మాజీ సర్పంచి కుమార్ పై చెప్పుతో దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి మరాఠీ కృష్ణమూర్తి జగదేవపూర్ మండలంలో వరసగా కులవివక్షత పై దాడులను ఖండిస్తున్నాం అంబేద్కర్ అవార్డు గ్రహీత మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ వరసగా మాదిగ కుటుంబాలపై దాడులను ఖండిస్తున్నాం కెవిపిఎస్ డివిజన్ అధ్యక్షుడు పోట్టోల్ల దాసు జగదేవపూర్ మే 10 జగదేవపూర్ మండలంలో జంగం రెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్ పై చెప్పుతో దాడి చేసిన వారిని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మాదిగ జర్నలిస్టు పోరం రాష్ట్ర కార్యదర్శి మరాఠీ కృష్ణమూర్తి, మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ డిమాండ్ చేశారు, కెవిపిఎస్ డివిజన్ అధ్యక్షులు పోట్టొల్ల దాసు. పంచాయతీ చర్చలకు పిలిచి కులం పేరుతో దూషిస్తూ దళిత మాజీ సర్పంచ్, వారి బంధువులపై అగ్రవర్ణ కులాలకు చెందిన కొందరు వ్యక్తులు చెప్పులతో దాడి చేసి కొట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా జంగం రెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో మొత్తం 130 కుటుంబాలు ఉండగా వారిలో అధికంగా ముదిరాజ్ కులానికి చెందినవారు వున్నారు. దళిత గ్రామ మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ఉండడం ముదిరాజ్ కులాలకు చెందిన వారికి నచ్చక ఇదివరకే మాజీ సర్పంచ్ పై దాడి చేశారు. పంచాయతీ చర్చలకు పిలిచి గ్రామ పెద్దల సమక్షంలోనే మాజీ సర్పంచ్ వారి బంధువులపై చెప్పులతో దాడి చేశారు. దళిత మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్ వారి బంధువులు జగదేవపూర్ పోలీస్ స్టేషన్లో నిందితులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మాదిగ జర్నలిస్టులో రాష్ట్ర కార్యదర్శి మరాఠి కృష్ణమూర్తి, అంబేద్కర్ అవార్డు గ్రహీత మాల మహానాడు జాతీయ నాయకుడు తుమ్మ శ్రీనివాస్, కెవిపిఎస్ గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు పోట్టొల్ల దాసు మాట్లాడుతూ జంగం రెడ్డిపల్లి గ్రామంలో ప్రజా ప్రతినిధి దళిత మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్, వారి బంధువులపై ముదిరాజ్ కులస్తులు చెప్పులతో దాడి చేసి కొట్టిన సంఘటన అమానుషమని అన్నారు. దళితులు రాజకీయంగా ఎదగడం ఓర్వలేక అగ్రవర్ణ కులస్తులు దళితులపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. జగదేవపూర్ మండలంలో ఇటీవల వరుసగా దళితులపై దాడులు జరుగుతున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో దళితులకు సముచిత న్యాయం కల్పిస్తామని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నాడని, జగదేవపూర్ మండలంలో వరుసగా దళితులపై జరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెప్తాడో వేచి చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్, సి పి గ్రామాన్ని సందర్శించి పౌర హక్కుల దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మాజీ సర్పంచి కుమార్ పై చెప్పుతో దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి మరాఠీ కృష్ణమూర్తి జగదేవపూర్ మండలంలో వరసగా కులవివక్షత పై దాడులను ఖండిస్తున్నాం అంబేద్కర్ అవార్డు గ్రహీత మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ వరసగా మాదిగ కుటుంబాలపై దాడులను ఖండిస్తున్నాం కెవిపిఎస్ డివిజన్ అధ్యక్షుడు పోట్టోల్ల దాసు జగదేవపూర్ మే 10 జగదేవపూర్ మండలంలో జంగం రెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్ పై చెప్పుతో దాడి చేసిన వారిని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మాదిగ జర్నలిస్టు పోరం రాష్ట్ర కార్యదర్శి మరాఠీ కృష్ణమూర్తి, మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ డిమాండ్ చేశారు, కెవిపిఎస్ డివిజన్ అధ్యక్షులు పోట్టొల్ల దాసు. పంచాయతీ చర్చలకు పిలిచి కులం పేరుతో దూషిస్తూ దళిత మాజీ సర్పంచ్, వారి బంధువులపై అగ్రవర్ణ కులాలకు చెందిన కొందరు వ్యక్తులు చెప్పులతో దాడి చేసి