గంట్యాడ గ్రామనికి చెందిన వ్యక్తి కనబడుటలేదు ఆచూకీ కోసం విజ్ఞప్తి గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంట్యాడ గ్రామానికి చెందిన అలుగోలు రమణ, తండ్రి పేరు లేట్ సన్యాసప్పడు, వయస్సు 53 సంవత్సరాలు, తేదీ 15.03.2026 నుండి కనబడుట లేదు. సదరు వ్యక్తి 15.03.2026 తేదీన ఉదయం 06.00 గంటలకు గంట్యాడ గ్రామంలోని తన ఇంటి నుండి జొన్నవలస సైట్లో వాచ్మన్ విధులకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపి, భోజనం క్యారేజ్ తీసుకుని ఇంటి నుండి బయలుదేరి వెళ్లారు. అయితే, ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆయనను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించగా, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నది. తరువాత కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా సంప్రదించిన సమయంలో, తాను తిరుపతి, రాజమండ్రి, కొవ్వూరు తదితర ప్రాంతాలకు వెళ్తున్నట్లు తెలిపినప్పటికీ, “ఆ తరువాత ఆయన నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో, కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినప్పటికీ ఆయన ఆచూకీ తెలియరాలేదు.” కనబడని వ్యక్తి వివరాలు: పేరు: అలుగోలు రమణ తండ్రి పేరు: లేట్ సన్యాసప్పడు వయస్సు: 53 సంవత్సరాలు నివాసం: గంట్యాడ గ్రామం & మండలం, విజయనగరం జిల్లా వృత్తి: వాచ్మన్ కనబడకుండా పోయిన తేదీ: 15.03.2026 పై వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించినట్లయితే గంట్యాడ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించవలసిందిగా కోరడమైనది. SI గంట్యాడ పి.ఎస్ 9121109442
గంట్యాడ గ్రామనికి చెందిన వ్యక్తి కనబడుటలేదు ఆచూకీ కోసం విజ్ఞప్తి గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంట్యాడ గ్రామానికి చెందిన అలుగోలు రమణ, తండ్రి పేరు లేట్ సన్యాసప్పడు, వయస్సు 53 సంవత్సరాలు, తేదీ 15.03.2026 నుండి కనబడుట లేదు. సదరు వ్యక్తి 15.03.2026 తేదీన ఉదయం 06.00 గంటలకు గంట్యాడ గ్రామంలోని తన ఇంటి నుండి జొన్నవలస సైట్లో వాచ్మన్ విధులకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపి, భోజనం క్యారేజ్ తీసుకుని ఇంటి నుండి బయలుదేరి వెళ్లారు. అయితే, ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆయనను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించగా, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నది. తరువాత కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా సంప్రదించిన సమయంలో, తాను తిరుపతి, రాజమండ్రి, కొవ్వూరు తదితర ప్రాంతాలకు వెళ్తున్నట్లు తెలిపినప్పటికీ, “ఆ తరువాత ఆయన నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో, కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినప్పటికీ ఆయన ఆచూకీ తెలియరాలేదు.” కనబడని వ్యక్తి వివరాలు: పేరు: అలుగోలు రమణ తండ్రి పేరు: లేట్ సన్యాసప్పడు వయస్సు: 53 సంవత్సరాలు నివాసం: గంట్యాడ గ్రామం & మండలం, విజయనగరం జిల్లా వృత్తి: వాచ్మన్ కనబడకుండా పోయిన తేదీ: 15.03.2026 పై వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించినట్లయితే గంట్యాడ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించవలసిందిగా కోరడమైనది. SI గంట్యాడ పి.ఎస్ 9121109442
- నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.1
- బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు. ఆన్లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.1
- పార్వతీపురం మన్యం జిల్లా.. సాలూరులో రక్తదానంతో ప్రాణాలను కాపాడుదాం: ఎస్ ఐ జి భాస్కరరావు.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నవజీవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈగల్ డిపార్ట్మెంట్, రెడ్క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్ఇన్స్పెక్టర్ జి. భాస్కర్రావు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్త నిల్వలు ఎంతో అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పెరుగుతోందని, తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రక్తదానం చేసిన సబ్ఇన్స్పెక్టర్ జి. భాస్కర్రావును నవజీవ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్మలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, రెడ్క్రాస్ సూపర్వైజర్ రాము, స్వాతిశ్రీ, రెడ్క్రాస్ సిబ్బంది, నవజీవ ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.2
- అన్నదానం మహాదానం అభిమాని ఫౌండేషన్ వారి నిత్య అన్నదాన సేవ 1820 వ రోజు వృద్ధుల వికలాంగుల ఇతరుల ఇండ్ల వద్దకు ప్రతీ రోజు భోజనం అందిస్తూ ఆకలి నుంచి కాపాడుతున్న సేవ లో నేడు భాగస్వాములుగా నిలిచిన శ్రీ కంటు రాంప్రసాష్ దంపతులకు అభినందనలు1
- సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్ రాజాం /సంతకవిటి, షురూ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్ దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు మూడు కేంద్రాలు : కలెక్టర్ ఈ నెల 30న ఆదివారం జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు.1
- శ్రీకాకుళం జిల్లా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపoడి : కలెక్టర్ శ్రీకాకుళం : ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాజకీయ పార్టీలను కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక జాబితా సవరణ పై ఆయన వారాంతపు సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మ్ 6,7,8 క్లైయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పైన వాటి వివరాలు తెలియజేశారు. నియోజకవర్గాల వారీగా అభ్యంతరలేమైనా ఉంటే తెలియజేయాలన్నారు. ఈనెల 22 మరియు 23వ తేదీలలో స్వీకరించిన ఫారాలు యొక్క వివరాలను నియోజకవర్గాల వారీగా తెలియజేశారు. ప్రత్యేక జాబితా సరవణకు సంబంధించి నోటీసులు, ఇప్పటి వరకు జరిగిన వివరాలను ఆయన తెలిపారు. జారీ చేసిన 1,16,258 నోటీసులకు బిఎల్ ద్వారా డాక్యుమెంటేషన్ అప్డేషన్ పూర్తి చేసినవి నేటి వరకు 51,878 ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు1