logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుంటూరు జిల్లా పోలీస్... నగరంపాలెం పోలీస్ స్టేషన్ _*//నగరంపాలెం పోలీస్ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*_ 📍పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాటసారులు మరియు వాహనదారుల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు ఈ రోజు (16.04.2026) సాయంత్రం ప్రారంభించారు. 📍ఈ చలివేంద్రాన్ని నగరంపాలెం సీఐ శ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, దాత శ్రీ మల్లిఖార్జున రావు గారి సహకారంతో ఏర్పాటు చేశారు. 📍ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ..., ప్రస్తుతం ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిత్యం బహిరంగంగా పనిచేసే శ్రామికులు మరియు ప్రయాణికులు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రద్దీగా ఉండే నగరంపాలెం ప్రాంతంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. 📍చలివేంద్రం ఏర్పాటు కోసం ముందుకు వచ్చి సహకరించిన దాత శ్రీ మల్లిఖార్జున రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన నగరంపాలెం సీఐ శ్రీ సత్యనారాయణ గారిని అభినందించారు. 📍పోలీసు శాఖ ఎప్పుడూ ప్రజా సేవలో ముందుండి పనిచేస్తుందని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఇటువంటి మానవీయ సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం ఆనందదాయకమని ఎస్పీ గారు పేర్కొన్నారు. 👉ఈ కార్యక్రమంలో వెస్ట్ సబ్ డివిజన్ ఇంచార్జి డీఎస్పీ శ్రీ బెల్లం శ్రీనివాస్ గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఇంజినీర్ శ్రీ రవికుమార్ గారు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీ ఆళ్ల హరి గారు, ఇతర ప్రముఖులు, పోలీసు సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

15 hrs ago
user_Journalist SIDDHU
Journalist SIDDHU
Guntur, Andhra Pradesh•
15 hrs ago
c670342c-9db6-4e4c-a099-02c3f73b8759

గుంటూరు జిల్లా పోలీస్... నగరంపాలెం పోలీస్ స్టేషన్ _*//నగరంపాలెం పోలీస్ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*_ 📍పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాటసారులు మరియు వాహనదారుల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు ఈ రోజు (16.04.2026) సాయంత్రం ప్రారంభించారు. 📍ఈ చలివేంద్రాన్ని నగరంపాలెం సీఐ శ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, దాత శ్రీ

86c56a63-9bb1-45c5-9771-65688347150a

మల్లిఖార్జున రావు గారి సహకారంతో ఏర్పాటు చేశారు. 📍ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ..., ప్రస్తుతం ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిత్యం బహిరంగంగా పనిచేసే శ్రామికులు మరియు ప్రయాణికులు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రద్దీగా ఉండే నగరంపాలెం ప్రాంతంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. 📍చలివేంద్రం ఏర్పాటు కోసం ముందుకు వచ్చి సహకరించిన దాత శ్రీ మల్లిఖార్జున రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన

5d35134b-393e-45dd-9889-6ea11f76b499

నగరంపాలెం సీఐ శ్రీ సత్యనారాయణ గారిని అభినందించారు. 📍పోలీసు శాఖ ఎప్పుడూ ప్రజా సేవలో ముందుండి పనిచేస్తుందని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఇటువంటి మానవీయ సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం ఆనందదాయకమని ఎస్పీ గారు పేర్కొన్నారు. 👉ఈ కార్యక్రమంలో వెస్ట్ సబ్ డివిజన్ ఇంచార్జి డీఎస్పీ శ్రీ బెల్లం శ్రీనివాస్ గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఇంజినీర్ శ్రీ రవికుమార్ గారు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీ ఆళ్ల హరి గారు, ఇతర ప్రముఖులు, పోలీసు సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • యుద్ధం వద్దు శాంతి ముద్దు విజయవాడ: ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది .ఈ ర్యాలీలో అమెరికా ఇరాన్ పై దాడులు చేయటం ఆపాలని, శాంతి నెలకొల్పాలని, చర్చలతో ముందుకు ముందుకు వెళ్లాలని ప్రజాసంఘాలు పిలుపు ఇచ్చాయి.
    1
    యుద్ధం వద్దు శాంతి ముద్దు 
విజయవాడ: ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది .ఈ ర్యాలీలో అమెరికా ఇరాన్ పై దాడులు చేయటం ఆపాలని, శాంతి నెలకొల్పాలని, చర్చలతో ముందుకు ముందుకు వెళ్లాలని ప్రజాసంఘాలు పిలుపు ఇచ్చాయి.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    15 min ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.
    1
    అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • ​మునగాల, సూర్యాపేట జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ఓ నిరుపేద మహిళను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సమక్షంలోనే బాధితురాలు పురుగుల మందు తాగడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ​అసలేం జరిగింది? ​మునగాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సభ జరుగుతుండగా, తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఒక్కసారిగా అధికారుల ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగింది. దీన్ని గమనించిన పోలీసులు, సిబ్బంది వెంటనే ఆమెను అడ్డుకుని చికిత్స నిమిత్తం హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ​బాధితురాలి ఆవేదన: ​తాడ్వాయి గ్రామాన్ని ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్ట్' కింద ఎంపిక చేసింది. బాధిత మహిళ సునీత తెలిపిన వివరాల ప్రకారం: ​తన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, అధికారులు కావాలని దాన్ని వేరొకరికి కేటాయించారు. ​కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ​పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, కలెక్టర్ ముందే తనువు చాలించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ​అధికారుల స్పందన: ​ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపులో ఏవైనా అక్రమలు జరిగాయా అనే కోణంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ​రాజకీయ కారణాలతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    1
    ​మునగాల, సూర్యాపేట జిల్లా:
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ఓ నిరుపేద మహిళను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సమక్షంలోనే బాధితురాలు పురుగుల మందు తాగడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
​అసలేం జరిగింది?
​మునగాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సభ జరుగుతుండగా, తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఒక్కసారిగా అధికారుల ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగింది. దీన్ని గమనించిన పోలీసులు, సిబ్బంది వెంటనే ఆమెను అడ్డుకుని చికిత్స నిమిత్తం హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
​బాధితురాలి ఆవేదన:
​తాడ్వాయి గ్రామాన్ని ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్ట్' కింద ఎంపిక చేసింది. బాధిత మహిళ సునీత తెలిపిన వివరాల ప్రకారం:
​తన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, అధికారులు కావాలని దాన్ని వేరొకరికి కేటాయించారు.
​కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
​పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, కలెక్టర్ ముందే తనువు చాలించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
​అధికారుల స్పందన:
​ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపులో ఏవైనా అక్రమలు జరిగాయా అనే కోణంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
​రాజకీయ కారణాలతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ​ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' మండల సబలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో సర్పంచులు, కౌన్సిలర్లు డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంచాలని, యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఫోటో క్యాప్చర్ లేదా పేమెంట్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ​ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడినట్లు తేలితే పంచాయతీ సెక్రటరీలైనా, ఏఈలైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. "ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అది పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈ అయినా సరే ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేస్తాం. ఇది పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. ఇందులో ఎవరూ అనవసరంగా హైలైట్ కావద్దు (అవినీతికి పాల్పడొద్దు) అని అన్నారు." ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు, సర్పంచులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    1
    మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
​
మహబూబాబాద్ జిల్లా 
మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' మండల సబలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామీణ స్థాయిలో సర్పంచులు, కౌన్సిలర్లు డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంచాలని, యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఫోటో క్యాప్చర్ లేదా పేమెంట్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
​ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడినట్లు తేలితే పంచాయతీ సెక్రటరీలైనా, ఏఈలైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
"ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అది పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈ అయినా సరే ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేస్తాం. ఇది పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. ఇందులో ఎవరూ అనవసరంగా హైలైట్ కావద్దు (అవినీతికి పాల్పడొద్దు) అని అన్నారు."
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు, సర్పంచులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • 14 ఏప్రిల్ 2026: శివకోడు... డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా... జైభీమ్.జయహోఅంభేథ్కర్....
    1
    14 ఏప్రిల్ 2026:
శివకోడు...
డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన
చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన
ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన
విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా...
జైభీమ్.జయహోఅంభేథ్కర్....
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.* :చిలకలూరిపేట::16-04-2026.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*
    1
    *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.*
:చిలకలూరిపేట::16-04-2026.*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.
    1
    రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం
చేసిన గుంటూరు ఎస్పీ 
గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.