Shuru
Apke Nagar Ki App…
నర్సంపేటలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ సత్య శారద... నర్సంపేట పట్టణంలోని పలు పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్రాల్లో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
Chetty:Ramesh
నర్సంపేటలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ సత్య శారద... నర్సంపేట పట్టణంలోని పలు పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్రాల్లో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. 67వ డివిజన్లో సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్లో డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.13 లక్షలు, డాక్టర్స్ కాలనీలో పార్క్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.65 లక్షలతో పనులు ప్రారంభించారు. అలాగే 57వ డివిజన్లో అశోక కాలనీ, గోకుల్ నగర్ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, ఇంజనీర్స్ కాలనీ–ఎస్పీఆర్ పాఠశాల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కలిపి రూ.2.14 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ప్రారంభించిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండదని, ప్రజల అవసరాలే తమకు ప్రధానమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.2
- నర్సంపేట పట్టణంలోని పలు పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్రాల్లో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.1
- తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో వ్యవసాయ భావి పూడికతీత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు కూలీలపై క్రేన్ తెగిపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో సుఖినే దేవరావు(48) బండారి అభిలాష్(16) పైడి(53) ముగ్గురు మరణించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.1
- బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన వీరశిఖామణి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనలో గౌడన్నలందరూ ఏకం కావాలని హైకోర్టు న్యాయవాది డాక్టర్ నలమాస కృష్ణ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్లో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఘణ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన గౌడన్నలు.. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నలమాస కృష్ణ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గౌడన్నలందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని కోరారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో సామాజిక అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు మానుకోట ప్రసాద్ ఆలపించిన ఉత్తేజిత గీతాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో గౌడ యువజన సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో సామాజిక వర్గీయులు పాల్గొని విజయవంతం చేశారు.1
- వరంగల్ ఉమ్మడి జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదలో మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామానికి చెందిన సుకినే దేవారావు(48), బండారి అభిలాష్(15)తో పాటు.. పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడయ్య (53)స్పాట్ లోనే మృతి చెందారు. సుకినే మోహన్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.1
- ధర్మారం మండలంలో శనివారం పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష మొదలైంది. మొదటి రోజు కాబట్టి 45 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను ధర్మారం ఎస్సై సందర్శించారు1
- village road 🛣️ Pasthala Nagaram madalam village Pasthala 541
- గార్ల మండలం పర్యటనలో భాగంగా సీతంపేట గ్రామంలో 20లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయితీ* భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ఫ్రారంభించి,*గార్ల గ్రామంలో నూతన మహిళ స్వయం సహయక సంఘం భవనానికి,బాస్కెట్ బాల్ క్రీడా మైదానం నిర్మాణానికి* భూమి పుజా చేసి,స్ధానిక రైతు వేదిక నందు ప్రజా ప్రభుత్వం రాయితితో అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను లభ్ధిధారులకు పంపిణి చేసి,*మర్రిగూడెం గ్రామంలో ఫ్రాధమిక పాఠశాల చుట్టూ కంపౌడ్ వాల్ నిర్మాణానికి* భూమి పూజ ,క్రీడా మైదానాన్ని పరిశీలించిన *ఇల్లందు గౌరవ శసన సభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు... వారివెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ శ్రీ బానోత్ రాంబాబు గారు.. గార్ల మాజీ సొసైటి చైర్మెన్ వడ్లముడి దుర్గాప్రసాద్ గారు....*1