logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదిలాబాద్ లోని బంగారిగూడకు చెందిన పాత నేరస్థుడు కదీమ్ ఖాన్ పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. నిందితుడు హత్యలు, చోరీలు, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. కదీమ్ ఖాన్ పై వన్ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లలో 25 కేసులు ఉన్నాయని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

2 hrs ago
user_Mallaiah Potta
Mallaiah Potta
Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
2 hrs ago
5677c0c6-179f-40dc-8f39-95ff365b1c89

ఆదిలాబాద్ లోని బంగారిగూడకు చెందిన పాత నేరస్థుడు కదీమ్ ఖాన్ పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. నిందితుడు హత్యలు, చోరీలు, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. కదీమ్ ఖాన్ పై వన్ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లలో 25 కేసులు ఉన్నాయని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

More news from Telangana and nearby areas
  • భారతదేశపు స్వదేశీ శాటిలైట్ ఆధారిత వ్యవస్థ అయిన 'గగన్' (GAGAN - GPS Aided GEO Augmented Navigation) ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మరియు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ వ్యవస్థ జీపీఎస్ (GPS) ఖచ్చితత్వాన్ని పెంపొందిస్తుంది మరియు విమానాల సురక్షిత నావిగేషన్ కోసం నమ్మకమైన సమాచారాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ధృవీకరించబడిన ఈ 'గగన్' వ్యవస్థ, ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్‌కు మద్దతు ఇవ్వడమే కాకుండా, విమానయాన రంగానికి వెలుపల ఉన్న ఇతర రంగాలకు కూడా తన సేవలను అందిస్తుంది.
    1
    భారతదేశపు స్వదేశీ శాటిలైట్ ఆధారిత వ్యవస్థ అయిన 'గగన్' (GAGAN - GPS Aided GEO Augmented Navigation) ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మరియు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ వ్యవస్థ జీపీఎస్ (GPS) ఖచ్చితత్వాన్ని పెంపొందిస్తుంది మరియు విమానాల సురక్షిత నావిగేషన్ కోసం నమ్మకమైన సమాచారాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ధృవీకరించబడిన ఈ 'గగన్' వ్యవస్థ, ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్‌కు మద్దతు ఇవ్వడమే కాకుండా, విమానయాన రంగానికి వెలుపల ఉన్న ఇతర రంగాలకు కూడా తన సేవలను అందిస్తుంది.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    4 hrs ago
  • ప్రభుత్వం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక కాలనీని ఎంచుకుని, సొసైటీ స్థాపకుడు ఇర్షాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ఫారాలను పూర్తి చేయిస్తున్నారు. ఓటర్లు తమ సరైన ధ్రువపత్రాలను పరిశీలించుకుని, అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఇర్షాన్, ఫహీమ్, ఆఫ్రిన్, మహీం, రజాక్ తదితరులు పాల్గొంటున్నారు.
    1
    ప్రభుత్వం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక కాలనీని ఎంచుకుని, సొసైటీ స్థాపకుడు ఇర్షాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ఫారాలను పూర్తి చేయిస్తున్నారు.

