మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వస్తానంటే స్వాగతిస్తాం...ఎమ్మెల్సీ ఎల్...పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలిపారు. గౌరవం ఉన్న చోటే నాయకులు ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పార్టీ లోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామన్నారు. హైకమాండే సుప్రీం అని, క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుందని చెప్పారు. ప్రజల సేవ కోసం పార్టీ వేదికగా ఉంటుందన్నారు. కుటుంబ సంబంధాలు కాదు.. కేవలం కమిట్మెంట్ ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వస్తానంటే స్వాగతిస్తాం...ఎమ్మెల్సీ ఎల్...పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలిపారు. గౌరవం ఉన్న చోటే నాయకులు ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పార్టీ లోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామన్నారు. హైకమాండే సుప్రీం అని, క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుందని చెప్పారు. ప్రజల సేవ కోసం పార్టీ వేదికగా ఉంటుందన్నారు. కుటుంబ సంబంధాలు కాదు.. కేవలం కమిట్మెంట్ ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు.
- సిరిసిల్ల పట్టణంలోని స్థానిక నెహ్రు నగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల రథోత్సవ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని రథోత్సవ ఊరేగింపు కార్యక్రమంను ప్రారంభించారు.ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ లోకానికి ఆదర్శ దంపతులైన శ్రీసీతారాముల దంపతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక నెహ్రు నగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించి ఉత్సవ దేవత విగ్రహాలతో ఘనంగా పురవీధుల గుండ ఊరేగిస్తూ నిర్వహిస్తున్న రథోత్సవ కార్యక్రమాన్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవటం లేదని ఈ రథోత్సవంలో ప్రతి ఒక్కరి మదిలో శ్రీ సీతారాముల వారిని స్మరించుకుంటూ పలుకుతున్న రామనామ స్మరణతో పరిసరాలన్నీ మారుమోగుతూ ఒక కొత్త ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడిందని అన్నారు.భక్తుల కోరిన కోరికలు తీర్చే దేవుడిగా నిత్యం ప్రజలచే పూజనందుకుంటున్నారని శ్రీ సీతారామాంజనేయుల చల్లని దీవెనలతో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని ప్రజలందరూ వారి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెంది సంతోషంగా ఉండేలా చూడాల్సిందిగా శ్రీ సీతారామాంజనేయ స్వామి వారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు దూడం రజిని శ్రీనివాస్ ఎర్ర వెంకట రాజం గారు, బొద్దుల శ్రీనివాస్ , మెరుగు మంజుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గుండ్లపళ్లి రామానుజన్, పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, పద్మశాలి కళ్యాణ భావన అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ గారు, పుర ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ములుగు జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని జిల్లా జడ్జి సూర్య చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా 4 బెంచ్ల ద్వారా మొత్తం 1,117 కేసులను పరిష్కరించారు. పలు కేసుల్లో రూ.1.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించారు. దీర్ఘకాలిక వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని జడ్జి సూచించారు.1
- ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.4
- Post by Venu Gopal1
- ఎన్ హెచ్ 164 ఘట్కేసర్ టు కె పాల్ వెళ్లే రహదారిలో పంటలకు కారు దహనం అయినది.....కార్1
- హైదరాబాద్లో ఆశా కార్యకర్తలు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకుని పలువురిని అక్రమంగా అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశాలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయలేరని, పోరాటం మరింత ఉద్ధృతం అవుతుందని నాయకులు హెచ్చరించారు.3
- ఆశ వర్కర్ల ఆందోళన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ ఆశ వర్కర్లు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఆశా వర్కర్లను రేణికుంట టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాజీవ్ రహదారిపై ఆశావర్కర్ల నిరసన తెలిపారు. పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. పట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి హైదరాబాదుకు బయలుదేరి ఆశ వర్కర్లను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన తేలిపితే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంపై ఆశ వర్కర్లతో పాటు సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.4
- సిరిసిల్ల పట్టణంలోని మూడవ వార్డు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం వేళ సీతారామచంద్రమూర్తిలను పురవీధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మరియు పుర ప్రముఖులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ములుగు జిల్లా కేంద్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ దివాకర సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మిల్లింగ్, చెల్లింపుల సమస్యలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం అసోసియేషన్ రూపొందించిన డైరీని ఆవిష్కరించారు.1