logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శివంపేట్ సెంటర్ వద్ద భారీగా చేరుకున్న పదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా శివంపేట్ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు భారీగా చేరుకున్నారు. అధికారులు ఇచ్చిన సూచనల మేరకు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే విద్యార్థులు సెంటర్‌కు చేరుకుని హాల్ టికెట్లు తనిఖీ చేయించుకున్నారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రం పరిసరాలు రద్దీగా మారాయి. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

3 hrs ago
user_ASHOK VENGANI
ASHOK VENGANI
Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
3 hrs ago

శివంపేట్ సెంటర్ వద్ద భారీగా చేరుకున్న పదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా శివంపేట్ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు భారీగా చేరుకున్నారు. అధికారులు ఇచ్చిన సూచనల మేరకు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే విద్యార్థులు సెంటర్‌కు చేరుకుని హాల్ టికెట్లు తనిఖీ చేయించుకున్నారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రం పరిసరాలు రద్దీగా మారాయి. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • డొమెస్టిక్ సిలిండర్ లను కమర్షియల్ కు వాడితే కేసులు నమోదు చేస్తాం కలెక్టర్ హెచ్చరిక నర్సాపూర్లో45 సిలిండర్లు సీజ్ కలెక్టర్ ప్రతిమసింగ్ హెచ్చరిక సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగాఉండాలి కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ జిల్లాల్లో గృహావసరాలకు ఎల్.పి.జి సిలిండర్ల ఎలాంటి కొరత లేదు జిల్లాలో 3,84373 కనెక్షన్లు కలవు 16 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా వంట గ్యాస్ సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు నెంబర్.9391942254 హోటల్స్, రెస్టారెంట్లలో అక్రమ గ్యాస్ నిల్వలపై దాడులు నిర్వహించి 44 సిలిండర్లను సీజ్ చేసాం. సోషల్ మీడియాలో గ్యాస్ లేదని వదంతులు సుస్థిస్తే కేసులు చేస్తాం *ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి అడ్వాన్సు గా బుకింగ్ చేసుకోవద్దు* మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ జిల్లాల్లో గృహావసరాలకు ఎల్.పి.జి సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కలెక్టరేట్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీడీవి శ్రీనివాసరావు,జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,84373 కనెక్షన్లు కలవని 16 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు హోటల్స్, రెస్టారెంట్లలో అక్రమ గ్యాస్ నిల్వలపై దాడులు నిర్వహించి 44 సిలిండర్లను సీజ్ చేసాం. అని వెల్లడించారు .ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి అడ్వాన్సు గా బుకింగ్ చేసుకోవద్దనీ జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా సాధారణంగా మరియు నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. . ప్రభుత్వ హాస్పిటల్లో, హాస్టల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్ లో, పాఠశాలల్లో, అత్యవసర సేవలలో గ్యాస్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు.తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం,అక్రమంగా మళ్లించడం ,బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేశామన్నారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని,గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస సరఫరా చేస్తామన్నారు జిల్లా వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ సమస్యలు ఉంటే 9391942254 నెంబర్ ను సంప్రదించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి ,గ్రామీణ 45 రోజులకు ఒకమారు ఎల్.పి.జి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగే పరిస్థితులు లేదా అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన పక్షంలో, సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడం మరియు పారదర్శకంగా సేవలు అందించడం ప్రతి గ్యాస్ ఏజెన్సీ యొక్క బాధ్యతగా గుర్తు చేశారు ప్రజలు గ్యాస్ కొరతపై వస్తున్న అపోహలను నమ్మకూడదని, జిల్లాలో గ్యాస్ నిల్వలు మరియు సరఫరా పూర్తిగా సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏదైనా సమస్యలు, ఆలస్యం లేదా ఇబ్బందులు ఎదురైన సందర్భంలో సంబంధిత అధికారులకు లేదా గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచవచ్చని కలెక్టర్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో గ్యాస్ కొరత ఉందని వదంతులు పుట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు కూడా గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి లింక్ లు వచ్చిన ఓపెన్ చేయకుండా తగు జాగ్రత్తలు వహిస్తూ సైబర్ క్రైమ్ కు గురి కావొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద, డిపిఆర్ఓ రామచంద్ర రాజు, ఏపీఆర్ఓ బాబురావు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. .