ఓటర్లు తమ సరైన ధ్రువపత్రాలను పరిశీలించుకుని, అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఇర్షాన్, ఫహీమ్, ఆఫ్రిన్, మహీం, రజాక్ తదితరులు పాల్గొంటున్నారు.
    user_SIDDU.ASR
    SIDDU.ASR
    నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలో ఆదివారం నిర్వహించిన అఖిల భారత విశ్వకర్మ మహాసభలో ఆ సంఘం అధ్యక్షులు కౌలే జగన్నాథం పాల్గొని మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులు చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మహాసభలో విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు చర్చించారు. విశ్వబ్రాహ్మణులు చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణిస్తేనే అభివృద్ధి సాధ్యమని జగన్నాథం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు.
    1
    మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలో ఆదివారం నిర్వహించిన అఖిల భారత విశ్వకర్మ మహాసభలో ఆ సంఘం అధ్యక్షులు కౌలే జగన్నాథం పాల్గొని మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులు చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ మహాసభలో విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు చర్చించారు. విశ్వబ్రాహ్మణులు చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణిస్తేనే అభివృద్ధి సాధ్యమని జగన్నాథం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రధాన రాజగోపురం తొలగింపు పనులను ప్రారంభించగా, ప్రస్తుతం గర్భగుడి పరిసరాలు మరియు పాత గోపురాల కూల్చివేత పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. శృంగేరి పీఠాధిపతుల ఆదేశాల మేరకు, సంప్రదాయ శిల్పకళకు అనుగుణంగా ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టడం విశేషం. ఈ నిర్మాణ పనుల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సూర్యమనేని సునంద్, పద్మ ప్రియ దంపతులు సుమారు 31 కోట్ల రూపాయలకు పైగా సొంత నిధులతో అమ్మవారి ఆలయ గర్భగుడి పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ చేశారు. గర్భగుడి నిర్మాణం పూర్తయిన తర్వాత, రెండవ విడతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమారు ₹225 కోట్ల నిధులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. దీని ద్వారా బాసర క్షేత్రం మరింత అభివృద్ధి పథంలోకి అడుగులు వేయనుంది. ఈ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈఓ శ్రీనివాస్ నిరంతరం అభివృద్ధి పనులను సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో అవసరమైన సూచనలు అందిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.
    1
    తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రధాన రాజగోపురం తొలగింపు పనులను ప్రారంభించగా, ప్రస్తుతం గర్భగుడి పరిసరాలు మరియు పాత గోపురాల కూల్చివేత పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. శృంగేరి పీఠాధిపతుల ఆదేశాల మేరకు, సంప్రదాయ శిల్పకళకు అనుగుణంగా ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టడం విశేషం. ఈ నిర్మాణ పనుల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన సూర్యమనేని సునంద్, పద్మ ప్రియ దంపతులు సుమారు 31 కోట్ల రూపాయలకు పైగా సొంత నిధులతో అమ్మవారి ఆలయ గర్భగుడి పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ చేశారు. గర్భగుడి నిర్మాణం పూర్తయిన తర్వాత, రెండవ విడతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమారు ₹225 కోట్ల నిధులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. దీని ద్వారా బాసర క్షేత్రం మరింత అభివృద్ధి పథంలోకి అడుగులు వేయనుంది.

ఈ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈఓ శ్రీనివాస్ నిరంతరం అభివృద్ధి పనులను సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో అవసరమైన సూచనలు అందిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    15 hrs ago
  • బోధన్ పట్టణంలో ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంతలో మరోసారి తాయ్ బజారీ వసూళ్ల పేరుతో ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గ్రామాల నుంచి కూరగాయలు అమ్మేందుకు వచ్చిన రైతులు, వ్యాపారుల వాహనాలను రోడ్డుపైనే ఆపి వసూళ్లు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పలుమార్లు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, వసూళ్లు చేస్తున్న సిబ్బంది అతని సూచనలను పట్టించుకోకుండా ప్రధాన రహదారిపైనే తమ వసూళ్లను కొనసాగించారు. ఇది ఒక్కరోజు సమస్య కాదని, ప్రతి ఆదివారం సంత రోజున ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్‌ను మున్సిపాలిటీ ఇచ్చినందున దాని అమలు, పర్యవేక్షణ కూడా అధికారుల బాధ్యతేనని వారు పేర్కొంటున్నారు. ప్రధాన రహదారిపైనే వాహనాలను ఆపి వసూళ్లు చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నప్పుడు, దీనికి బాధ్యత ఎవరిది? చట్టం సాధారణ ప్రజలకేనా? లేక టెండర్ పొందిన వారూ చట్టాన్ని పాటించాలా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లా పరిపాలన, మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపి, ప్రధాన రహదారిపై వసూళ్లను నిలిపివేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    బోధన్ పట్టణంలో ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంతలో మరోసారి తాయ్ బజారీ వసూళ్ల పేరుతో ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గ్రామాల నుంచి కూరగాయలు అమ్మేందుకు వచ్చిన రైతులు, వ్యాపారుల వాహనాలను రోడ్డుపైనే ఆపి వసూళ్లు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పలుమార్లు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, వసూళ్లు చేస్తున్న సిబ్బంది అతని సూచనలను పట్టించుకోకుండా ప్రధాన రహదారిపైనే తమ వసూళ్లను కొనసాగించారు. ఇది ఒక్కరోజు సమస్య కాదని, ప్రతి ఆదివారం సంత రోజున ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్‌ను మున్సిపాలిటీ ఇచ్చినందున దాని అమలు, పర్యవేక్షణ కూడా అధికారుల బాధ్యతేనని వారు పేర్కొంటున్నారు.

