logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కోనాపూర్ యువభారత్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో సోమవారం యువభారత్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ మందిరం నుండి గ్రామచావిడి వరకు యువభారత్ యూత్ సభ్యులు భక్తిశ్రద్ధలతో భజనలు చేసుకుంటూ వినాయకుని ప్రతిష్టించి ఏడ ఉన్నావ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోయువ భారత్ యూత్ సభ్యులు, గ్రామస్తుల తదితరులు పాల్గొన్నారు.

23 hrs ago
user_Srinivas chari Banswada
Srinivas chari Banswada
Carpenter బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
23 hrs ago
536332d5-d1ca-4b60-97c5-18bd8b7d0335

కోనాపూర్ యువభారత్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో సోమవారం యువభారత్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ మందిరం నుండి గ్రామచావిడి వరకు యువభారత్ యూత్ సభ్యులు భక్తిశ్రద్ధలతో భజనలు చేసుకుంటూ వినాయకుని ప్రతిష్టించి ఏడ ఉన్నావ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోయువ భారత్ యూత్ సభ్యులు, గ్రామస్తుల తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ– 2026 (SIR) ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి హియరింగ్‌ కు హాజరైన ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం రామాయంపేట అక్కన్నపేట మండలంలోని ఝాoసింగ్ లింగాపూర్ లోగ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ రజనీతో కలిసి కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించారు. నోటీసుల జారీ, ఓటర్ల హియరింగ్, ఫారాల స్వీకరణ, అప్‌లోడింగ్ ప్రక్రియలనుపర్యవేక్షించి , అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటర్లు సమర్పించే ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటిపై తప్పనిసరిగా సంబంధిత ఓటర్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే 2002 సంవత్సరానికి చెందిన ఓటర్ల పేర్ల జాబితాను పరిశీలించి, సరిపోల్చుకోవాలని తెలిపారు. ఓటర్లు సమర్పించిన ఫారాలను పరిశీలించిన *కలెక్టర్*, అప్‌లోడింగ్ ప్రక్రియను కూడా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత మంది ఓటర్లు హియరింగ్‌కు వస్తున్నారు? ఎన్ని దరఖాస్తులు ధ్రువీకరిస్తున్నారు? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు జారీ చేసిన ప్రతి వ్యక్తి హియరింగ్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ఖచ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియను నిర్వహించాలని, విధులు కేటాయించిన సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
    1
    ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ– 2026 (SIR) ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి హియరింగ్‌ కు హాజరైన ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని  జిల్లా కలెక్టర్  ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం రామాయంపేట అక్కన్నపేట  మండలంలోని  ఝాoసింగ్ లింగాపూర్ లోగ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ రజనీతో కలిసి  కలెక్టర్  ప్రతిమాసింగ్ పరిశీలించారు.
నోటీసుల జారీ, ఓటర్ల హియరింగ్, ఫారాల స్వీకరణ, అప్‌లోడింగ్ ప్రక్రియలనుపర్యవేక్షించి , అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటర్లు సమర్పించే ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటిపై తప్పనిసరిగా సంబంధిత ఓటర్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే 2002 సంవత్సరానికి చెందిన ఓటర్ల పేర్ల జాబితాను పరిశీలించి, సరిపోల్చుకోవాలని తెలిపారు.
ఓటర్లు సమర్పించిన ఫారాలను పరిశీలించిన *కలెక్టర్*, అప్‌లోడింగ్ ప్రక్రియను కూడా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత మంది ఓటర్లు హియరింగ్‌కు వస్తున్నారు? ఎన్ని దరఖాస్తులు ధ్రువీకరిస్తున్నారు? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నోటీసులు జారీ చేసిన ప్రతి వ్యక్తి హియరింగ్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ఖచ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియను నిర్వహించాలని, విధులు కేటాయించిన సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    3 hrs ago
  • నవరాత్రి ఉత్సవాల్లో పటిష్ట బందోబస్త్ : ఎస్ హెచ్ ఓ దీపక్.... బాసర మండలం లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్పీ సాయికిరణ్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని బాసర ఎస్ హెచ్ ఓ దీపక్ అన్నారు. కిర్గుల్ (బి), ఓని, కౌట, సాలాపుర్, బీదరెల్లి లోని వినాయక మండపాలను పోలీస్ సిబ్బంది తో కలసి సందర్శించి మండపాల నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. 24 గంటలు మండపాల వద్ద సభ్యుల నిఘా ఉండాలని, హారతి సమయం లో మండపాల వద్ద మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్త గా ఉండాలని అన్నారు.
    1
    నవరాత్రి ఉత్సవాల్లో పటిష్ట బందోబస్త్ : ఎస్ హెచ్ ఓ దీపక్....
బాసర మండలం లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్పీ సాయికిరణ్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని బాసర ఎస్ హెచ్ ఓ దీపక్ అన్నారు. కిర్గుల్ (బి), ఓని, కౌట, సాలాపుర్, బీదరెల్లి లోని వినాయక మండపాలను పోలీస్ సిబ్బంది తో కలసి సందర్శించి మండపాల నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. 24 గంటలు మండపాల వద్ద సభ్యుల నిఘా ఉండాలని, హారతి సమయం లో మండపాల వద్ద మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్త గా ఉండాలని అన్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    7 hrs ago
  • మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం. బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్‌ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్‌ చైర్మన్‌ మీనాక్షి డాక్టర్‌ మోహన్‌నాయక్‌ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్‌ రమేష్‌, స్వామి, మల్లేష్‌, నర్సింలు, బాలచందర్‌, యాదగిరి, భాస్కర్‌, ఎల్లయ్య, సురేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
    2
    మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం.
బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్‌
మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్‌ చైర్మన్‌ మీనాక్షి డాక్టర్‌ మోహన్‌నాయక్‌ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్‌ రమేష్‌, స్వామి, మల్లేష్‌, నర్సింలు, బాలచందర్‌, యాదగిరి, భాస్కర్‌, ఎల్లయ్య, సురేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
    user_మహమ్మద్
    మహమ్మద్
    నిజాంపేట, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన
పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    48 min ago
  • భైంసా : ఘనంగా ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయకుల నిమజ్జనం... నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు.తమ ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకున్న భక్తులు మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భైంసాలోని స్థానిక గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భక్తులు తమ తమ ఇంట్లో నుండి వినాయక ప్రతిమలను తీసుకోని గణపతి బప్పా మోరియా అంటూ జలాశయం వద్దకు తీసుకవెళ్లి అక్కడ ఆ గణేశునికి హారతులు నిర్వహించి నిమజ్జనం చేశారు.దీంతో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద సందడి నెలకొంది.
    1
    భైంసా : ఘనంగా ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయకుల నిమజ్జనం...
నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు.తమ ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకున్న భక్తులు మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భైంసాలోని స్థానిక గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భక్తులు తమ తమ ఇంట్లో నుండి వినాయక ప్రతిమలను తీసుకోని గణపతి బప్పా మోరియా అంటూ జలాశయం వద్దకు తీసుకవెళ్లి అక్కడ ఆ గణేశునికి హారతులు నిర్వహించి నిమజ్జనం చేశారు.దీంతో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద సందడి నెలకొంది.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    8 hrs ago
  • శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
    1
    శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • ఎఫ్ ఎల్ ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కావాలి ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యసాధనలో ముందుండాలి మధ్యాహ్న భోజనంలో నాణ్యతకు రాజీ వద్దు పాఠంలో వెనుకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్, సెప్టెంబర్ 15 — మెతుకు సీమ టైమ్స్ ప్రతినిధి: “ప్రాథమిక దశలోనే విద్యార్థికి బలమైన పునాది వేస్తే.. భవిష్యత్తులో అతని విద్యా ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది” అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మంగళవారం రామాయంపేట, అక్కన్నపేట మండలాల్లోని ప్రీ-ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి క్లాస్‌రూమ్‌లో.. కేవలం అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవడంతో సరిపెట్టకుండా కలెక్టర్ స్వయంగా తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు? పిల్లలు వాటిని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? నేర్చుకున్న విషయాలను తిరిగి చెప్పగలుగుతున్నారా? అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. చిన్నారి పునాదే.. రేపటి భవిష్యత్తు ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచే పిల్లల్లో చదవడం, రాయడం, సంఖ్యలపై ప్రాథమిక అవగాహన పెంపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను కేవలం రికార్డులకే పరిమితం చేయకుండా ప్రతి విద్యార్థిలో అభ్యసన సామర్థ్యం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. “ప్రతి చిన్నారి చదవాలి.. అర్థం చేసుకోవాలి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అందుకు ప్రాథమిక విద్యే బలమైన పునాది” అనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
    1
    ఎఫ్ ఎల్ ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ 
పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కావాలి
ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యసాధనలో ముందుండాలి
మధ్యాహ్న భోజనంలో నాణ్యతకు రాజీ వద్దు
పాఠంలో వెనుకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, సెప్టెంబర్ 15 — మెతుకు సీమ టైమ్స్ ప్రతినిధి:
“ప్రాథమిక దశలోనే విద్యార్థికి బలమైన పునాది వేస్తే.. భవిష్యత్తులో అతని విద్యా ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది” అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
మంగళవారం రామాయంపేట, అక్కన్నపేట మండలాల్లోని ప్రీ-ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
విద్యార్థులతో కలిసి క్లాస్‌రూమ్‌లో..
కేవలం అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవడంతో సరిపెట్టకుండా కలెక్టర్ స్వయంగా తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు? పిల్లలు వాటిని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? నేర్చుకున్న విషయాలను తిరిగి చెప్పగలుగుతున్నారా? అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.
చిన్నారి పునాదే.. రేపటి భవిష్యత్తు
ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచే పిల్లల్లో చదవడం, రాయడం, సంఖ్యలపై ప్రాథమిక అవగాహన పెంపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను కేవలం రికార్డులకే పరిమితం చేయకుండా ప్రతి విద్యార్థిలో అభ్యసన సామర్థ్యం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరి
విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
“ప్రతి చిన్నారి చదవాలి.. అర్థం చేసుకోవాలి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అందుకు ప్రాథమిక విద్యే బలమైన పునాది” అనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    4 hrs ago
  • బాసర లో పిచ్చి కుక్కల, కోతుల స్వైర విహారం.. ఆందోళన లో స్థానికులు... బాసర మండలంలో పిచ్చి కుక్కల స్వైర విహారం పెరిగిపోతుంది. కాలనీలతో పాటు, బాసర లోని ప్రధాన రోడ్ల పై కుక్కలు, కోతులు యధేచ్చగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతం లో చిన్నారులపై, మహిళల పై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ వైపు కోతులు మరోవైపు కుక్కల వల్ల చిన్నారులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోతులు, కుక్కల బెడద నుండి అరకట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    బాసర లో పిచ్చి కుక్కల, కోతుల స్వైర విహారం.. ఆందోళన లో స్థానికులు...
బాసర మండలంలో పిచ్చి కుక్కల స్వైర విహారం పెరిగిపోతుంది. కాలనీలతో పాటు, బాసర లోని ప్రధాన రోడ్ల పై కుక్కలు, కోతులు యధేచ్చగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతం లో చిన్నారులపై, మహిళల పై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ వైపు కోతులు మరోవైపు కుక్కల వల్ల చిన్నారులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోతులు, కుక్కల బెడద నుండి అరకట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    13 hrs ago
  • కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి
కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    55 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.