    1
    డొమెస్టిక్ సిలిండర్ లను కమర్షియల్ కు వాడితే కేసులు నమోదు చేస్తాం కలెక్టర్ హెచ్చరిక నర్సాపూర్లో45 సిలిండర్లు సీజ్ 
కలెక్టర్ ప్రతిమసింగ్ హెచ్చరిక సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగాఉండాలి కలెక్టర్ ప్రతిమాసింగ్                      
మెదక్ జిల్లాల్లో గృహావసరాలకు  ఎల్.పి.జి సిలిండర్ల ఎలాంటి కొరత లేదు
జిల్లాలో  3,84373 కనెక్షన్లు కలవు 
16 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా
వంట గ్యాస్ సమస్యలపై  కంట్రోల్ రూమ్ ఏర్పాటు  నెంబర్.9391942254
హోటల్స్, రెస్టారెంట్లలో అక్రమ గ్యాస్ నిల్వలపై దాడులు నిర్వహించి 44 సిలిండర్లను సీజ్ చేసాం.
సోషల్ మీడియాలో గ్యాస్ లేదని వదంతులు సుస్థిస్తే కేసులు చేస్తాం
*ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి  అడ్వాన్సు గా బుకింగ్ చేసుకోవద్దు*
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ జిల్లాల్లో గృహావసరాలకు  ఎల్.పి.జి సిలిండర్లకు ఎలాంటి కొరత  లేదని కలెక్టరేట్ కార్యాలయంలో  పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీడీవి శ్రీనివాసరావు,జిల్లా కలెక్టర్ వెల్లడించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  3,84373 కనెక్షన్లు కలవని
16 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు హోటల్స్, రెస్టారెంట్లలో అక్రమ గ్యాస్ నిల్వలపై దాడులు నిర్వహించి 44 సిలిండర్లను సీజ్ చేసాం. అని వెల్లడించారు
.ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి  అడ్వాన్సు గా బుకింగ్ చేసుకోవద్దనీ జిల్లా కలెక్టర్  సూచించారు.
జిల్లాలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా సాధారణంగా మరియు నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు.
. ప్రభుత్వ హాస్పిటల్లో, హాస్టల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్ లో, పాఠశాలల్లో, అత్యవసర సేవలలో గ్యాస్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.
అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు.తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం,అక్రమంగా మళ్లించడం ,బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేశామన్నారు.
అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని,గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస సరఫరా చేస్తామన్నారు
జిల్లా వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ సమస్యలు ఉంటే 9391942254 నెంబర్ ను సంప్రదించాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి ,గ్రామీణ 45 రోజులకు ఒకమారు ఎల్.పి.జి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు.
జిల్లాలో ఎక్కడైనా గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగే పరిస్థితులు లేదా అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన పక్షంలో, సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు  కలెక్టర్ తెలిపారు.
వినియోగదారుల హక్కులను పరిరక్షించడం మరియు పారదర్శకంగా సేవలు అందించడం ప్రతి గ్యాస్ ఏజెన్సీ యొక్క  బాధ్యతగా గుర్తు చేశారు  ప్రజలు గ్యాస్ కొరతపై వస్తున్న అపోహలను నమ్మకూడదని, జిల్లాలో గ్యాస్ నిల్వలు మరియు సరఫరా పూర్తిగా సమృద్ధిగా ఉన్నాయని  పేర్కొన్నారు. ఏదైనా సమస్యలు, ఆలస్యం లేదా ఇబ్బందులు ఎదురైన సందర్భంలో సంబంధిత అధికారులకు లేదా గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందించాలని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచవచ్చని
కలెక్టర్ వెల్లడించారు. 
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో గ్యాస్ కొరత ఉందని వదంతులు పుట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు కూడా గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి లింక్ లు వచ్చిన ఓపెన్ చేయకుండా తగు జాగ్రత్తలు వహిస్తూ సైబర్ క్రైమ్ కు గురి కావొద్దన్నారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద, డిపిఆర్ఓ రామచంద్ర రాజు, ఏపీఆర్ఓ బాబురావు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    18 hrs ago
  • మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం లో లడ్డు, పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా దేవాలయ ఈవో వీరేశం మాట్లాడుతూ దేశాల మధ్య యుద్ధం తో గ్యాస్ రవాణా నిలిచిపోవడం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. దేవస్థానం లడ్డు, పులిహోర తయారీ కోసం గ్యాస్ కొరత ఏర్పడిందని దీంతో కట్టెల పొయ్యి సహాయం తో తయారీ చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ దేవాలయాల కోసం గ్యాస్ ను ఏర్పాటు చేసి గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.