ప్రధాన రహదారిపైనే వాహనాలను ఆపి వసూళ్లు చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నప్పుడు, దీనికి బాధ్యత ఎవరిది? చట్టం సాధారణ ప్రజలకేనా? లేక టెండర్ పొందిన వారూ చట్టాన్ని పాటించాలా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లా పరిపాలన, మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపి, ప్రధాన రహదారిపై వసూళ్లను నిలిపివేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి హాతియా పాతియా అసోసియేషన్ క్రీడల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెవల్యూషన్ స్కూల్ విద్యార్థినులు అద్భుత ప్రదర్శన కనబరిచి, మూడవ విజేతలుగా నిలిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ జట్టులో రెవల్యూషన్ స్కూల్ విద్యార్థినులు ఆర్. జశ్విత, ఆర్. రిషిక, జె. మనస్విక, బి. సోనికలతో పాటు మరికొన్ని విద్యాసంస్థల విద్యార్థులు కూడా జట్టుగా పాల్గొని ఈ ఘనత సాధించారు. చాలా తక్కువ సమయంలోనే విద్యార్థినులకు కఠోర సాధన చేయించి, వారిని విజేతలుగా తీర్చిదిద్దిన రెవల్యూషన్ స్కూల్ పీటీ టీచర్లు అశ్విని మేడం మరియు వెంకటేష్ సార్‌ల కృషి ఎంతో అభినందనీయం. ఈ ఘన విజయం సాధించిన విద్యార్థినులను, పీటీ టీచర్లను రెవల్యూషన్ స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
    1
    సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి హాతియా పాతియా అసోసియేషన్ క్రీడల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెవల్యూషన్ స్కూల్ విద్యార్థినులు అద్భుత ప్రదర్శన కనబరిచి, మూడవ విజేతలుగా నిలిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ జట్టులో రెవల్యూషన్ స్కూల్ విద్యార్థినులు ఆర్. జశ్విత, ఆర్. రిషిక, జె. మనస్విక, బి. సోనికలతో పాటు మరికొన్ని విద్యాసంస్థల విద్యార్థులు కూడా జట్టుగా పాల్గొని ఈ ఘనత సాధించారు.

చాలా తక్కువ సమయంలోనే విద్యార్థినులకు కఠోర సాధన చేయించి, వారిని విజేతలుగా తీర్చిదిద్దిన రెవల్యూషన్ స్కూల్ పీటీ టీచర్లు అశ్విని మేడం మరియు వెంకటేష్ సార్‌ల కృషి ఎంతో అభినందనీయం. ఈ ఘన విజయం సాధించిన విద్యార్థినులను, పీటీ టీచర్లను రెవల్యూషన్ స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఉదయం వేళ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతలకు కూడా అర్చకులు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం పూజా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన మహా లింగార్చనలో భక్తులు, అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో 365 జ్యోతులను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో జరిగిన ఈ విశేష పూజా కార్యక్రమాలన్నింటినీ ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా పూర్తి చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఉదయం వేళ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతలకు కూడా అర్చకులు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.

సాయంత్రం పూజా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన మహా లింగార్చనలో భక్తులు, అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో 365 జ్యోతులను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో జరిగిన ఈ విశేష పూజా కార్యక్రమాలన్నింటినీ ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా పూర్తి చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలలో జరిపిన పర్యటనలు ఆయా దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేశాయి. ఈ పర్యటనల ద్వారా వ్యాపారం, సాంకేతికత, రక్షణ మరియు విద్యా రంగాల వంటి వివిధ రంగాలలో పరస్పర సహకారం విస్తృతమైంది. తద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శ్రేయస్సు, భద్రత మరియు స్థిరత్వం కోసం ఉద్దేశించిన ఒక ఉమ్మడి దృక్పథాన్ని ఈ పర్యటనలు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాయి.
    1
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలలో జరిపిన పర్యటనలు ఆయా దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేశాయి. ఈ పర్యటనల ద్వారా వ్యాపారం, సాంకేతికత, రక్షణ మరియు విద్యా రంగాల వంటి వివిధ రంగాలలో పరస్పర సహకారం విస్తృతమైంది. తద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శ్రేయస్సు, భద్రత మరియు స్థిరత్వం కోసం ఉద్దేశించిన ఒక ఉమ్మడి దృక్పథాన్ని ఈ పర్యటనలు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాయి.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.