వంటిమామిడి – చిన్న తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి ములుగు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినారు. తేదీ: 09-05-2026 నాడు మధ్యాహ్న సమయంలో ములుగు ఎస్సై గారు మరియు పోలీసు సిబ్బంది కలిసి వంటిమామిడి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో ఒక వ్యక్తి చిన్న తిమ్మాపూర్ గ్రామ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా, అతను తన పేరు పుత్రకొండ బాలకృష్ణ, తండ్రి: ప్రకాష్, వయస్సు: 25 సంవత్సరాలు, కులం: కాపు, వృత్తి: కూలి, స్వగ్రామం: నులకజోడు గుర్రండి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం నివాసం: మజీద్పూర్, శామీర్పేట్, మేడ్చల్ జిల్లా అని తెలిపినాడు. ఇతనిపై గతంలో షామీర్పేట్ మరియు జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించినాడు. విచారణలో భాగంగా నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ: 04-05-2026 నాడు మధ్యాహ్న సమయంలో తాను మడిగెల బాలచందర్ S/o సత్యనారాయణ, వయస్సు: 25 సంవత్సరాలు, R/o పెద్దమ్మ కాలనీ, శామీర్పేట్ మండలం, మేడ్చల్ జిల్లా మరియు ఇప్పలపల్లి నరేష్ @ నాచు S/o సత్యనారాయణ, వయస్సు: 24 సంవత్సరాలు, R/o జవహర్ నగర్, దమ్మాయిగూడ, మేడ్చల్ జిల్లా వారితో కలిసి తనకు చెందిన TS-36-H-2863 Yamaha R-15 మోటార్ సైకిల్పై వంటిమామిడి (చిన్న తిమ్మాపూర్) గ్రామానికి వచ్చారని తెలిపినాడు. అక్కడ ఒక హార్డ్వేర్ షాప్లో ఇనుప రాడ్ తీసుకొని, చిన్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శాలివాహిని నర్సింలు S/o బాలయ్య, వయస్సు: 54 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం గారి ఇంటి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు మరియు నగదు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంగతనం అనంతరం ముగ్గురూ కలిసి మజీద్పూర్కు వెళ్లగా, బాలచందర్ దొంగిలించిన బంగారం, వెండి మరియు నగదును కొద్ది రోజుల పాటు ఎవరికి అనుమానం రాకుండా దాచిపెట్టి, తరువాత ముగ్గురం పంచుకుందామని చెప్పి, బాలకృష్ణను అక్కడ దించి, అతని బైక్పై మిగతా ఇద్దరూ వెళ్లినట్లు తెలిపినాడు. అలాగే, వంటిమామిడి – చిన్న తిమ్మాపూర్ ప్రాంతంలో చేసిన దొంగతనం కేసులో పోలీసులు తమను గుర్తించలేదని భావించి, మళ్లీ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో బాలకృష్ణ ఈరోజు గతంలో ఉపయోగించిన ఇనుప రాడ్ తీసుకొని తాళం వేసి ఉన్న ఇండ్లను గమనిస్తూ తిరుగుతుండగా చెక్పోస్ట్ సమీపంలో ములుగు పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించినాడు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినారు. కేసులో పాల్గొన్న మిగతా ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిని త్వరలోనే అరెస్ట్ చేసి దొంగిలించిన సొత్తును రికవరీ చేయనున్నట్లు గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ డి. రవిరాజు గారు తెలిపారు. అలాగే, నిందితుడిని పట్టుకున్న ములుగు ఎస్సై గారిని మరియు పోలీసు సిబ్బందిని గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అభినందించారు.