    1
    మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం లో  లడ్డు, పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా దేవాలయ ఈవో వీరేశం మాట్లాడుతూ దేశాల మధ్య యుద్ధం తో గ్యాస్ రవాణా నిలిచిపోవడం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. దేవస్థానం లడ్డు, పులిహోర తయారీ కోసం గ్యాస్ కొరత ఏర్పడిందని దీంతో కట్టెల పొయ్యి సహాయం తో తయారీ చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ దేవాలయాల కోసం గ్యాస్ ను ఏర్పాటు చేసి గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    23 hrs ago
  • హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతంలో ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసదుద్దీన్ ఓవైసీ తో పాటు భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు, స్థానిక ప్రజలు పాల్గొని సామూహికంగా ఇఫ్తార్ చేశారు. సుమారు 8,000 నుంచి 10,000 మంది వరకు ఈ విందులో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
    1
    హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతంలో ఎమ్మెల్యే  మాజీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసదుద్దీన్ ఓవైసీ తో పాటు భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు, స్థానిక ప్రజలు పాల్గొని సామూహికంగా ఇఫ్తార్ చేశారు. సుమారు 8,000 నుంచి 10,000 మంది వరకు ఈ విందులో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • గజ్వేల్, సిద్దిపేట జిల్లా 13 మార్చి 2026 : ప్రజా తెలంగాణ న్యూస్/ రామాయణ రచయిత్రి, తొలి తెలుగు కవియిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని ఆమె విగ్రహానికి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్ మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే 14వ వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలుగు సాహితీ వనంలో మొల్లమాంబ అజరామరమైన ముద్ర వేశారని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ, తన ప్రతిభతో రామాయణాన్ని సరళమైన తెలుగులో అందించిన ఆమె స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా లోకానికి ఆమె ఒక మార్గదర్శి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షులు మోహన్నగారి రాజు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, చిట్కుల శివారెడ్డి, శేఖర్, కుమ్మర సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్, సిద్దిపేట జిల్లా 13 మార్చి 2026 : ప్రజా తెలంగాణ న్యూస్/
రామాయణ రచయిత్రి, తొలి తెలుగు కవియిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని ఆమె విగ్రహానికి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్ మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే  14వ వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలుగు సాహితీ వనంలో మొల్లమాంబ అజరామరమైన ముద్ర వేశారని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ, తన ప్రతిభతో రామాయణాన్ని సరళమైన తెలుగులో అందించిన ఆమె స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా లోకానికి ఆమె ఒక మార్గదర్శి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షులు మోహన్నగారి రాజు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, చిట్కుల శివారెడ్డి, శేఖర్, కుమ్మర సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • పత్రిక ప్రకటన తేది:13.03.2026 కామారెడ్డి జిల్లా శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం అడ్లూర్–ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ అధికారుల ద్వారా అడ్లూర్ శివారులో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేసి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హైవే పైన ఉన్న అన్ని డాబా హోటళ్లకు పంచాయతీ కార్యదర్శులు (PSs) నోటీసులు జారీ చేసి, వారికి సంబంధిత లైసెన్సులు ఉన్నాయా లేదా, అలాగే నేషనల్ హైవే అధికారుల అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాలను పరిశీలించాలని ఆదేశించారు. కలెక్టర్ గారి అప్పీల్: ప్రయాణికులు , ప్రజలు నేషనల్ హైవే పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, ఫుడ్ వేస్టేజ్, పేపర్ వేస్టేజ్ వంటి చెత్తను వేయకుండా రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గవిజ్ఞప్తి చేశారు. ఈ దిశగా గ్రామపంచాయతీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లను పంచాయతీ కార్యదర్శులు (PS), ఎంపీఓ (MPO), ఎంపీడీవో (MPDO)లు సంయుక్తంగా తనిఖీ చేసి, నేషనల్ హైవే అనుమతులు , గ్రామపంచాయతీ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని ఆదేశించారు. హోటళ్ల నుండి వచ్చే చెత్తను రోడ్డుపై వేస్తే సంబంధిత గ్రామపంచాయతీలు అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని కలెక్టర్ ఆదేశించారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది:13.03.2026
కామారెడ్డి జిల్లా శుక్రవారం
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం అడ్లూర్–ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ అధికారుల ద్వారా అడ్లూర్ శివారులో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేసి తగు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హైవే పైన ఉన్న అన్ని డాబా హోటళ్లకు పంచాయతీ కార్యదర్శులు (PSs) నోటీసులు జారీ చేసి, వారికి సంబంధిత లైసెన్సులు ఉన్నాయా లేదా, అలాగే నేషనల్ హైవే అధికారుల అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాలను పరిశీలించాలని ఆదేశించారు.
