Shuru
Apke Nagar Ki App…
Nirmal Dand ..../../... /././
KR NEWS 369
Nirmal Dand ..../../... /././
More news from తెలంగాణ and nearby areas
- ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని ప్రకటించనున్నట్లు నిజామాబాదు మాజీ ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో ఆమె మీడియాతో మాట్లాడారు.. ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు మేడ్చల్ లోని మునీరాబాద్ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్లు కవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి జాగృతి కార్యకర్తలు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.1
- జన్నారంలోని వివిధ కాలనీల ప్రజలు శ్రీ సీతారాముల విగ్రహాలకు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా జన్నారంలోని రామాలయంలో శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. రాత్రి దేవాలయంలోని సీతారాముల మూల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి జన్నారంలోని పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. సీతారాముల విగ్రహాలకు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారు.1
- Post by Venu Gopal1
- పత్రిక ప్రకటన. తేది:28.03.2026. కామారెడ్డి జిల్లా శనివారం. .. *గుడ్డును తూకం వేసి బరువును పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* . .... మద్నూర్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్లోని స్టోర్ రూమ్ను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ముఖ్యంగా గుడ్ల పరిమాణం, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, స్వయంగా గుడ్లను తూకం వేసి వాటి బరువును పరిశీలించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా గుడ్ల బరువు ఉందో లేదో తనిఖీ చేస్తూ, తక్కువ బరువుతో సరఫరా అవుతున్నాయా అన్న అంశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తక్కువ బరువుతో గుడ్లు సరఫరా అయితే సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, సరఫరాలో నాణ్యత లోపాలు ఉంటే గుత్తేదారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న ఆహారం, వసతులపై ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, విద్యార్థులకు పోషకాహారం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్కూల్ లో శుభ్రత, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట deo రాజు, dco రామ్మోహన్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సాఫల్యానికి కృషి చేసిన ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.1
- సిర్పూర్ టి నియోజకవర్గం అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు గ్రామ పంచాయతీల సమస్యలను ప్రస్తావించారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.1100 కోట్లు పంచాయతీల నిర్వహణకు, కార్మికుల జీతాలకు సరిపోవడం లేదని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేయాలని కోరారు. వర్షాకాలంలో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, వేసవి దృష్ట్యా ప్రతి గ్రామానికి రెండు బోర్వెల్స్ మంజూరు చేయాలని సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ భవనాలు వంటి అభివృద్ధి పనులు ఎక్కువగా కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గానికి కొత్త పెన్షన్లు మంజూరు కాలేదని అసెంబ్లీలో ప్రస్తావించారు.1
- శ్రీరామచంద్రుడి కృపాకటాక్షాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా చారిత్రక ఖిల్లా రామాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చేరాలని కోరుకున్నట్లు తెలిపారు.1
- దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో సీతారాముల విగ్రహాలతో పల్లకి సేవ శోభాయాత్రలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని గురువారం రాత్రి మండలంలోని చింతపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు హనుమాన్ భక్తులు శ్రీ సీతారాముల మూల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. శ్రీ రాముడు, హనుమాన్ భక్తి పాటలతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది.1
- పత్రిక ప్రకటన తేది:28.03.2026 కామారెడ్డి జిల్లా . శనివారం. .. వైస్ చైర్మన్, మెనెజింగ్ డైరెక్టర్ (SATG), హైదరాబాద్ తెలంగాణ క్రీడా స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్ వారి ఆదేశాల మేరకు , జిల్లా కలెక్టర్ అనుమతితో తేదీ :28.03.2026 నాడు ఇందిరా గాంధీ స్టేడియం, కామారెడ్డి జిల్లా నందు తెలంగాణ క్రీడా స్పోర్ట్స్ స్కూల్స్ లో నాల్గవ తరగతి అడ్మిషన్స్ కొరకు జిల్లా స్థాయి సెలెక్షన్స్ ప్రక్రియ జిల్లా యువజన, క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ ఆథ్వర్యంలో నిర్వహించబడినవి. ఈ ప్రక్రియలో (09) అంశాల నందు పిల్లల శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించబడినవి. ఈ పోటీల్లో కామారెడ్డి జిల్లాకు చెందిన 25 మండలాల నుండి దాదాపు (80) మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వారి సామర్థ్యములను నిరూపించుకోవటం జరిగింది. వీరిలో రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల ఎంపిక కొరకు ఎంపిక అయిన (10) మంది విద్యార్థిని (10) విద్యార్థులు ఎంపిక చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో SGF సెక్రటరీ. హీరాలాల్, కామారెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, మాజీ SGF సెక్రటరీ, పి.వెంకట్, నాయబ్ రసూల్ క్రీడా స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ కమిటి మెంబెర్స్ నిర్వహించుటకు సహకరించిన వ్యాయమ ఉపాధ్యాయులు సాయి మౌర్య , వై నర్సింహారెడ్డి, నరేష్ రెడ్డి, అనిల్ కుమార్, లక్ష్మన్ రాథోడ్, పి.అశోక్, కేసురేష్, జె మోహన్ రెడ్డి, బాణాల భాస్కర్ రెడ్డి, బి అరుణ, కే. స్వప్న , యం. విజయ లక్ష్మి, బి. రేణుక, పి సంజీవులు , జిల్లా యువజన, క్రీడల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.1