Shuru
Apke Nagar Ki App…
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని తెలిసి.. రైతుల పరుగులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా చేరిందన్న సమాచారంతో రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి ఎరువుల కోసం ఎదురుచూశారు. వరి నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు కీలక సమయంలో ఎరువు కోసం ఇలా రోజుల తరబడి తిరగాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. తమ అవసరాలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
Sraya
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని తెలిసి.. రైతుల పరుగులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా చేరిందన్న సమాచారంతో రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి ఎరువుల కోసం ఎదురుచూశారు. వరి నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు కీలక సమయంలో ఎరువు కోసం ఇలా రోజుల తరబడి తిరగాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. తమ అవసరాలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులు రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భాస్కర్ తెలిపారు. పండుగ రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. పండుగకు రెండు రోజుల ముందుగానే, బుధవారం నుంచి అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని ఆర్ఎం స్పష్టం చేశారు.1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- మల్కాజ్గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మల్కాజ్గిరి: మల్కాజ్గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.1
- బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని తెలిసి.. రైతుల పరుగులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా చేరిందన్న సమాచారంతో రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి ఎరువుల కోసం ఎదురుచూశారు. వరి నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు కీలక సమయంలో ఎరువు కోసం ఇలా రోజుల తరబడి తిరగాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. తమ అవసరాలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.1
- మెదక్ : వృద్ధురాలి బంగారు పుస్తెలతాడు చోరీ కేసు ను చేదించిన పోలీసులు వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మెదక్ పట్టణం సాయి నగర్ కాలనీకి చెందిన 68 ఏళ్ల బాలెశెట్టి సులోచన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలోని సుమారు నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు ను లాక్కెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటన పై క్రైం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. దయారా స్ట్రీట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన చాకలి మొగులయ్య (34) అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఆయన తెలిపారు. నిందితుడి నుంచి చోరీ కి గురైన 4 లక్షల 50 వేల విలువ గల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడి పై గతంలో ఆటో దొంగతనం, రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన క్రైమ్ టీం నర్సింలు, మల్లేశం ను ఇన్స్పెక్టర్ మహేష్ అభినందించారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1