కలెక్టర్ గారి అప్పీల్:
ప్రయాణికులు , ప్రజలు నేషనల్ హైవే పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, ఫుడ్ వేస్టేజ్, పేపర్ వేస్టేజ్ వంటి చెత్తను వేయకుండా రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గవిజ్ఞప్తి చేశారు. ఈ దిశగా గ్రామపంచాయతీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లను పంచాయతీ కార్యదర్శులు (PS), ఎంపీఓ (MPO), ఎంపీడీవో (MPDO)లు సంయుక్తంగా తనిఖీ చేసి, నేషనల్ హైవే అనుమతులు , గ్రామపంచాయతీ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని ఆదేశించారు. హోటళ్ల నుండి వచ్చే చెత్తను రోడ్డుపై వేస్తే సంబంధిత గ్రామపంచాయతీలు అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని కలెక్టర్  ఆదేశించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
    1
    ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ  మన జిల్లాలో  03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై  ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    14 hrs ago
  • మెదక్ జిల్లా Shivampet Mandal లోని అల్లీపూర్, లింగోజీగూడ, కొత్తపేట్, పిల్లుట్ల, పాలు గ్రామాల్లో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణలో వార్డు సభ్యులకు పంచాయతీ విధులు, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు గురించి అవగాహన కల్పించబడింది. మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డు సభ్యులతో సమన్వయం కోసం సూచనలు చేశారు.
    1
    మెదక్ జిల్లా Shivampet Mandal లోని అల్లీపూర్, లింగోజీగూడ, కొత్తపేట్, పిల్లుట్ల, పాలు గ్రామాల్లో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణలో వార్డు సభ్యులకు పంచాయతీ విధులు, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు గురించి అవగాహన కల్పించబడింది. మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డు సభ్యులతో సమన్వయం కోసం సూచనలు చేశారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    23 hrs ago
  • మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన *రామయంపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత గారు* యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి వివరిస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.
    1
    మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన *రామయంపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత గారు* యోగ  ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి వివరిస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    21 hrs ago
  • పత్రిక ప్రకటన తేది:13.03.2026 కామారెడ్డి జిల్లా శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పంచాయితీ, మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమం లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని టెక్రియాల్ చెరువు వద్ద నిర్వహిస్తున్న శానిటేషన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. అనంతరం సదాశివ నగర్ – క్రుప్రియల్ హైవే ఇరుపక్కల జరుగుతున్న శానిటేషన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. టెక్రియాల్ చెరువులో గణేష్, దుర్గాదేవి నిమజ్జనం జరిగిన ప్రదేశాలలో చెరువు పరిసర ప్రాంతాల్లో శుభ్రతను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు చెరువు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, శానిటేషన్ పనులు పూర్తి చేసి, ఈరోజు సాయంత్రం లోపు ఆ ప్రాంతాన్ని సమతలంగా (లెవెల్) చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం , పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడాలని ప్రజాప్రతినిధులు పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది:13.03.2026
కామారెడ్డి జిల్లా శుక్రవారం
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా  పంచాయితీ, మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమం లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని టెక్రియాల్ చెరువు వద్ద  నిర్వహిస్తున్న శానిటేషన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.
అనంతరం సదాశివ నగర్ – క్రుప్రియల్ హైవే ఇరుపక్కల జరుగుతున్న శానిటేషన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.   
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
టెక్రియాల్ చెరువులో గణేష్,  దుర్గాదేవి నిమజ్జనం జరిగిన ప్రదేశాలలో  చెరువు పరిసర ప్రాంతాల్లో శుభ్రతను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు చెరువు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, శానిటేషన్ పనులు పూర్తి చేసి, ఈరోజు సాయంత్రం లోపు ఆ ప్రాంతాన్ని సమతలంగా (లెవెల్) చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల ఆరోగ్యం , పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడాలని ప్రజాప్రతినిధులు  పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ తెలిపారు.  ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.