గద్వాలలోని రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న...గొంగళ్ల రంజిత్కుమార్ గద్వాల: రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ గొంగళ్ల రంజిత్కుమార్ ఆరోపించారు. ఇది రైతుల సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వం కాదని, రైతు దగా ప్రభుత్వమని ఆయన విమర్శించారు. గద్వాల అగ్రహారం సమీపంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులతో కలిసి 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ శాఖ ఎస్.ఈ గారికి వినతి పత్రం అందజేసి తక్షణమే కరెంట్ కోతల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ... రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా అందించడం లేదని ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో ఓల్టేజీ కారణంగా రైతుల వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని, దీంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. రాత్రి వేళల్లో విద్యుత్ కోసం పొలాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందకపోవడంతో పంటల దిగుబడిపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం గతంలో అమలు చేసిన రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమా ప్రీమియం చెల్లింపులో నిర్లక్ష్యం చేయడం వల్ల రైతు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ అనేక మంది రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కోరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి కేవలం అభివృద్ధి పేరుతో పార్టీలు మారడం తప్పా తన అధికారం,సంపాధనం పై ఉన్న ధ్యాస గద్వాల నియోజకవర్గ అభివృద్ధి,సంక్షేమంపై ఏమాత్రం ధ్యాస లేదని విమర్శించారు. గద్వాలలో అధికారిక పార్టీలో రెండు పవర్ సెంటర్లు ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రైతుల సమస్యలు, విద్యుత్ సమస్యలపై పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాలు చీకట్లలో ఉన్నప్పటికీ పాలకులు మాత్రం వెలుగుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగించడం ప్రజా వ్యతిరేక విధానమని విమర్శించారు. రైతుల మోటార్లు కాలిపోవడం, లోఓల్టేజీ, విద్యుత్ కోతలతో రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో రైతులను, ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ వారి తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బుచ్చిబాబు, రంగస్వామి, వెంకట్రాములు, విష్ణు, గోవిందు, బలరాం నాయుడు,రవి,సలీం,సుభాష్, లక్ష్మన్న, గోపాల్,మీసాల కిష్టన్న, చిన్న రాముడు, జమ్మన్న,విజయ్,భీమన్ గౌడ్,దయాకర్, వెంకటేష్,అమ్రేష్, వాసు, నర్సింహా,సర్వేష్,రాము, మల్దకల్, ఆంజనేయులు,కార్యకర్తలు, రైతులు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గద్వాలలోని రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న...గొంగళ్ల రంజిత్కుమార్ గద్వాల: రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ గొంగళ్ల రంజిత్కుమార్ ఆరోపించారు. ఇది రైతుల సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వం కాదని, రైతు దగా ప్రభుత్వమని ఆయన విమర్శించారు. గద్వాల అగ్రహారం సమీపంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులతో కలిసి 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ శాఖ ఎస్.ఈ గారికి వినతి పత్రం అందజేసి తక్షణమే కరెంట్ కోతల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ... రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా అందించడం లేదని ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో ఓల్టేజీ కారణంగా రైతుల వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని, దీంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. రాత్రి వేళల్లో విద్యుత్ కోసం పొలాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందకపోవడంతో పంటల దిగుబడిపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం గతంలో అమలు చేసిన రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమా ప్రీమియం చెల్లింపులో నిర్లక్ష్యం చేయడం వల్ల రైతు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ అనేక మంది రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కోరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి కేవలం అభివృద్ధి పేరుతో పార్టీలు మారడం తప్పా తన అధికారం,సంపాధనం పై ఉన్న ధ్యాస గద్వాల నియోజకవర్గ అభివృద్ధి,సంక్షేమంపై ఏమాత్రం ధ్యాస లేదని విమర్శించారు. గద్వాలలో అధికారిక పార్టీలో రెండు పవర్ సెంటర్లు ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రైతుల సమస్యలు, విద్యుత్ సమస్యలపై పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాలు చీకట్లలో ఉన్నప్పటికీ పాలకులు మాత్రం వెలుగుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగించడం ప్రజా వ్యతిరేక విధానమని విమర్శించారు. రైతుల మోటార్లు కాలిపోవడం, లోఓల్టేజీ, విద్యుత్ కోతలతో రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో రైతులను, ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ వారి తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బుచ్చిబాబు, రంగస్వామి, వెంకట్రాములు, విష్ణు, గోవిందు, బలరాం నాయుడు,రవి,సలీం,సుభాష్, లక్ష్మన్న, గోపాల్,మీసాల కిష్టన్న, చిన్న రాముడు, జమ్మన్న,విజయ్,భీమన్ గౌడ్,దయాకర్, వెంకటేష్,అమ్రేష్, వాసు, నర్సింహా,సర్వేష్,రాము, మల్దకల్, ఆంజనేయులు,కార్యకర్తలు, రైతులు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం (పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు. జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు. ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.2
- రైతులకు శుభవార్త తెలంగాణలో సెప్టెంబర్ 19న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది1
- సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో ఎంత ఉందొ మొత్తం లెక్కలు వొస్తాయి.. ఎలా సంపాదించావు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.1
- ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం 🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙1
- జీఎన్ఆర్ హాస్పిటల్లో ఘనంగా అన్నదాన వితరణ వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.4
- ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రూ.35 లక్షల జంబో షెడ్కు శంకుస్థాపన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.35 లక్షలతో జంబో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన1
- మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కౌంటర్ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, పార్టీ నాయకులు స్పందించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రశ్నించడం సరికాదని, సామాజిక న్యాయానికి కూటమి కట్టుబడి ఉందన్నారు.1
- సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు4