Shuru
Apke Nagar Ki App…
కబడ్డీ ఆడుతూ 19 ఏళ్ల యువకుడు మృతి! ఏపీలోని కర్నూలు జిల్లా అటికెలగుండులో పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరామనవమి పురస్కరించుకుని నిర్వహించిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్న వంశీ (19) అనే యువకుడు ఆడుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో వంశీ మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
Ramesh Solanki
కబడ్డీ ఆడుతూ 19 ఏళ్ల యువకుడు మృతి! ఏపీలోని కర్నూలు జిల్లా అటికెలగుండులో పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరామనవమి పురస్కరించుకుని నిర్వహించిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్న వంశీ (19) అనే యువకుడు ఆడుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో వంశీ మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
More news from తెలంగాణ and nearby areas
- Post by KR NEWS 3691
- ఎరువుల కొరత కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.1
- కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలిపారు. గౌరవం ఉన్న చోటే నాయకులు ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పార్టీ లోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామన్నారు. హైకమాండే సుప్రీం అని, క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుందని చెప్పారు. ప్రజల సేవ కోసం పార్టీ వేదికగా ఉంటుందన్నారు. కుటుంబ సంబంధాలు కాదు.. కేవలం కమిట్మెంట్ ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు.1
- మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ వెంటనే సిద్ధం చేయాలని, స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సందర్శించి అభివృద్ధి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి దర్శనం కోసం అనేకమంది భక్తులు వస్తుంటారని, వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు సౌలభ్యాలు ఆలయ అభివృద్ధి పై వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆర్చి నిర్మాణం, రోడ్డు విస్తరణ, కళ్యాణ కట్ట, కళ్యాణ మండపం, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, ఇతర ఆలయ అభివృద్ధి పనులపై త్వరితగతిన నివేదికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఆచార సాప్రదాయాలకు ఆటంకం కలగకుండా ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్కిటెక్ బృందం, దేవాదాయ శాఖ డి ఈ రమేష్ బాబు, తాసిల్దార్ తోట రవీందర్, ఆలయ ఈవో మహేష్, ఎంపీడీవో బద్రు నాయక్, ఆలయ అర్చకులు, సంబంధిత అధికారులు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు2
- నిజామాబాద్ హమాల్వాడిలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో DJ వినియోగానికి అనుమతి లేదంటూ పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన MLA.. స్వయంగా DJ వాహనం స్టీరింగ్ పట్టి ముందుకు నడిపించడం చర్చనీయాంశమైంది.1
- तेलंगाना का यह अस्पताल जन्मजात दिल की बीमारी से पीड़ित बच्चों को देता है मुफ्त इलाज, इस नंबर पर अपॉइंटमेंट बुक करें बच्चों में जन्मजात दिल की बीमारी (CHD) में जन्म के समय दिल की बनावट से जुड़ी समस्याएं होती हैं, जो लगभग 1 प्रतिशत बच्चों को प्रभावित करती हैं. इसके लक्षणों में नीली त्वचा (सायनोसिस), तेजी से सांस लेना, ठीक से खाना न खाना, खाना खाते समय पसीना आना और वजन कम बढ़ना शामिल हैं. हालांकि कुछ कमियां गंभीर होती हैं और तुरंत देखभाल की जरूरत होती है, लेकिन कई का इलाज सर्जरी या मैनेजमेंट से किया जा सकता है. श्री सत्य साईं संजीवनी सेंटर में होता है मुफ्त इलाज इस समस्या को देखते हुए तेलंगाना के सिद्दीपेट जिले के कोंडापाका में श्री सत्य साईं संजीवनी सेंटर फॉर चाइल्ड हार्ट केयर एंड रिसर्च, जन्मजात दिल की बीमारियों के साथ पैदा हुए बच्चों का मुफ्त इलाज कर रहा है, जिसमें ओपन-हार्ट सर्जरी और एडवांस्ड कार्डियक इंटरवेंशन शामिल हैं. संस्था के चेयरमैन, डॉ. सी. श्रीनिवास के अनुसार, यह अस्पताल जन्मजात दिल की बीमारियों के साथ पैदा हुए बच्चों के इलाज के लिए समर्पित है. डॉ. श्रीनिवास ने कहा कि अब तक भारत और 14 दूसरे देशों के 233 बच्चों की सफलतापूर्वक ओपन-हार्ट सर्जरी हो चुकी है, जबकि 103 बच्चों को एडवांस्ड कार्डियक इंटरवेंशन मिले हैं, जिससे कुल 336 लोगों की जान बच गई है.1
- తెలంగాణ : హైదరాబాద్లోని పెద్దగోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై కదులుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన ఆపి దిగిపోయాడు. అయితే క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో వోల్క్స్వాగన్ కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో అక్కడి ప్రాంతంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.1
- ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన ఆశా వర్కర్ల చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ మహాధర్నాకు సిరిసిల్ల నుండి వెళ్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలో కి వస్తే ఆశా వర్కర్ల కి నెలకి 18 వేల రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని ఇస్తామని,పని భద్రత కల్పిస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆశాలకు రావలసిన పారితోషకాలు కూడా సకాలంలో ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి ఆశ వర్కర్ల పైన చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీల కోసం బడ్జెట్ కేటాయించాలని లేకుంటే రానున్న రోజుల్లో పోరాటాలు , ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.2
- జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ శివారులో రెండు రోజుల క్రితం ప్రేమ జంట అదృశ్యంకాగ ప్రియుడి మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్ లో లభించడంతో కలకలం సృష్టిస్తుంది. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతి, మహారాష్ట్ర కు చెందిన వలస కూలీ అంకుశ్ ప్రేమించుకున్నారు. యువతికి బైక్ నేర్పే క్రమంలో బైక్ తో సహా ఇద్దరు కెనాల్ లో పడినట్లు భావిస్తున్నారు. కోరుట్ల మండలం గుమ్లాపూర్ శివారులో అంకుస్ మృతదేహం లభించింది. మృతదేహంతో పాటు బైక్ ను వెలికి తీశారు. యువతి ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కోసం గాలిస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం బైక్ పై ఒక్కడే వెళ్లాడని చెబుతుండగా యువతి ఆచూకీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.3