Shuru
Apke Nagar Ki App…
అలర్ట్.. గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు! గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య ఉన్న కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే దేశీయంగా ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తిని భారీగా పెంచాలని రిఫైనరీ కంపెనీలకు కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా గృహావసరాలకు వాడే సిలిండర్ల సరఫరాకే ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో సామాన్యులకు ఎంతో మేలు జరగనుంది.
Duppada Anandarao
అలర్ట్.. గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు! గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య ఉన్న కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే దేశీయంగా ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తిని భారీగా పెంచాలని రిఫైనరీ కంపెనీలకు కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా గృహావసరాలకు వాడే సిలిండర్ల సరఫరాకే ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో సామాన్యులకు ఎంతో మేలు జరగనుంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎచ్చెర్ల మండలం జరజం గ్రామ పరిధిలోని NH16పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన కారు ఆటోలోని ప్యాసింజర్లు ఎగిరిపడగా, ఒకరు మృతిచెందినట్లు, మరో 12 మంది గాయాలపాలైనట్లు సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు1
- భారతదేశం గర్వించదగ్గ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అని ఆయనపై వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ నేతలు రామ్మోహన్ నాయుడు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.వరల్డ్ ఎకానమీ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న కేంద్రమంత్రి జిల్లాకు గర్వకారణం అని అన్నారు. జిల్లాకు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన అభివృద్ధి వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం మార్చి 9. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిష్ట అనంతరం భక్తులు స్వామివారి దర్శనార్థమై పోటెత్తారు. భక్తులందరూ ప్రతిష్ట అయిన స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరించారు అనంతరం స్వామివారి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి మహా ప్రవచన కార్యక్రమాలు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.2
- డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.1
- Post by Shyam1
- అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో పట్టాదారు భూమిపై వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన డేగల అప్పారావు పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 28-2లో ఎకరం 20 సెంట్ల సొంత పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామకంఠం భూమిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామకంఠానికి సంబంధించి సర్వే నెంబర్ 28-1లో ఇప్పటికే భూమి ఉండగా, అప్పారావు పట్టా భూమిని బలవంతంగా గ్రామకంఠంగా చూపించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివెనుక ప్రభావశీలులైన కొందరు పెద్దల రాజకీయ హస్తం ఉందేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.1
- चीन ने हांगकांग-झुहाई-मकाऊ (HZMB) ब्रिज के रूप में दुनिया का सबसे लंबा समुद्री पुल बनाया है, जो 55 किमी लंबा है। अक्टूबर 2018 में खुला यह पुल 3 शहरों को जोड़ता है और इसका एक महत्वपूर्ण 6.7 किमी हिस्सा समुद्र के नीचे एक टनल के रूप में बना है, जिससे यात्रा का समय 4 घंटे से घटकर 30 मिनट हो गया है।1
- పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. పురుష ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులను ఆత్మీయ సత్కారము చేశారు. ఆడదే ఆధారం అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం సందేశాన్ని అందించారు. మహిమ కలదే మహిళా అని సంస్కృత పండితులు బౌరోతు శంకర్రావు తెలియజేశారు. ఉపాధ్యాయులు రమేష్ కుమార్ నారాయణ రావు విద్యార్థులు పాల్గొన్నారు1