపాటి మంజుల మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం చరవాణి 9347042218.
- మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగకున్నా అధిక రీడింగ్ రావడంతో విధుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.1
- మహాశక్తి ఆలయం లోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు నా కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలవా బండి సంజయ్ అని సవాల్ విసిరారు కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు. కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. అదేవిధంగా బండి సాయి భగీరత్ ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బారసా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు..మీర్ షౌకత్ అలీ , నారదాసు వసంత రావు , బొంకూరి మోహన్ , అన్వేష్ , రవి నాయక్ , సైఫ్ , నయీం , సతీష్ , దినేష్ , రవి గౌడ్, గోడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్ , రుద్ర రాధ , అజంతా , హిమబిందు, శ్రీలత , రాజమణి , రేణుక , అరుణ పలువురు బారసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.3
- కొండగట్టు అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.1
- ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన కలిసే ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. "నువ్వు నన్ను కలవకుంటే, నువ్వు వెళ్లాలనుకున్న చోటుకు నేను నిన్ను తీసుకెళ్తాను" అని మోడీ చెప్పినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు సృష్టించాయి. ఈ సమావేశం జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.1
- కొమురం భీం ఆసిఫాబాద్ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం వారు పరేడ్ గ్రౌండ్కు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.2
- బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు… ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ… గత మూడు రోజులుగా ఘటనపై ఎలాంటి స్పందన లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. “రక్షకుడే భక్షకుడు అయ్యాడు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పోక్సో చట్టం ప్రకారం 24 గంటల్లోనే అరెస్ట్ చేయాల్సి ఉండగా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సాధారణ వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీకి చెందిన వారి విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు..బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని, బాలికకు పూర్తి రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గాని, కేంద్ర మంత్రులు గాని ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకులు ఈ ఘటనపై స్పందించి ఆ చిన్నారికి న్యాయం జరిగేలా ముందుకు రావాలని కోరారు..మహిళల భద్రతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు…1
- బండి సంజయ్ కుమారుడిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదు మంత్రి పొన్నం ప్రభాకర్* * బండి సంజయ్ కుమారుడిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదు కేంద్ర మంత్రి గా మీరే స్వయంగా మీ కుమారుడి పై వచ్చిన ఆరోపణలను విచారణ చేయాలని కోరాల్సింది మీ మీద కుట్ర చేస్తున్నారని , సానుభూతి పొందే ప్రయత్నం ఆపాలి అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా..? అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా వాటిని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి.. ముందు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి పొరపాటు జరిగినా మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నా ఎవరి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి వివక్ష లేదు.. తెలంగాణ బిడ్డలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగిస్తున్న.. ఇలాంటి చర్యల్లో బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది మున్నూరు కాపు సంఘ నాయకులు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.. ఆ అమ్మాయి కూడా మున్నూరు కాపు వార్తనికి చెందిన అమ్మాయి అని తెల్సింది.. ఇందులో ఎవరు ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడడం లేదు ముఖ్యమంత్రి డిజిపితో మాట్లాడి విచారణకు ఆదేశించారు మహిళా డీసీపీ అధికారి తో విచారణ జరుగుతుంది.. దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని స్వయంగా ముఖ్యమంత్రి డీజీపీ ను ఆదేశించారు.. రాజకీయ ఒత్తిడి జరిగి విచారణలో ఎలాంటి మార్పులు ఉండవు అటువంటి సంఘటనలు జరిగి ఉంటే దోషి మీద కఠిన చర్యలు తీసుకోవడం లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఈ అంశంలో బీసీ ల అంశం తెరమీదకు తేవడం సరికాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచారణకు అడ్డుకుంటే ప్రజాస్వామ్యం గౌరవించదు ఇలాంటి సంఘటనలు జరిగినపుడు మన వ్యక్తిత్వానికి ఇబ్బంది అయినప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మనమే విచారణకు ఆదేశించాలి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిగి దోషులు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నా.1