పాలచర్ల నాగేంద్ర చౌదరి మాతృమూర్తి మరణానికి సంతాపం తెలిపిన అన్నవరం దేవస్థానం ఈవో, బోర్డు మెంబర్స్ పర్వత సురేష్, పలువురు బోర్డు సభ్యులు అన్నవరం దేవస్థానం పాలక మండల సభ్యులు, టిడిపి యువ నాయకులు పాలచర్ల నాగేంద్ర చౌదరి మాతృమూర్తి అనంతలక్ష్మి స్వర్గస్తురాలైన విషయం తెలుసుకున్న అన్నవరం శ్రీ సత్యదేవ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చక్రధర్ రావు, టీడీపీ రాష్ట్ర సెక్రెటరీ, అన్నవరం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు పర్వత సురేష్ , ఇతర బోర్డు సభ్యులు జగ్గంపేటలోని వారి నివాసానికి వెళ్లి పాలచర్ల నాగేంద్ర చౌదరి ని, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి స్వర్గీయ అనంతలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో చక్రధర్ రావు మాట్లాడుతూ, నాగేంద్ర చౌదరి తల్లి గారి మరణం తమను తీవ్రంగా కలచివేసిందని, అనంతలక్ష్మి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దివంగతురాలి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ సత్యదేవ స్వామి వారిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర సెక్రెటరీ , బోర్డు సభ్యులు పర్వత సురేష్ మాట్లాడుతూ, నాగేంద్ర చౌదరి గారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో తమ పూర్తి అండగా ఉంటామని తెలిపారు. తల్లి అనే దైవాన్ని కోల్పోవడం తీరని లోటని, ఈ విషాదాన్ని భరించే శక్తిని భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు. టిడిపి నేతలు ముసిరెడ్డి నాగేశ్వరరావు, ముండ్రు ఎర్రబాబు, ఉప్పలపాటి బుల్లెబ్బ, కందుల సత్యనారాయణ, కాకరపల్లి కామేశ్వరరావు, మీసాల సత్తిబాబు, చేలికాని హరిగోపాల్, తుమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
పాలచర్ల నాగేంద్ర చౌదరి మాతృమూర్తి మరణానికి సంతాపం తెలిపిన అన్నవరం దేవస్థానం ఈవో, బోర్డు మెంబర్స్ పర్వత సురేష్, పలువురు బోర్డు సభ్యులు అన్నవరం దేవస్థానం పాలక మండల సభ్యులు, టిడిపి యువ నాయకులు పాలచర్ల నాగేంద్ర చౌదరి మాతృమూర్తి అనంతలక్ష్మి స్వర్గస్తురాలైన విషయం తెలుసుకున్న అన్నవరం శ్రీ సత్యదేవ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చక్రధర్ రావు, టీడీపీ రాష్ట్ర సెక్రెటరీ, అన్నవరం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు పర్వత సురేష్ , ఇతర బోర్డు సభ్యులు జగ్గంపేటలోని వారి నివాసానికి వెళ్లి పాలచర్ల నాగేంద్ర చౌదరి ని, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి స్వర్గీయ అనంతలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో చక్రధర్ రావు మాట్లాడుతూ, నాగేంద్ర చౌదరి తల్లి గారి మరణం తమను తీవ్రంగా కలచివేసిందని, అనంతలక్ష్మి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దివంగతురాలి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ సత్యదేవ స్వామి వారిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర సెక్రెటరీ , బోర్డు సభ్యులు పర్వత సురేష్ మాట్లాడుతూ, నాగేంద్ర చౌదరి గారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో తమ పూర్తి అండగా ఉంటామని తెలిపారు. తల్లి అనే దైవాన్ని కోల్పోవడం తీరని లోటని, ఈ విషాదాన్ని భరించే శక్తిని భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు. టిడిపి నేతలు ముసిరెడ్డి నాగేశ్వరరావు, ముండ్రు ఎర్రబాబు, ఉప్పలపాటి బుల్లెబ్బ, కందుల సత్యనారాయణ, కాకరపల్లి కామేశ్వరరావు, మీసాల సత్తిబాబు, చేలికాని హరిగోపాల్, తుమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లలో ఆర్సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్కు చెందిన కుందన్ సింగ్ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.1
- సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్స్పెక్టర్ అభినందించారు.1
- గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించడంతో పాటు, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ చేసిన ఈ పనికి ఫిర్యాదుదారులు ఆయనను మెచ్చుకుంటున్నారు.1
- MGM వెస్ట్స్ రోజూ వేసుకునే దుస్తులలో పూర్తి సౌకర్యాన్ని అందిస్తాయి. పగలు లేదా రాత్రి, ఏ సమయంలోనైనా వీటి ప్రీమియం ఫీల్ తో హాయిగా ఉండవచ్చు. మీ రోజువారీ జీవితంలో ఆనందం, విశ్వాసం పెంచుకోవడానికి ఇవి సరైన ఎంపిక.1
- అమరేశ్వరాలయంలో రుద్ర హోమం నిర్వహించిన ఆంజనేయస్వామి భక్తులు పంచారామ క్షేత్రమైన బాల చాముండికా సమేత అమరేశ్వరంలో ఈరోజు ఉదయం అత్యంత ఘనంగా ఆలయ అర్చకులుమహా రుద్ర హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి మాల వేసుకున్న భక్తులు భక్తి పూజల నిర్వహించారు తదనంతరం ఆలయ సహాయకమిషనర్ కే రేఖ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూశారు తదనంతరం కేంద్ర ప్రసాదాలు పెంచిపెట్టారు1
- ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించండి -పిల్లలను చేర్పించండి: కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి తమ పిల్లలను చేర్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని తెలిపారు. వివిధ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న 26 మంది విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలో చేరడం విశేషంగా నిలిచింది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు ఈ పాఠశాలలో అడ్మిషన్ పొందారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచామని కలెక్టర్ గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో 60 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు.1
- పెదకూరపాడు మండలం గారపాడులోని శ్రీ భావనా ఋషి స్వామి వారి నూతన ఆలయంలో శిలా బింభ ప్రతిష్ఠాపన వేడుకలు ఘనంగా ముగిశాయి. వేద పండితుల ఆధ్వర్యంలో 15 రోజుల పాటు ఆగమ శాస్త్రం ప్రకారం జరిగిన క్రతువులు, 16వ రోజు వేడుకతో పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.1
- గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ విజ్ఞాపనలను నేరుగా కలెక్టర్కు అందజేసి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు.1