వంటిమామిడి – చిన్న తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి ములుగు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినారు. తేదీ: 09-05-2026 నాడు మధ్యాహ్న సమయంలో ములుగు ఎస్సై గారు మరియు పోలీసు సిబ్బంది కలిసి వంటిమామిడి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో ఒక వ్యక్తి చిన్న తిమ్మాపూర్ గ్రామ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా, అతను తన పేరు పుత్రకొండ బాలకృష్ణ, తండ్రి: ప్రకాష్, వయస్సు: 25 సంవత్సరాలు, కులం: కాపు, వృత్తి: కూలి, స్వగ్రామం: నులకజోడు గుర్రండి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం నివాసం: మజీద్పూర్, శామీర్పేట్, మేడ్చల్ జిల్లా అని తెలిపినాడు. ఇతనిపై గతంలో షామీర్పేట్ మరియు జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించినాడు. విచారణలో భాగంగా నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ: 04-05-2026 నాడు మధ్యాహ్న సమయంలో తాను మడిగెల బాలచందర్ S/o సత్యనారాయణ, వయస్సు: 25 సంవత్సరాలు, R/o పెద్దమ్మ కాలనీ, శామీర్పేట్ మండలం, మేడ్చల్ జిల్లా మరియు ఇప్పలపల్లి నరేష్ @ నాచు S/o సత్యనారాయణ, వయస్సు: 24 సంవత్సరాలు, R/o జవహర్ నగర్, దమ్మాయిగూడ, మేడ్చల్ జిల్లా వారితో కలిసి తనకు చెందిన TS-36-H-2863 Yamaha R-15 మోటార్ సైకిల్పై వంటిమామిడి (చిన్న తిమ్మాపూర్) గ్రామానికి వచ్చారని తెలిపినాడు. అక్కడ ఒక హార్డ్వేర్ షాప్లో ఇనుప రాడ్ తీసుకొని, చిన్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శాలివాహిని నర్సింలు S/o బాలయ్య, వయస్సు: 54 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం గారి ఇంటి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు మరియు నగదు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంగతనం అనంతరం ముగ్గురూ కలిసి మజీద్పూర్కు వెళ్లగా, బాలచందర్ దొంగిలించిన బంగారం, వెండి మరియు నగదును కొద్ది రోజుల పాటు ఎవరికి అనుమానం రాకుండా దాచిపెట్టి, తరువాత ముగ్గురం పంచుకుందామని చెప్పి, బాలకృష్ణను అక్కడ దించి, అతని బైక్పై మిగతా ఇద్దరూ వెళ్లినట్లు తెలిపినాడు. అలాగే, వంటిమామిడి – చిన్న తిమ్మాపూర్ ప్రాంతంలో చేసిన దొంగతనం కేసులో పోలీసులు తమను గుర్తించలేదని భావించి, మళ్లీ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో బాలకృష్ణ ఈరోజు గతంలో ఉపయోగించిన ఇనుప రాడ్ తీసుకొని తాళం వేసి ఉన్న ఇండ్లను గమనిస్తూ తిరుగుతుండగా చెక్పోస్ట్ సమీపంలో ములుగు పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించినాడు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినారు. కేసులో పాల్గొన్న మిగతా ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిని త్వరలోనే అరెస్ట్ చేసి దొంగిలించిన సొత్తును రికవరీ చేయనున్నట్లు గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ డి. రవిరాజు గారు తెలిపారు. అలాగే, నిందితుడిని పట్టుకున్న ములుగు ఎస్సై గారిని మరియు పోలీసు సిబ్బందిని గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అభినందించారు.
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- సికింద్రాబాద్లోని జవహర్నగర్లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.1
- తెలంగాణ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బూతు పురాణంతో వార్తల్లో నిలిచారు. అధికారం రాగానే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.1
- నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి:బీజేపీ ఎంపీ బండి సంజయ్ నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాలను బిజెపి కార్యకర్తలు ప్రజలు నమ్మవద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సామాన్యంగా కార్యకర్తగా కాషాయం జెండాను భుజంపై ఎత్తుకొని కేంద్రమంత్రి అయ్యానని కాలర్ ఎగర వేసుకొని నేను బిజెపి కార్యకర్తలు అని చెప్పుకుంటానని తెలిపారు. తండ్రుల పేర్లు చెప్పి నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.1
- నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము1
- కేంద్ర సహాయ శాఖ హోంమంత్రి బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి.. బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. మదర్స్ డే రోజున హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాధానం చెప్పాలని అన్నారు.మోడీ ప్రసంగం ప్రారంభించక ముందే బండి సంజయ్ను పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ప్రజలు ప్రధాని మాటలను పట్టించుకోరనివ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రేవంత్ రెడ్డి హోంమంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఒక మైనర్ బాలిక ఎఫ్ఐఆర్ నమోదు కోసం గంటల తరబడి పోలీస్ స్టేషన్లో వేచి ఉండాల్సి రావడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు.మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఉపయోగపడే ఒక్క మాట కూడా బండి సంజయ్ మాట్లాడలేదని, రేవంత్ రెడ్డి ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణపై ప్రధాని మోదీకి ప్రేమ లేదని, విభజన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.1