logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కదులుతున్న కారులో మంటలు.. క్షణాల్లో వాహనం దగ్ధం* తెలంగాణ : హైదరాబాద్‌లోని పెద్దగోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై కదులుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన ఆపి దిగిపోయాడు. అయితే క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో వోల్క్స్‌వాగన్ కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో అక్కడి ప్రాంతంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

15 hrs ago
user_Ramesh Solanki
Ramesh Solanki
स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
15 hrs ago

కదులుతున్న కారులో మంటలు.. క్షణాల్లో వాహనం దగ్ధం* తెలంగాణ : హైదరాబాద్‌లోని పెద్దగోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై కదులుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన ఆపి దిగిపోయాడు. అయితే క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో వోల్క్స్‌వాగన్ కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో అక్కడి ప్రాంతంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

More news from తెలంగాణ and nearby areas
  • సిర్పూర్ టి నియోజకవర్గం అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు గ్రామ పంచాయతీల సమస్యలను ప్రస్తావించారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.1100 కోట్లు పంచాయతీల నిర్వహణకు, కార్మికుల జీతాలకు సరిపోవడం లేదని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేయాలని కోరారు. వర్షాకాలంలో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, వేసవి దృష్ట్యా ప్రతి గ్రామానికి రెండు బోర్వెల్స్ మంజూరు చేయాలని సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ భవనాలు వంటి అభివృద్ధి పనులు ఎక్కువగా కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గానికి కొత్త పెన్షన్లు మంజూరు కాలేదని అసెంబ్లీలో ప్రస్తావించారు.
    1
    సిర్పూర్ టి నియోజకవర్గం అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు గ్రామ పంచాయతీల సమస్యలను ప్రస్తావించారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.1100 కోట్లు పంచాయతీల నిర్వహణకు, కార్మికుల జీతాలకు సరిపోవడం లేదని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేయాలని కోరారు.
వర్షాకాలంలో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, వేసవి దృష్ట్యా ప్రతి గ్రామానికి రెండు బోర్వెల్స్ మంజూరు చేయాలని సూచించారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ భవనాలు వంటి అభివృద్ధి పనులు ఎక్కువగా కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గానికి కొత్త పెన్షన్లు మంజూరు కాలేదని అసెంబ్లీలో ప్రస్తావించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించడం, ఆకలితో బడికి వెళ్లే పిల్లలకు ఉదయం అల్పాహారం అందించడం చీటింగ్ ఎలా అవుతుందో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు నిధులు కేటాయించడం మా నిబద్ధతకు నిదర్శనం. సన్న వడ్లకు బోనస్, ఉద్యోగులందరికీ 1.2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ మరియు క్యాష్‌లెస్ హెల్త్ కార్డ్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఈ బడ్జెట్ ప్రత్యేకతలు. గ్యాస్ సిలిండర్ ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకుని, లబ్ధిదారులకు మేలు జరగకూడదనే కుట్రతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు దురదృష్టకరం. గత పథకాలకు అదనంగా మరిన్ని సంక్షేమ ఫలాలను జోడిస్తూ, పారదర్శకమైన పాలన అందించడమే మా లక్ష్యం.
    1
    1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించడం, ఆకలితో బడికి వెళ్లే పిల్లలకు ఉదయం అల్పాహారం అందించడం చీటింగ్ ఎలా అవుతుందో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి.
రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు నిధులు కేటాయించడం మా నిబద్ధతకు నిదర్శనం. సన్న వడ్లకు బోనస్, ఉద్యోగులందరికీ 1.2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ మరియు క్యాష్‌లెస్ హెల్త్ కార్డ్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఈ బడ్జెట్ ప్రత్యేకతలు.
గ్యాస్ సిలిండర్ ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకుని, లబ్ధిదారులకు మేలు జరగకూడదనే కుట్రతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు దురదృష్టకరం. గత పథకాలకు అదనంగా మరిన్ని సంక్షేమ ఫలాలను జోడిస్తూ, పారదర్శకమైన పాలన అందించడమే మా లక్ష్యం.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    11 hrs ago
  • జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం మ. 3 గంటలకు జన్నారంతో పాటు పలు గ్రామాలలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే దండేపల్లిలో 38 డిగ్రీలు, లక్షెట్టిపేట 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచించారు.
