Arrive Alive” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విస్తృత రోడ్డు భద్రత అవగాహన*మరియు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు జగిత్యాల జిల్లా…ట్రాఫిక్ నియమాలపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం* *“Arrive Alive” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విస్తృత రోడ్డు భద్రత అవగాహన* చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అలవరచుకోవడం ద్వారా బాధ్యతాయుత పౌరులుగా ఎదగవచ్చనే లక్ష్యంతో “Arrive Alive” కార్యక్రమం కింద జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆదేశాల మేరకు మూడవ రోజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ద్వారా తల్లిదండ్రుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు “డియర్ పేరెంట్స్, ప్లీజ్ బై ఏ హెల్మెట్ ఫర్ మీ అండ్ మామ్” అనే సందేశంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు హెల్మెట్ కొనివ్వమని లేఖలు రాయడం ద్వారా కుటుంబ స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించవచ్చని సూచించారు.అలాగే విద్యార్థులకు రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, స్కూల్కు వెళ్లే సమయంలో ఇరుపక్కల చూసుకుని జాగ్రత్తగా దాటడం, స్కూల్ బస్సులో ఎక్కడం, దిగడం సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం వంటి అలవాట్లు నిత్యజీవితంలో పాటించాలని సూచించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియజేయాలని కోరారు ఇలాంటి కార్యక్రమాల వలన రోడ్డు భద్రత పై పిల్లల ద్వారా సంరక్షకులకు గుణపాఠంగా కూడా ఉంటుందని మరియు నేడు చేపట్టిన కార్యక్రమాలను పిల్లలు తమ భవిష్యత్తులో కూడా గుర్తుంచుకుంటారని తెలియజేశారు. రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాల పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Arrive Alive” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విస్తృత రోడ్డు భద్రత అవగాహన*మరియు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు జగిత్యాల జిల్లా…ట్రాఫిక్ నియమాలపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం* *“Arrive Alive” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విస్తృత రోడ్డు భద్రత అవగాహన* చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అలవరచుకోవడం ద్వారా బాధ్యతాయుత పౌరులుగా ఎదగవచ్చనే లక్ష్యంతో “Arrive Alive” కార్యక్రమం కింద జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆదేశాల మేరకు మూడవ రోజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ద్వారా తల్లిదండ్రుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు “డియర్ పేరెంట్స్, ప్లీజ్ బై ఏ హెల్మెట్ ఫర్ మీ అండ్ మామ్” అనే సందేశంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు హెల్మెట్
కొనివ్వమని లేఖలు రాయడం ద్వారా కుటుంబ స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించవచ్చని సూచించారు.అలాగే విద్యార్థులకు రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, స్కూల్కు వెళ్లే సమయంలో ఇరుపక్కల చూసుకుని జాగ్రత్తగా దాటడం, స్కూల్ బస్సులో ఎక్కడం, దిగడం సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం వంటి అలవాట్లు నిత్యజీవితంలో పాటించాలని సూచించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియజేయాలని కోరారు ఇలాంటి కార్యక్రమాల వలన రోడ్డు భద్రత పై పిల్లల ద్వారా సంరక్షకులకు గుణపాఠంగా కూడా ఉంటుందని మరియు నేడు చేపట్టిన కార్యక్రమాలను పిల్లలు తమ భవిష్యత్తులో కూడా గుర్తుంచుకుంటారని తెలియజేశారు. రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాల పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
- Post by Rajitha Antharpula9
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని నియోజకవర్గ సాధన కమిటీ కన్వీనర్ చుంచు రాజ్ కిరణ్ అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఇంటర్ పరీక్షలో టాపర్గా నిలిచిన అక్కల సాయి త్రినితను ఆయన కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కానగంటి మధు, మాజీ ఎంపీటీసీ తోట మోహన్, వల్లంబట్ల శ్రీనివాస్ బిళ్ళకూరి రమేష్ చుంచు గిరిధర్, గొల్ల రాయమల్లు, అంకతి గంగాధర్, చెలిగంటి మల్లేష్, గూడెం, గ్రామస్తులు పాల్గొన్నారు..1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉద్రిక్తత బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మృతి చెందిన శ్రావణి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ... బీసీ హాస్టల్లో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. హాస్టల్లో మృతి చెందిన బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు శ్రావణి కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ శ్రేణులను, అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.1
- ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- Post by Rajitha Antharpula1