Shuru
Apke Nagar Ki App…
యలమలకుదురు శివాలయంలో హుండీ దొంగతనం.. పోలీసుల దర్యాప్తు
Arja Durga Prasad
యలమలకుదురు శివాలయంలో హుండీ దొంగతనం.. పోలీసుల దర్యాప్తు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Arja Durga Prasad1
- గుంటూరు.. *కవరేజ్ కు వెళ్లిన మీడియా పై దాడి..* గుంటూరు లాలా పేట లో బంగారు షాపుల పై BIS అధికారులు తనిఖీలు. సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన BIS అధికారులు. తనిఖీలు నేపథ్యంలో కవరేజ్ కు వెళ్లిన మీడియా పై షాప్ నిర్వాహకులు దాడి. మా షాప్ లో ఎలా వస్తారంటూ పరుషపదజాలంతో దూసుకొచ్చిన షాప్ నిర్వాహకుడు. కవరేజ్ చేస్తే ఊరుకోనంటూ కెమెరాలను ధ్వసం చేయడానికి యత్నం. షాప్ నిర్వాహకుడు తీరు పై పోలీసులకు సమాచారం అందించిన అధికారులు.1
- నల్లజర్ల మండలం చీపురుగూడెంలో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మృతి చెందిన జర్నలిస్టు డేగల చినబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కు అందజేత ఇటీవల మృతి చెందిన ఏబీఎన్ అన్నవరం రిపోర్టర్ డేగల చినబాబు కుటుంబానికి జర్నలిస్టుల ఫెడరేషన్ అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో చినబాబు కుటుంబ సభ్యులకు సోమవారం ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు చినబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చినబాబు మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్టకాలంలో జర్నలిస్టుల ఫెడరేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అధికార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చినబాబు జర్నలిజం రంగంలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను అందించడంలో ఆయన చూపిన కృషి ఇతర జర్నలిస్టులకు ఆదర్శమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని, జర్నలిస్టులు లేదా వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చినబాబు కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం పని ఒత్తిడితో జర్నలిజం వృత్తిని చేస్తున్న పలువురు అకస్మాత్తుగా మరణిస్తుండడంతో వారి కుటుంబాలు వీధిని పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ సందర్భంగా చినబాబు కుటుంబ సభ్యులు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టుల సంఘం అండగా నిలవడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పుర్రె త్రినాథ్, కే.వి.సత్యనారాయణ, శ్రీధర్, ఎస్ కే ఇమ్రాన్, దుర్గా శ్రీనివాస్, స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రమణ, వెంకట్, ప్రసాద్, హరగోపాల్, ప్రవీణ్, లోవరాజు పడాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.6
- రెండో డివిజన్ మాచవరం కనపర్తి వెంకటస్వామి వీధిలో కొండపైన ప్రాంతంలో ఉన్న మంచినీళ్లు వాటర్ ట్యాంక్ ను గత 50 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది ఇదిలా ఉండగా గత 10-15 సంవత్సరాలుగా ట్యాంక్ శిధిలమైపోయింది అధికారులకు కంప్లైంట్ లు పెట్టగా అప్పుడు అప్పుడు వచ్చి రిపేర్లు చేసేవారు కానీ ఇప్పుడు వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలం అవడం వలన వాటర్ ట్యాంక్ లోను వాటర్ మొత్తం ఇళ్ళ మార్గంలో వెళ్ళటం వలన ఇళ్ల కింద ప్రవహించుటవలన ఇండ్ల క్రింది భాగము పూర్తిగా పాడైపోయి ఒక స్వర లాగా పడిపోయినది ఇదేలా ఉంటే రాబోవు రోజుల్లో వాటర్ ట్యాంక్ కింది భాగంలో ఉన్న ఇల్లు ఎప్పటికైన కూలిపోయే ప్రమాదము ఉన్నదని స్థానిక ప్రజలు మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ లు పెట్టిన రెండు చేతులెత్తి మొక్కిన ఉపయోగం లేకుండా పోతుంది కావున మీడియా వారు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా ఈ యొక్క వాటర్ ట్యాంక్ కింద భాగంలో ప్రజలందరూ కూడా కోరుకుంటూన్నారు అలాగే కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించుటకు పాత వాటర్ ట్యాంక్ ప్రక్కన ఎంతో కాళీ స్థలం ఉంది కావున ఆ యొక్క ఖాళీ స్థలంలో కొత్త వాటర్ ట్యాంక్ ని నిర్మించవలసినదిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు వాటర్ ట్యాంక్ చెత్తాచెదారాలతో నిండిపోయి ఉన్నది దాని మూలాన పాములు పురుగు పుట్ట బాగా ఎల్లలోకి వస్తున్నాయని కూడా స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం వారానికి ఒకసారి అయినా వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల శుభ్రం చేయవలసినదిగా కోరుకుంటున్నారు పెద్ద పెద్ద పాములు మండ్రగబ్బలు తేళ్లు విష సర్పాలు ఎన్నో వస్తున్నాయని స్థానిక ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎంతో భయపడుతున్నారు అలాగే చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా వాటర్ ట్యాంక్ పై ఆడుకుంటున్నారు ప్రమాదవశాత్తు అందిట్లో పడిన ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అలాగే వాటర్ ట్యాంక్ ని కూడా బ్లీచింగ్ తో వారానికి ఒకసారి అన్న అడగవలసిన కోరుచున్నాను10
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులు కేటాయించబడగా, అందులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు, 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, తదుపరి రోజు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు.2
- ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.2
- *_జయహో భారత్_* *_టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ పై భారత్ విజయం_* *_97 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం_*1