    1
    జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం మ. 3 గంటలకు జన్నారంతో పాటు పలు గ్రామాలలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే దండేపల్లిలో 38 డిగ్రీలు, లక్షెట్టిపేట 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచించారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామ నవమి సందర్బంగా గోపాలకృష్ణ మఠం నుండి శ్రీరాముని విగ్రహంతో వైభవంగా శోభయాత్ర ప్రారంభమైదీ
    1
    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామ నవమి సందర్బంగా గోపాలకృష్ణ మఠం నుండి శ్రీరాముని విగ్రహంతో వైభవంగా శోభయాత్ర ప్రారంభమైదీ
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    23 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    4 hrs ago
  • కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేశారని బండి సంజయ్ అన్నారు. శనివారం తంగళ్ళపల్లి మండలం వెంక రెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు.
    1
    కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేశారని బండి సంజయ్ అన్నారు. శనివారం తంగళ్ళపల్లి మండలం వెంక రెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • ఆరు గ్యారంటీల ద్వారా ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు లు లేవు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా మోసం చేసింది కాంగ్రెస్ నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తాం వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ BRS నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో హామీలు ఇచ్చి గడిచిన రెండు సంవత్సరాలుగా 6 గ్యారంటీ అమలుపరచకుండా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను మోసం చేసిందని బాల్కొండ నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు విమర్శించారు అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలో అమలు కోసం నిధులు కూడా కేటాయించకుండా ఇంకా కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంది అని విమర్శించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కింది అని అన్నారు మేము అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తాం అని ఎన్నికల్లో ప్రతి వేదికలో చెప్పారు ప్రజలను నమ్మించడానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనాడు గ్యారంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టింది కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి 25 నెలలు కావస్తుంది కానీ ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయలేదు. పథకాల అమలు తక్కువ... ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు. 25 నెలలుగా 2500 చొప్పున 60 000 కాంగ్రెస్ ప్రతి మహిళకు బాకీ పడింది.ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు వృద్దులకు, బీడీ పెన్షన్ వాళ్లకు అధికారం లోకి రాగానే 4000 పెన్షన్ చేస్తాం అన్నారు కానీ కేసీఆర్ ఇచ్చిన 2000 మాత్రమే ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో పెన్షన్ ల పెంపు ఊసే లేదని అన్నారు. దివ్యంగులకు పెంచుతామన్న 6000 పెన్షన్ అమలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు. రైతు భరోసా 15,000, కౌలు రైతులకు 15 వేలు, రుణమాఫీ కానీ వారికీ 2,00,000 రుణమాఫీ ఈ బడ్జెట్ లో ప్రస్థావించలేదు. విద్యాభరోసా కార్డు 5,00,000 ఇస్తామన్నారు నిధుల కేటాయింపు లేదు. ఉపాధి హామీ కూలీలకు, ఆటో డ్రైవర్లకు సంవత్సరం కు 12,000 చొప్పున ఇస్తామని ఆరు గ్యారఆంటీల్లో చెప్పి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్,నిరుద్యోగ భృతి విద్యార్థులకు స్కూటి లు, ఫీ రియంబర్స్మెంట్ లను విస్మరించింంది ఇప్పటి వరకు పెళ్లిళ్లు అయినా ఆడబిడ్డలకు తులం బంగారం మాట బడ్జెట్ లో ఎత్తలేదు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి బడ్జెట్ లో నిదులు కేటాయించకుండా ప్రజలను నమ్మించి మోసం చేసింది.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన BRS పార్టీ పోరాటం చేస్తుంది కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసిన మోసలను ప్రజాక్షేత్రం లో ఎండగడుతుంది. ఈ మీడియా సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి,బద్దం ప్రవీణ్ రెడ్డి బాల్కొండ,కల్లెడ ఏలీయా, ప్రెసిడెంట్,దాసరి వెంకటేష్, రేగుంట దేవేందర్, జైడి నాగధర్,బద్దం రవి ,బద్దం నర్సారెడ్డి ,రేగుల్ల రాములు,దొంకంటి నర్సయ్య, చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేష,రాజా పూర్ణనందం,కొలిపాక ఉపేందర్,శ్రీకాంత్, గడ్డం స్వామి, ఏలేటి రమేష్,ప్రతాప్ ,భోజపల్లి సురేష్ లోలపు సుమన్,బూరుకల కమలాకర్ డోల్ల రాజేశ్వర్,గంగారెడ్డి నడ్కుడా, నారాయణ, గంగాధర్, సూర్జీల్, శ్రీనివాస్, శంకర్ గౌడ్, ఉమా శంకర్,ఆనంద్, యూసుఫ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు
    1
    ఆరు గ్యారంటీల ద్వారా ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు లు లేవు
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా మోసం చేసింది
కాంగ్రెస్ నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తాం
వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ BRS నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో హామీలు ఇచ్చి గడిచిన రెండు సంవత్సరాలుగా 6 గ్యారంటీ అమలుపరచకుండా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను మోసం చేసిందని బాల్కొండ నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు విమర్శించారు
అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలో అమలు కోసం నిధులు కూడా కేటాయించకుండా ఇంకా కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంది అని విమర్శించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కింది అని అన్నారు
మేము అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తాం అని  ఎన్నికల్లో ప్రతి వేదికలో చెప్పారు
ప్రజలను నమ్మించడానికి ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అనాడు గ్యారంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టింది
కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి 25 నెలలు కావస్తుంది కానీ ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయలేదు.