కొట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా జంగం రెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో మొత్తం 130 కుటుంబాలు ఉండగా వారిలో అధికంగా ముదిరాజ్ కులానికి చెందినవారు వున్నారు. దళిత గ్రామ మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ఉండడం ముదిరాజ్ కులాలకు చెందిన వారికి నచ్చక ఇదివరకే మాజీ సర్పంచ్ పై దాడి చేశారు. పంచాయతీ చర్చలకు పిలిచి గ్రామ పెద్దల సమక్షంలోనే మాజీ సర్పంచ్ వారి బంధువులపై చెప్పులతో దాడి చేశారు. దళిత మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్ వారి బంధువులు జగదేవపూర్ పోలీస్ స్టేషన్లో నిందితులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మాదిగ జర్నలిస్టులో రాష్ట్ర కార్యదర్శి మరాఠి కృష్ణమూర్తి, అంబేద్కర్ అవార్డు గ్రహీత మాల మహానాడు జాతీయ నాయకుడు తుమ్మ శ్రీనివాస్, కెవిపిఎస్ గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు పోట్టొల్ల దాసు మాట్లాడుతూ జంగం రెడ్డిపల్లి గ్రామంలో ప్రజా ప్రతినిధి దళిత మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్, వారి బంధువులపై ముదిరాజ్ కులస్తులు చెప్పులతో దాడి చేసి కొట్టిన సంఘటన అమానుషమని అన్నారు. దళితులు రాజకీయంగా ఎదగడం ఓర్వలేక అగ్రవర్ణ కులస్తులు దళితులపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. జగదేవపూర్ మండలంలో ఇటీవల వరుసగా దళితులపై దాడులు జరుగుతున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో దళితులకు సముచిత న్యాయం కల్పిస్తామని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నాడని, జగదేవపూర్ మండలంలో వరుసగా దళితులపై జరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెప్తాడో వేచి చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్, సి పి గ్రామాన్ని సందర్శించి పౌర హక్కుల దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- సికింద్రాబాద్లోని జవహర్నగర్లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.1
- తెలంగాణ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బూతు పురాణంతో వార్తల్లో నిలిచారు. అధికారం రాగానే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.1
- నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి:బీజేపీ ఎంపీ బండి సంజయ్ నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాలను బిజెపి కార్యకర్తలు ప్రజలు నమ్మవద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సామాన్యంగా కార్యకర్తగా కాషాయం జెండాను భుజంపై ఎత్తుకొని కేంద్రమంత్రి అయ్యానని కాలర్ ఎగర వేసుకొని నేను బిజెపి కార్యకర్తలు అని చెప్పుకుంటానని తెలిపారు. తండ్రుల పేర్లు చెప్పి నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.1
- నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము1
- కేంద్ర సహాయ శాఖ హోంమంత్రి బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి.. బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. మదర్స్ డే రోజున హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాధానం చెప్పాలని అన్నారు.మోడీ ప్రసంగం ప్రారంభించక ముందే బండి సంజయ్ను పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ప్రజలు ప్రధాని మాటలను పట్టించుకోరనివ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రేవంత్ రెడ్డి హోంమంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఒక మైనర్ బాలిక ఎఫ్ఐఆర్ నమోదు కోసం గంటల తరబడి పోలీస్ స్టేషన్లో వేచి ఉండాల్సి రావడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు.మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఉపయోగపడే ఒక్క మాట కూడా బండి సంజయ్ మాట్లాడలేదని, రేవంత్ రెడ్డి ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణపై ప్రధాని మోదీకి ప్రేమ లేదని, విభజన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.1