ముత్యాల తలంబ్రాల పంపిణి ప్రారంభించిన రామకోటి రామరాజు ● సిరి ఎన్ క్లేవ్ భక్తులకు తలంబ్రాలు అందజేత ● ముత్యాల తలంబ్రాలు అందుకోవడం అదృష్టమన్న భక్తులు ● రామకోటి రామరాజును సన్మానించిన సిరి ఎన్ క్లేవ్ భక్తులు గజ్వేల్ నియోజకవర్గం, ఏప్రిల్ 21 (ప్రజా ప్రతిభ): భద్రాచల సీతారాముల కల్యానానికి గోటి తలంబ్రాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని సిరి ఎంక్లేవ్ కాలని భక్తులకు అందించారు. తిరికి వారికి భద్రాచల కల్యాణ ముత్యాల తలంబ్రాలు విశిష్టత. వాటి పవిత్రత తెలియజేసి మంగళవారం నాడు అందజేశారు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భద్రాచల రామయ్య కల్యానానికి తెలంగాణ రాష్ట్రం నుండి 300కిలోల గోటి తలంబ్రాలు ఓలిపించి అందించామన్నారు. అలాగే 100కిలోల ముత్యాల తలంబ్రాలు భక్తుల కోసం భద్రాచలం నుండి తీసుకొచ్చానన్నారు. ఈ కోటి తలంబ్రాల దీక్షలో గ్రామ, గ్రామాన పాల్గొన్న లక్షల మందికి అందిస్తామన్నారు. సిరి ఎంక్లేవ్ భక్తులు పెద్ద ఎత్తుల గోటి తలంబ్రాలు భద్రాచలం అందించారని తిరిగి వారందరికీ ముత్యాల తలంబ్రాలు అందిస్తామని తెలిపారు. భక్తులు మాట్లాడుతూ భద్రాచలం మేము వెళ్ళలేకున్న మా గోటి తలంబ్రాలు వెళ్లాయి, మళ్ళీ తిరికి రామకోటి రామరాజు ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చి ఇచ్చారని హర్షం వ్యక్త పరిచారు. రామకోటి రామరాజు రామభక్తికి గాను సిరి ఎంక్లేవ్ మహిళ భక్తులు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం మాకు ఇలాంటి అవకాన్ని ఇవ్వాలని రామకోటి రామరాజును కోరారు.
ముత్యాల తలంబ్రాల పంపిణి ప్రారంభించిన రామకోటి రామరాజు ● సిరి ఎన్ క్లేవ్ భక్తులకు తలంబ్రాలు అందజేత ● ముత్యాల తలంబ్రాలు అందుకోవడం అదృష్టమన్న భక్తులు ● రామకోటి రామరాజును సన్మానించిన సిరి ఎన్ క్లేవ్ భక్తులు గజ్వేల్ నియోజకవర్గం, ఏప్రిల్ 21 (ప్రజా ప్రతిభ): భద్రాచల సీతారాముల కల్యానానికి గోటి తలంబ్రాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని సిరి ఎంక్లేవ్ కాలని భక్తులకు అందించారు. తిరికి వారికి భద్రాచల కల్యాణ ముత్యాల తలంబ్రాలు విశిష్టత. వాటి పవిత్రత తెలియజేసి మంగళవారం నాడు అందజేశారు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భద్రాచల రామయ్య కల్యానానికి తెలంగాణ రాష్ట్రం నుండి 300కిలోల
గోటి తలంబ్రాలు ఓలిపించి అందించామన్నారు. అలాగే 100కిలోల ముత్యాల తలంబ్రాలు భక్తుల కోసం భద్రాచలం నుండి తీసుకొచ్చానన్నారు. ఈ కోటి తలంబ్రాల దీక్షలో గ్రామ, గ్రామాన పాల్గొన్న లక్షల మందికి అందిస్తామన్నారు. సిరి ఎంక్లేవ్ భక్తులు పెద్ద ఎత్తుల గోటి తలంబ్రాలు భద్రాచలం అందించారని తిరిగి వారందరికీ ముత్యాల తలంబ్రాలు అందిస్తామని తెలిపారు. భక్తులు మాట్లాడుతూ భద్రాచలం మేము వెళ్ళలేకున్న మా గోటి తలంబ్రాలు వెళ్లాయి, మళ్ళీ తిరికి రామకోటి రామరాజు ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చి ఇచ్చారని హర్షం వ్యక్త పరిచారు. రామకోటి రామరాజు రామభక్తికి గాను సిరి ఎంక్లేవ్ మహిళ భక్తులు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం మాకు ఇలాంటి అవకాన్ని ఇవ్వాలని రామకోటి రామరాజును కోరారు.
- जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇 id:cryancreations51911
- మెడికల్ డివైసెస్ ఉత్పాదనకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో తనను కలిసిన నెదర్లాండ్స్ మెడిటెక్ పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీల పరిశోధకులతో ఆయన మాట్లాడారు. వెద్య సంబంధ పరిశోధనలు, కృత్రిమ మేథ అభివృద్ధి, పరికరాల ఉత్పత్తికి తెలంగాణా అత్యంత అనుకూలమని ఆయన వివరించారు. ఔషధాల ఉత్పత్తి, నూతన ఆవిష్కరణలు, వ్యాక్సిన్ల తయారీలో తమ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో ఇక్కడి బయోటెక్ కంపెనీలు 120 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఆధునిక వైద్య పరికరాల ఉత్పత్తిలో తెలంగాణాను కేంద్ర స్థానం (హబ్)గా తీర్చిదిద్దేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోందని తెలిపారు. విద్యుత్తు, నీరు, భూమి సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్య రంగంలో కృత్రిమ మేథ వినియోగించే విషయంలో చక్కని అవకాశాలున్నాయని చెప్పారు. ఇమేజింగ్ టెక్నాలజీ, క్లినికల్ వ్యాలిడేషన్, డిజిటల్ ప్రొఫైల్స్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని శ్రీధర్ బాబు వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొరత లేదని, ప్రపంచంలోని అతి పెద్ద ఔషద, బయోటెక్ కంపెనీలు రాష్ట్రాన్ని తమ ఉత్పాదన కేంద్రంగా మార్చుకోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. ఇక్కడి యూనివర్సిటీలతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నెదర్లాండ్స్ ఇన్నోవేషన్స్ కౌన్సిలర్ జాన్ రెయింట్ స్మిట్ (Jan Reint Smit) ఆధ్వర్యంలో వివిధ రంగాల నిపుణుల బృందం సమావేశంలో పాల్గొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటి సలహాదారు ఐ.సాయికృష్ణ టిజిఐఐసి ఎండి శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ రఘురామ శర్మ, తెలంగాణా లైఫ్ సైన్సెస్ సిఇఓ సర్వేశ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ వేణు తదితరులు పాల్గొన్నారు.1
- వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి Cpm జిల్లా కమిటీ డిమాండ్ వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపీఎం) జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ పభ్యుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి కలలో కురిసిన వడగండ్ల వానకు వరి పంట,మామిడి పంట వందల ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆమె అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే వడగండ్ల వానకు పాడైతే రైతులు గుండెలు బాదుకుంటున్నారన్నారు.చేతికి వచ్చిన పంట మరో వారం ,పది రోజుల లో ఇంటికొచ్చే పంట ,అనేక తెగుళ్ల నుండి కాపాడుకొని చివరి టైంలో మామిడి పంట లు వర్షం కారణంగా దెబ్బతినడం వల్ల రైతుల కళ్ళల్లో కన్నీరే మిగిలిందన్నారు.అప్పులు చేసి పంట పండిస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతన్నలు తలలు పట్టుకొని ఏడుస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షం కారణంగా దెబ్బతిన్న వరి,మామిడి పంటలను వాటి నష్టాన్ని వేల కట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.ఉరుములు , మెరుపుల తో అకాల వర్షాలు కురుస్తున్నందున కోసిన వరి పంట ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా ఇచ్చి ఆదుకోవాలన్నారు.1
- ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్1
- IIT-JEE (MAIN) 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎం.శ్రీపార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, సి.హెచ్.పూర్ణచంద్ 138, ఎస్.వర్జినిరెడ్డి 211, ఎన్.రత్నప్రకాశ్ 239, పి.అక్షయ 250, ఎ.కీర్తన 274, యు.సిద్దీశ్వర్ 459, కె. ధనుష్ 556, కె.నచికేత్ 593, బి. లిఖిత్సాయి 737, యమ్.వశిష్ట 884, కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ డా. వి.నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను పేరెంట్స్ తోపాటు అధ్యాపకులు అభినందించారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు IIT (Adv) పరీక్షకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంచే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్షలో కూడ అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక IIT లలో సీట్లు సాధిస్తారని విశ్వసిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం IIT, NEET EAPCET పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. IIT JEE (MAIN) - 2026 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు.2
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోపాల్ నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్యూవల్ డే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ గోపాల్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ సంస్కృత కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల ఆదరణను పెంచేలా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో వివిధ పోటీ పరీక్షల ద్వారా ఉత్తమ ప్రతిభగలవారీగా ప్రభుత్వం చే ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు విద్యా భోధన చేస్తారు కాబట్టి ఉపాధ్యాయులు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను నేటి పోటీ ప్రపంచంలో ప్రవేట్ పాఠశాలల విద్యార్థులకంటే మెరుగైన విషయ పరిజ్ఞానాన్ని అందించి విద్యార్థులను ఉపాధ్యాయులు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు.నేడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ద్వారా కూడా విద్యను అందిస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రభుత్వ పాఠశాలను తక్కువ భావనతో చూడకుండ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ లు తీసుకోవాలని అన్నారు.. అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సంతోషంగా తిలకించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కౌన్సిలర్ సభ్యులు ఎర్ర వెంకటరాజం కోఆప్షన్ సభ్యులు నంది శంకర్, ఎంఈవో దూసరగుపతి, విద్యాశాఖ క్లస్టర్ ఇంచార్జ్ హెచ్ఎం మోతిలాల్, నెహ్రూ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతా మాధురి, బోప్ప దేవయ్య , ఓజ్జాల అగ్గి రాములు మొదలగువారు పాల్గొన్నారు.1
- మీ సమస్యలపై కమిటీ వేసాము సమ్మె ఆలోచన విరమించుకోండి ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం మీ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉంది, 4 వారాల కాల పరిమితితో ఒక కమిటీ వేసాము మీ సమస్యలు ఆ కమిటీకి చెప్తే ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాము ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని కార్మికులను కోరుతున్నాను – మంత్రి పొన్నం ప్రభాకర్1