పథకాల అమలు తక్కువ... ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది
ఆరు గ్యారంటీల్లో భాగంగా
ప్రతి మహిళకు 2500 ఇస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు.
25 నెలలుగా 2500 చొప్పున 60 000 కాంగ్రెస్ ప్రతి మహిళకు బాకీ పడింది.ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు
వృద్దులకు, బీడీ పెన్షన్ వాళ్లకు  అధికారం లోకి రాగానే 4000 పెన్షన్ చేస్తాం అన్నారు కానీ కేసీఆర్ ఇచ్చిన 2000 మాత్రమే ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో పెన్షన్ ల పెంపు ఊసే లేదని అన్నారు.
దివ్యంగులకు పెంచుతామన్న 6000 పెన్షన్ అమలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు.
రైతు భరోసా 15,000, కౌలు రైతులకు 15 వేలు, రుణమాఫీ  కానీ వారికీ 2,00,000 రుణమాఫీ ఈ బడ్జెట్ లో ప్రస్థావించలేదు.
విద్యాభరోసా కార్డు 5,00,000 ఇస్తామన్నారు నిధుల కేటాయింపు లేదు.
ఉపాధి హామీ కూలీలకు, ఆటో డ్రైవర్లకు సంవత్సరం కు 12,000 చొప్పున  ఇస్తామని ఆరు గ్యారఆంటీల్లో చెప్పి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు
విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్,నిరుద్యోగ భృతి
విద్యార్థులకు స్కూటి లు, ఫీ రియంబర్స్మెంట్ లను విస్మరించింంది
ఇప్పటి వరకు పెళ్లిళ్లు అయినా ఆడబిడ్డలకు తులం బంగారం మాట బడ్జెట్ లో ఎత్తలేదు
ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి బడ్జెట్ లో నిదులు కేటాయించకుండా ప్రజలను నమ్మించి మోసం చేసింది..
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన BRS పార్టీ పోరాటం చేస్తుంది 
కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసిన మోసలను ప్రజాక్షేత్రం లో ఎండగడుతుంది.
ఈ మీడియా సమావేశంలో 
నాగంపేట్ శేఖర్ రెడ్డి,బద్దం ప్రవీణ్ రెడ్డి బాల్కొండ,కల్లెడ ఏలీయా, ప్రెసిడెంట్,దాసరి వెంకటేష్, రేగుంట దేవేందర్, జైడి నాగధర్,బద్దం రవి ,బద్దం నర్సారెడ్డి ,రేగుల్ల రాములు,దొంకంటి నర్సయ్య, చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేష,రాజా పూర్ణనందం,కొలిపాక ఉపేందర్,శ్రీకాంత్, గడ్డం స్వామి, ఏలేటి రమేష్,ప్రతాప్ ,భోజపల్లి సురేష్ లోలపు సుమన్,బూరుకల కమలాకర్ డోల్ల రాజేశ్వర్,గంగారెడ్డి నడ్కుడా, నారాయణ, గంగాధర్, సూర్జీల్, శ్రీనివాస్, శంకర్ గౌడ్, ఉమా శంకర్,ఆనంద్, యూసుఫ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ఏపీలోని కర్నూలు జిల్లా అటికెలగుండులో పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరామనవమి పురస్కరించుకుని నిర్వహించిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్న వంశీ (19) అనే యువకుడు ఆడుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో వంశీ మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
    1
    ఏపీలోని కర్నూలు జిల్లా అటికెలగుండులో పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరామనవమి పురస్కరించుకుని నిర్వహించిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్న వంశీ (19) అనే యువకుడు ఆడుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో వంశీ మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.