భిన్న సంస్కృతులున్నా గిరిజనులంతా ఐక్యంగా ఉండాలి ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణలోని వివిధ గిరిజన తెగలు భిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగి ఉన్నాయని, ఒకరినొకరు గౌరవించుకుంటూనే అభివృద్ధి కోసం ఐక్యంగా ఉండాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి లంబాడి గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఎమ్మెల్యే కోవా లక్ష్మి, సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి భోగ్ బండార్ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వం సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించేలా నిధులు కేటాయించిందని, హైదరాబాద్లో బంజారా భవన నిర్మాణం పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కూడా బంజారా భవన నిర్మాణం కోసం భూమి కేటాయింపు, నిధుల సాధనలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లంబాడి మహిళలతో కలిసి ఆమె సాంప్రదాయ నృత్యం చేసి అలరించారు.పర్యావరణాన్ని కాపాడుకోవాలి జిల్లా కలెక్టర్ కే. హరిత మాట్లాడుతూ.. గిరిజన జాతులలో భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ వారంతా ఐక్యంగా ఉంటారని, సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీరా శ్యాం నాయక్ మాట్లాడుతూ, లంబాడీల పండుగలు ప్రకృతితో ముడిపడి ఉంటాయని, తీజ్, శిథిల వంటి పండుగలు పర్యావరణ పరిరక్షణను చాటిచెబుతాయని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుకోకపోతే మానవ మనుగడకే ముప్పు అని హెచ్చరించారు జయంతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు చవాన్ గుణంతరావు, రూపులాల్ నాయక్ తదితరులు మాట్లాడుతూ.. అటవీ శాఖ అధికారుల వేధింపులను అరికట్టాలని, లంబాడి గిరిజన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు చేసిన నృత్యాలు, పవర్ మోహన్ నాయక్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.
భిన్న సంస్కృతులున్నా గిరిజనులంతా ఐక్యంగా ఉండాలి ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణలోని వివిధ గిరిజన తెగలు భిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగి ఉన్నాయని, ఒకరినొకరు గౌరవించుకుంటూనే అభివృద్ధి కోసం ఐక్యంగా ఉండాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల
నుండి లంబాడి గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఎమ్మెల్యే కోవా లక్ష్మి, సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి భోగ్ బండార్ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వం సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించేలా నిధులు కేటాయించిందని, హైదరాబాద్లో బంజారా భవన నిర్మాణం పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కూడా బంజారా భవన నిర్మాణం కోసం భూమి కేటాయింపు, నిధుల సాధనలో తన
వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లంబాడి మహిళలతో కలిసి ఆమె సాంప్రదాయ నృత్యం చేసి అలరించారు.పర్యావరణాన్ని కాపాడుకోవాలి జిల్లా కలెక్టర్ కే. హరిత మాట్లాడుతూ.. గిరిజన జాతులలో భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ వారంతా ఐక్యంగా ఉంటారని, సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీరా శ్యాం నాయక్ మాట్లాడుతూ, లంబాడీల పండుగలు ప్రకృతితో ముడిపడి
ఉంటాయని, తీజ్, శిథిల వంటి పండుగలు పర్యావరణ పరిరక్షణను చాటిచెబుతాయని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుకోకపోతే మానవ మనుగడకే ముప్పు అని హెచ్చరించారు జయంతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు చవాన్ గుణంతరావు, రూపులాల్ నాయక్ తదితరులు మాట్లాడుతూ.. అటవీ శాఖ అధికారుల వేధింపులను అరికట్టాలని, లంబాడి గిరిజన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు చేసిన నృత్యాలు, పవర్ మోహన్ నాయక్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.
- कांग्रेस का खाकी डंडा..विधायक कोवा लक्ष्मी पर पुलिस ने बिना महिला देखे की बर्बरता! तेलंगाना:- यह लोकतंत्र के लिए काला दिन है मंचिरयाला जिले के क्यातनपल्ली नगर पालिका में कांग्रेस सरकार की अराजकता चरम पर पहुंच गई है। लोकप्रिय रूप से निर्वाचित बीआरएस पार्षदों को नगर निगम कार्यालय में प्रवेश से रोकना क्या संकेत है? क्या आप लोगों के लिए जीते हैं या विपक्ष को दबाने के लिए? क्यातनपल्ली के प्रभारी के रूप में एक जिम्मेदार विधायक कोवा लक्ष्मी के साथ पुलिस ने जिस तरह का व्यवहार किया वह बेहद घृणित है। यह तेलंगाना की संस्कृति के खिलाफ है कि पुलिस, जो कांग्रेस की पिट्ठू बन गई है, बिना यह देखे कि वह एक महिला प्रतिनिधि है, उसे रोक दे। बाल्का सुमन और कोवा लक्ष्मी की सवालों का जवाब देने में असमर्थता और पुलिस का उपयोग करना कांग्रेस की अक्षमता का प्रमाण है। कैबिनेट के अंदर रेड कारपेट.. बाहर जीते हुए पार्षदों के लिए लाठियां? कोवा लक्ष्मी ने कहा कि तुम पुलिस वाले कांग्रेस पार्टी के लिए काम कर रहे हैं या फिर लोगों के लिए काम कर रहे हैं।विधायक कोवा लक्ष्मी ने कहा कि हमारे नेता और पार्षद जो सड़क पर तैनात हैं, उन्हें हमेशा क्यातनपल्ली के लोगों का समर्थन मिलेगा।1
- Post by Bharath Newz1
- కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.1
- శివ స్వాములు దీక్ష విరమణ శివరాత్రి సందర్భంగా 8 రోజులు కాలినడకన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రం నుంచి ఈనెల ఏడో తారీఖున శ్రీశైలం కాలి నడకన బయల్దేరారు. స్వాములు చందాపూర్ బసవన్న గడ్డ దగ్గరికి వెళ్ళగానే వీరిని ఒక కుక్క వెంబడించడం జరిగింది. తన కుక్కపిల్లలను కూడా వదిలి ఆ శివ స్వాముల వెంబడి శ్రీశైలం వరకు అంటే స్నానం చేసే తను స్నానం చేస్తుంది ఇలా చివరికి వారితో పాటు ఆ శునకం శ్రీశైల దర్శనం చేసుకుంది. తిరిగి ప్రయాణంలో కూడా వారి వెంటే వాహనం తీసుకొని దానిని చందాపూర్ లో వదిలేయడం జరిగింది.ఇది తెలిసిన వారందరూ అది ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క మహిమ అని ఆశ్చర్యానికి,ఆనందానికి గురవుతున్నారు.4
- Post by Ravi Poreddy1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా డీసీసీ కార్యాలయం నుండి ప్రారంభం మైన కాంగ్రెస్ విజయోస్తావా ర్యాలీ పట్టణంలోని వివిధా విధుల గుండా జై కాంగ్రెస్ నిన్నదాలతో డప్పు సప్పుల మధ్య గుసది నృత్యలతో ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్,కంది శ్రీనివాస్ రెడ్డి,చైర్పర్సన్ బండారి అనూష సతీష్,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సంజీవ్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర కిసాన్ ప్రాధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Bharath Newz1