Shuru
Apke Nagar Ki App…
పాతపట్నం నీలమణి దుర్గ అమ్మవారి ఆలయము వద్ద ప్లై ఓవర్ పనులు ప్రారంభం పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఓపెన్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ సన్యాసిరావు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు జాతీయ రహదారి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ANR
పాతపట్నం నీలమణి దుర్గ అమ్మవారి ఆలయము వద్ద ప్లై ఓవర్ పనులు ప్రారంభం పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఓపెన్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ సన్యాసిరావు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు జాతీయ రహదారి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
More news from Kakinada and nearby areas
- పిఠాపురం: శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదిన వేడుకల పురస్కరించుకుని సామూహిక వ్రతములు మరియు 101 కళాశాలు ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి 1021వ జన్మదిననీ పురస్కరించుకొని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పిఠాపురం దాతల సహకారంతో పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేసవి దృశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాళం ఆండల్ మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీ మూర్తి త్యాగాన్ని పండగల జరుపుకోవడం అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోచం జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ లు కూడా ఇవ్వడం జరుగుతుందని తద్వారా వారు చేసుకునే వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహనీలకు కొత్త వరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఎంతో చేదోడుగా ఉంటూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అలాగే సామూహిక వ్రతములు నిర్వహించామని అందులో 60 దంపతులతో పైన పాల్గొనడం జరిగిందని,వారికి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంధి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదారిశెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదారశెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్ , పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగేటి సత్యనారాయణమూర్తి (సత్తిపండు), ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.1
- 🙏😭 పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- సూరంపాలెంలో చెరువు దోపిడీ బహిర్గతం – రాత్రివేళల్లో వందల లారీలతో అక్రమ తవ్వకాలు! 📍 వార్త వివరాలు: Aditya Engineering College సమీపంలోని చెరువులో భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి అంధకారాన్ని ఆసరాగా చేసుకుని ఎక్స్కవేటర్ల సహాయంతో చెరువులోని మట్టి, ఇసుకను భారీగా తవ్వి వందలాది లారీల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం, ప్రతి రోజు రాత్రి సమయంలో లారీలు వరుసగా వచ్చి చెరువును ఖాళీ చేస్తుండగా, భారీ యంత్రాల గర్జనలు ఆ ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి. ఈ తవ్వకాల కారణంగా చెరువు ఆకృతి మారిపోతూ, పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. ఇంత పెద్ద స్థాయిలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల నిర్లక్ష్యమా? లేక ఎవరి సహకారంతో ఈ దోపిడీ కొనసాగుతోందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన చెరువులు ఇలాగే నాశనం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం అక్రమ తవ్వకం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో నీటి కొరతకు దారితీసే తీవ్రమైన సమస్యగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ అక్రమ తవ్వకాలపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి చెరువును రక్షించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.1
- Post by Meenakshi1
- 😭🙏1
- ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి గ్రామానికి చెందిన కంభం శ్వేత 14 అనే బాలిక ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అనారోగ్య సమస్యలతో ఏలూరు సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటినుండి చికిత్స పొందుతున్న బాలిక హఠాత్తుగా ఆదివారం సాయంత్రం నోటి నుండి ముక్కు నుండి నురగ కక్కుతూ మృతి చెందింది. బాలిక మృతికి ఏలూరు సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ బంధువులు ఎమర్జెన్సీ వద్ద ఆందోళన చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- కాకినాడ జిల్లా తుని పట్టణం శివారు కోమటి చెరువు ప్రాంతంలో ఆదివారం నాడు చేపల మార్కెట్ ను తలపించేలా మాంసాహార ప్రియులు బారులు తీరారు. చెరువులోని చేపలు పట్టి అక్కడికక్కడే వినియోగదారులకు విక్రయించడం తో స్థానికులు చేపలు కొనడానికి ఎగబడ్డారు. ఈ లైవ్ చేపలను కిలో 150 రూపాయలు చొప్పున కొనుగోలుదారులకు విక్రయించారు.1
- పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చెందుర్తి సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు,రోడ్డు పక్కన ఉన్న హైవే మెయింటెనెన్స్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం... బస్సు అతివేగంగా ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ట్రాఫిక్ను క్లియర్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.2
- 🙏😭1